చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
చిలకలూరిపేట:- పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన L పద్మ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకి చెందిన పద్మ అనే మహిళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గత కొన్ని రోజుల క్రితం 52 ఎకరాల్లోని ప్రభుత్వం వారు నిర్మించిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆమెకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న కుమారుడు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. చలాకీగా ఉండే కుమారుడు మతిస్థిమితం కోల్పోవడంతో మానసికంగా చాలా కృంగిపోయి బాధపడుతూ ఉండేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త కూడా చనిపోవడంతో, పనిచేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక ప్రభుత్వం ఇచ్చే వితంతువు పెన్షన్తో జీవనం సాగించేది. శుక్రవారం రాత్రి ఆర్థిక మానసిక ఇబ్బందులను తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సదరు బంధువులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది తెలిపారు.
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.
No comments:
Post a Comment