మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట:- పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన L పద్మ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకి చెందిన పద్మ అనే మహిళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గత కొన్ని రోజుల క్రితం 52 ఎకరాల్లోని ప్రభుత్వం వారు నిర్మించిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆమెకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న కుమారుడు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. చలాకీగా ఉండే కుమారుడు మతిస్థిమితం కోల్పోవడంతో మానసికంగా చాలా కృంగిపోయి బాధపడుతూ ఉండేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త కూడా చనిపోవడంతో, పనిచేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక ప్రభుత్వం ఇచ్చే వితంతువు పెన్షన్తో జీవనం సాగించేది. శుక్రవారం రాత్రి ఆర్థిక మానసిక ఇబ్బందులను తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సదరు బంధువులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ 

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట :- పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు పాఠశాల యందు విద్యార్ధిని, విద్యార్థులకు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా  (నులిపురుగుల నివారణ) ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ వేయించడం జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సుధ మాట్లాడుతు విద్యార్థి దశలోనే వ్యక్తి గత పరిశుభ్రత అలవర్చుకోవాలని అన్నారు. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందించుకోవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని. వారంలో ఐదు రోజుల పాటు ఉడక బెట్టిన కొడిగ్రుడ్డు అందిస్తున్నారని అన్నారు. ANM ధన లక్ష్మీ మాట్లాడుతూ ఈ  టాబ్లెట్స్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మెళకువలు తెలియజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వాటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే సుధ, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఏ.నీలిమ. టి.కుమారీ. ఆశ వర్కర్ యన్ రాజేశ్వరి విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరిపేట:- పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయిలోని బీసీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలందరూ పార్టీకి వెన్నుదండుగా ఉన్నారని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ... వైకాపా అయిదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారని ఆ వర్గాలు మళ్లీ జగన్‌కు ఓటేయాలని ప్రశ్నించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్‌ వర్గాలంటే వారి వెన్ను విరిచినందుకా... 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకా... 74మంది బీసీలు నాయకుల్ని క్రూరంగా నరికి చంపినందుకా...  5వేల మందిబీసీలపై దాడులు, అక్రమ కేసులు పెట్టినందుకా... వాళ్లే వైకాపాకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పగలరా అని ప్రశ్నించారు ప్రత్తిపాటి. తెలుగుదేశం ప్రభుత్వ హయంతో ఆత్మగౌరవంతో, అన్నింటా అవకాశాలతో తలెత్తుకుని బతికిన వెనకబడిన వర్గాల వారిని అన్ని విధాలుగా మోసం చేసి రోడ్డున పడేసిన దుర్మార్గుడు జగన్ అని ఆయన దుయ్య బట్టారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జయహో బీసీ సదస్సు నిర్వహించారు. సదస్సులో మాజీమంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ సీఎం చంద్రబాబు బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చిన 1983 తర్వాతే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలకు తెదేపా రాజకీయ ప్రాధాన్యం, ఆర్థిక వెసులుబాటు కల్పించిందన్నారు . అలాంటి పరిస్థితుల నుంచి గడిచిన అయిదేళ్లలో 56 బీసీ కార్పొరేషన్లు అంటూ ప్రచార ఆర్భాటం చేసిన వైకాపా వాటికి పైసా విదల్చక పోగా బీసీ సబ్‌ప్లాన్‌కు చెందిన దాదాపు రూ. 75 కోట్లు దారి మళ్లించడం వారి కుటిలనీతికి నిదర్శమన్నారు. ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపుల్లో కూడా జగన్ అత్యధికంగా అన్యాయం చేస్తోంది బీసీలకే అని తెలిపారు ప్రత్తిపాటి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఈసారి తమ రాజకీయ అవకాశాల పుట్టినిల్లు తెలుగుదేశంతో కలసి నడవాలని కృతనిశ్చయంతో ఉన్నారని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెదేపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.