ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు.
చిలకలూరిపేట :- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్రెడ్డి రాక్షస పాలనకు చిరునామాగా మారారని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు అన్నారు. మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చిలకలూరిపేట 32వ వార్డు శాంతినగర్లోని శాంతినిలయం చర్చిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శరత్ క్షేమంగా ఉండాలని.. త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు దయతో వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసుల నుంచి శరత్ నిర్దోషిగా బయటకు వస్తారని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్రెడ్డి ఏపీఎస్డీఆర్ఐని అడ్డంపెట్టుకొని శరత్పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేయడం, బెదిరించడం, లొంగకపోతే కేసులు పెట్టడం అధికారపార్టీకి మాములైందన్నారు. శరత్ను అక్రమ నిర్బంధం నుంచి విడుదల చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g