చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి
చిలకలూరిపేట:- జాతీయ బీసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి,నర్సరావు పేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి మల్లెల రాజేష్ నాయుడుకు మంగళవారం వినతిపత్రం అందించడం జరిగింది. పట్టణ ములోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో భాగంగా కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాదాసు పృధ్వీరాజ్ సాయి, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ఆలా శివ గోపి,మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాచపూడి వెంకట్ మాట్లాడుతూ నరసరావుపేట రోడ్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో బి.సి సామాజిక వర్గానికి 53 సెంట్లు భూమి, భవన నిర్మాణానికి కేటాయించడం జరిగిందని, ఆ స్థలం ముందు కొంతమంది శాశ్వత రేకుల షెడ్లు, చిన్న..చిన్న పాకాల నిర్మాణాలు చేపడుతున్నారని, ఇవి తొలగించాలని సంబంధిత అధికారులకు తెలియపరిచిన కాలయాపన చేస్తున్నారని వాపోయారు. మునుముందు భవన నిర్మాణం చేపట్టేటప్పుడు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.
Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
No comments:
Post a Comment