మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు మొత్తం 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో రెడ్ల బజార్లో ఒక్క కేసు నమోదు అయింది. 

చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఒక్క కేసు నమోదు అయ్యింది. 

నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో రెండు కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలం లో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 





















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 26-07-2021,సోమవారం నాడు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 26-07-2021,సోమవారం నాడు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గంలో 26-07-2021,సోమవారం నాడు మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోట లో  ఒక్క కేసు నమోదు అయింది. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో ఒక్క కరోనా కేసు కుడా నమోదు కాలేదు. 

నాదెండ్ల మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

రాజు గారి పాలెం గ్రామంలో - 1

సాతులూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో యడ్లపాడు గ్రామంలో ఒక్క కరోనా కేసు నమోదు అయ్యింది. 


















Share:

రేపు (26-07-2021,సోమవారం ) చిలకలూరిపేట నియోజకవర్గంలో 6700 వ్యాక్సీలతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని వ్యాక్సిన్లు కేటాయించారు అంటే !!!

రేపు (26-07-2021,సోమవారం )  చిలకలూరిపేట నియోజకవర్గంలో 6700 వ్యాక్సీలతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని వ్యాక్సిన్లు కేటాయించారు అంటే !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు 26-07-2021 సోమవారం నాడు మొత్తం 6,700 కోవిషిల్డ్ వ్యాక్సిన్లతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపి నాయక్ తెలిపారు. అయితే ఎక్కడ ఎక్కడ ఎన్ని డోసులు వేస్తున్నారు అంటే ! 

చిలకలూరిపేట సిహెచ్ సి లో - 200 

చిలకలూరిపేట యు ఎఫ్ డబ్ల్యూ సి నందు - 1000

సుబ్బయ్యతోట యు పి హెచ్ సి నందు - 500

రజకకాలనీ  యు పి హెచ్ సి నందు - 500

పురుషోత్తమపట్నం యు పి హెచ్ సి నందు - 500

కావూరు పి హెచ్ సి నందు - 1000

గణపవరం పి హెచ్ సి నందు - 1000

యడ్లపాడు పి హెచ్ సి నందు - 1000

నాదెండ్ల పి హెచ్ సి నందు - 1000 డోసులు కేటాయించారు. 





































Share:

చిలకలూరిపేట పట్టణంలో 25-07-2021 ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 25-07-2021 ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 25-07-2021 ఆదివారం నాడు మొత్తం 6 కరోనా  అయ్యాయి. 

పండరీపురం లో - 1

గాంధీపేట లో - 1

జాలయ్య కాలనిలో - 1

రహమత్ నగర్ లో - 2

డైక్ మెన్ కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి. 


























Share:

చిలకలూరిపేట - పలు రద్దీ సెంటర్లలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలపైనా వ్యూహాలు సిద్ధం చేసిన CI రాజేశ్వరావు

చిలకలూరిపేట - పలు రద్దీ సెంటర్లలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలపైనా వ్యూహాలు సిద్ధం చేసిన CI రాజేశ్వరావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా CI బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరరావు. శనివారం సాయత్రం సమయంలో పట్టణంలోని పలు రద్దీ ప్రదేశాలు పర్యటించి ట్రాఫిక్ సమస్యల పైనా వ్యూహాలు సిద్ధం చేసారు. పట్టణంలోని ట్రాఫిక్ ప్రధాన సమస్యలలో ఒకటి ముఖ్యంగా మార్కెట్ సెంటర్,చలివేంద్రం బజార్ కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటున్న కారణంగా, అసలే కరోనా సమయంలో రద్దీ తగ్గించాలి అనే ఆలోచనతో CI రాజేశ్వరావుతో పాటుగా టౌన్ పోలీస్ సిబ్బంది పళ్ళు మార్కెట్ వ్యాపారులను పిలిచి వారితో చర్చించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఏర్పాట్లు చెయ్యాలి అని వారిని సూచించారు. తోపుడు బళ్లకు హద్దులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి అని తెలిపారు. అలాగే కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి అని తెలిపారు. కర్ఫ్యూ సమయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం అని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఆయన తెలిపారు.  












Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు మొత్తం 7 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

చౌత్రసెంటెర్ లో - 1

సుగాలి కాలనీ లో - 2

డైక్ మెన్ కాలనీ లో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 2కేసులు నమోదు అయ్యాయి 

తూబాడు గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

ఈ రోజు చిలకలూరిపేట, యడ్లపాడు మండల గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 












Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 22-07-2021 గురువారం నాడునమోదు అయినా కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 22-07-2021 గురువారం నాడునమోదు అయినా కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

 చిలకలూరిపేట నియోజకవర్గంలో 22-07-2021 గురువారం నాడు మొత్తం 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి. 

రెడ్ల బజార్ లో - 2

వేలూరు రోడ్డులో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

తుర్లపాలెం గ్రామంలో - 1

యడ్లపాడు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట,నాదెండ్ల మండల గ్రామాలలో ఈ రోజు ఒక్క కేసుకూడా నమోదు కాలేదు. 


Share:

చిలకలూరిపేటలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన RBI రీజనల్ డైరెక్టర్ నిఖిల

చిలకలూరిపేటలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన RBI రీజనల్ డైరెక్టర్ నిఖిల

https://chilakaluripetspeednews.blogspot.com/

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఆధ్వర్యంలో UNION BANK యొక్క పర్యవేక్షణలో  గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత పై ప్రజలకు అవగాహన పెంపొందించుటకు 10 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను 21 వ తారీఖు బుధవారం మధ్యాహ్నం  3:30 లకు  RBI రీజనల్ డైరెక్టర్ శ్రీమతి . K.నిఖిల గారు వర్చువల్ గా ప్రారంభించారు.
 ఈ కార్యక్రమంలో భాగంగా కందిమళ్ల హాస్పిటల్ పక్కన నూతన కార్యాలయం (CFL) (center for financial literacy) ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని స్థానిక యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీమతి. పైలా విజయ కుమారిగారు   ప్రారంభించారు.
కార్యాలయం ప్రారంభ సందర్బంగా  కావూరు గ్రామానికి చెందిన స్వయం సహాయక బృందాలకు 
50 లక్షల రూపాయలు ఋణాలు అందించడం జరిగింది. 
 కార్యక్రమంలో బ్యాంకు RDO హనుమంతు, బ్యాంకు ఉద్యోగులు మరియు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ కౌన్సిలర్స్ రవిరాజు, భాస్కర్ లు పాల్గొన్నారు.  


                                                                                      CFL OFFICE, చిలకలూరిపేట.  9989209814

https://chilakaluripetspeednews.blogspot.com/







 
Share:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీసీ సంఘ నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీసీ సంఘ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు యంగ్ టైగర్ కుమ్మర క్రాంతి కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, చిలకలూరిపేట పట్టణం స్థానిక చీరాల రోడ్డులోని బాపూజీ వృధాశ్రమంలో కేకు కట్టింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ఏర్పాటు చేసిన కేక్ కట్ట్ చేసి కార్యక్రమాని ప్రారంభించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు విచ్చేసారు, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు నిడమానూరు సాంబశివరావు సభ అధ్యక్షత వహించారు, వారు మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ గారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకొనుటకు ముఖ్య ఉద్దేశం మీ లాంటి పెద్దల దీవెనలు ఆయనకు వుండాలని, అదే విధంగా కుమ్మర క్రాంతి కుమార్ గారు గతంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో చిన్న సమస్య వుండి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వేంటనే రెస్పాండ్ అయ్యి 20నిమిషాలలో వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపారని ఆయన పోరాట పటిమ గురించి వివరించారు 

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు మాట్లాడుతూ క్రాంతి కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు కేసనశంకర్ రావు గారికి అను క్షణం అండగా వుంటు బిసిల సమస్యలపై నిరంతరము పోరాటం చేస్తున్నారని మాకు సమస్య ఉన్నది అని అర్ధరాత్రి ఫోన్ చేసిన సమస్యపై రెస్పాండ్ అవుతారని, ఆయన తెలిపారు. ఆయన జన్మదిన వేడుకలు వృద్దాశ్రమంలో జరగటం ఆనంద దాయకమని ఆయన కోనియాడారు. 

నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ రుపేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ అన్న జన్మదినాన్ని ఇంత మంది పెద్దవాళ్ల మధ్య నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, మా యంగ్ టైగర్ మా అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్య లతో ఇలాంటి  పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, బిసిల కోసం అన్న చేస్తున్న పోరాటాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని, అన్నలో వున్న దూకుడుని, పోరాట పట్టిమని నేటి యువత పునికి పుచ్చుకోవాలని వారు తెలిపారు

ఈ కార్యక్రమంలో మహత్మ జ్యోతిరావుపూలే చైతన్యసేవా సంఘం అధ్యక్షులు ఉప్పాల భాస్కర్ రావు గారు, ఉపాధ్యక్షులు శ్రీ కస్తూరి వెంకటేశ్వర్లు గారు,నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు తెప్పలి కాసులు గారు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు వంకదారి పుల్లయ్య గారు మరియు తదితర బిసి నాయకులు పాల్గొన్నారు.

https://chilakaluripetspeednews.blogspot.com/




















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

సాంబశివానగర్ లో - 1

గుర్రాలచావిడీ లో - 1

పండరీపురం లో - 2 గా నమోదు అయింది. 

నాదెండ్ల మండల గ్రామాలలో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది. 

గొట్టిపాడు గ్రామంలో - 1 గా నమోదు అయింది. 

యడ్లపాడు మండల గ్రామాలలో 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

లింగారావుపాలెం గ్రామంలో - 1

తిమ్మాపురం గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 


































Share:

చిలకలూరిపేట మండలం - పేకాట స్థావరం పైన దాడులు - 35 మంది అరెస్ట్ - 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం.

చిలకలూరిపేట మండలం - పేకాట స్థావరం పైన దాడులు - 35 మంది అరెస్ట్ - 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని గుద్దె వారిపాలెం - అనంతవరం గ్రామ శివారులలో జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు నిర్వహించిన దాడులలో మొత్తం 35 మందిని అరెస్ట్ చెయ్యగా వారి వద్ద నుండి 13 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులతో ఒక్కసారిగా ఖంగుతిన్న పేకాట రాయుళ్లు పారిపోవటానికి యత్నించారు. అయితే అర్బన్ పోలీసులు చాకచక్యంగా అందరిని అరెస్ట్ చేసారు.గ్రామాలలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారి పైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. 




















Share:

చిలకలూరిపేట - ఘనంగా సీ.ఆర్ మోహన్ గారి అంతిమ యాత్ర - రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నివాళి

చిలకలూరిపేట - ఘనంగా సీ.ఆర్ మోహన్ గారి అంతిమ యాత్ర - రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నివాళి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట సిపిఐ ఏరియా కార్యదర్శి, రాష్ట్ర పార్టీ కౌన్సిల్ సభ్యుడు,జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ C R మోహన్(80) గారు మంగళవారం సాయంత్రం సమయంలో అనారోగ్యంతో మరణించారు.అయన మృతి పట్ల పట్టణంలోని అన్ని పార్టీల నాయకులూ పాల్గొని నివాళి అర్పించారు. చిలకలూరిపేట లోని జాగుపాలెం నందు ఆయన స్వగృహం నుండి అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో సిపిఐ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ,ముప్పాళ్ల నాగేశ్వరావు,జిల్లా కార్యదర్శి జంగాల అజయ్, వై చంచయ్య, మాల్యాద్రి,చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ గారు,చిలకలూరిపేట టీడీపీ నాయకులు,వైస్సార్సీపీ నాయకులు విడదల గోపి అలాగే సిపిఐ పార్టీ అన్ని జిల్లాల కార్యదర్శిలు పాల్గొన్నారు.   























Share:

చిలకలూరిపేట ముస్లిం సోదరులు గోవధ నిషేధిత చట్టాన్ని పాటించాలి - మునిసిపల్ కమిషనర్

చిలకలూరిపేట ముస్లిం సోదరులు గోవధ నిషేధిత చట్టాన్ని పాటించాలి - మునిసిపల్ కమిషనర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర గోవధ నిషేధం అని తెలిపారు. యానిమల్ హుస్బెండరీ యాక్ట్ 11-1977 ప్రకారం గోవధ నిషేధం అలాగే హైకోర్టు ఉత్తరువుల మేరకు 26505(23-12-2005) ప్రకారం ఆవులు,దూడలు లాంటి సమాజానికి ఉపయోగపడే జంతువులను వధించటం నేరం కనుక ముస్లిమ్ సోదరులు ప్రభుత్వ చట్టాలను గౌరవించి శాంతిని నెలకొల్పాలి అని కమిషనర్ తెలిపారు. అలాగే కరోనా ఆంక్షల నేపథ్యంలో వీలైనంత వరకు ఎవరి ఇళ్లలో వారు ప్రార్థ‌న‌లు నిర్వహించుకోవాలి అని తెలిపారు . 




















