చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్
చిలకలూరిపేట విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు ఈరోజు అనగా శనివారం ఉదయం అంబులెన్స్ ఆటో యాక్సిడెంట్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే - సాయంత్రం 9 గంటల సమయంలో పట్టణంలో సుభాని నగర్కు చెందిన ఖాజావలి అనే వ్యక్తి విజయ బ్యాంక్ సెంటర్ నుండి పండరీపురం వైపు వెళ్లే సమయంలో చెన్నై నుండి గుంటూరు వైపుకు వెళుతున్న కారు ఢీకొన్నది. ఈ సమయంలో ఖాజావలి గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సదరు కారు సంబంధించిన వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒకే రోజు విజయ బ్యాంక్ సెంటర్లో రెండు ఘటనలు జరగటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.