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 20-07-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 20-07-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 20-07-2021 మంగళవారం నాడు మొత్తం 21 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో 7 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

సుధావారిపాలెం లో - 1

పురుషోత్తమపట్నం లో - 2

గుండయ్యతోట లో - 1

బ్యాంకు కాలనీ లో - 1

పండరీపురం 7వ లైన్ లో - 2 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది. 

పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయింది. 

యడ్లపాడు మండల గ్రామాలలో 7 కేసులు నమోదు అయ్యాయి. 

లింగారావుపాలెం  గ్రామంలో - 5

యడ్లపాడు గ్రామంలో - 1

కోట గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 6 కేసులు నమోదు అయ్యాయి. 

రాజుగారిపాలెం గ్రామంలో - 5

సాతులూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.  
















Share:

చిలకలూరిపేట మార్కెట్ యార్డు నందు పాములు కలకలం - వారం రోజులలో మూడు సార్లు - భయాందోళనలో కూరగాయల వర్తక సంఘ వ్యాపారులు

చిలకలూరిపేట మార్కెట్ యార్డు నందు పాములు కలకలం - వారం రోజులలో మూడు సార్లు - భయాందోళనలో కూరగాయల వర్తక సంఘ వ్యాపారులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - పట్టణంలోని RTC బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డు నందు పాములు హడావిడి ఎక్కువ అయింది.వర్షాకాలం కావటంతో యార్డు చుట్టుపక్కల ఉన్న పొలాల నుండి పాములు యార్డులోకి ప్రవేశిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. కరోనా కారణంగా కూరగాయల మార్కెట్ వర్తకులను యార్డులోకి తరలించారు. అయితే తెల్లవారు జామున 3 గంటలకల్లా వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి సర్దుకొనే సమయంలో పాములు ఎక్కడ ఎక్కడ ఉంటాయో అని బయాందోనళకు గురి అవుతున్నారు వ్యాపారులు. తాజాగా 5 గంటలకు వర్తకులు షాపులు మూసివేస్తుండగా ఇంతలో సుమారు 5 అడుగుల పాము ఒక వ్యక్తిపై దాడి చెయ్యబోయింది వెంటనే స్పందించిన సదరు వ్యక్తి అందరిని పిలువగా పాముని చంపివేశారు. ఇది ఎలా జరగటం మూడవసారి. అయితే సదరు వ్యాపారులు కరోనా పేరు చెప్పి మమ్మల్ని ఊరికి దూరంగా ఉన్న ఈ యార్డులో ఉంచారు. అసలే వ్యాపారాలు లేక బ్రతుకు బండి మోయలేకపోతుంటే ఇప్పుడు ఈ పాముల వలన ప్రాణభయం ఏర్పడుతుంది అని వాపోయారు. ఇప్పటికి అయిన శాసనసభ్యురాలు మా యందు దయ ఉంచి మార్కెట్ నందు యధావిధిగా వ్యాపారాలు కొనసాగించటానికి అనుమతులు ఇవ్వండి, కొట్టు మార్చి కొట్టు లేదా రోజుకి ఒక వరుసగా కోట్లు పెట్టుకొని జనల రద్దీ లేకుండా కరోనా నియమాలు పాటిస్తూ, మార్కెట్ మొత్తానికి కరోనా గుంపులు గుంపులుగా లేకుండా ఉండేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటాము అని తెలిపారు. 
Share:

చిలకలూరిపేట పట్టణంలో 19-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 19-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 19-07-2021,సోమవారం నాడు మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

చౌత్ర సెంటర్ నందు - 4 కేసులు నమోదు అయ్యాయి. 

 ఈ రోజు నుండి కరోనా ఆంక్షలు సడలింపు ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తమై కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ కరోనా తీవ్రతకు అడ్డుకట్ట వేదాం . 
























Share:

రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు CIలు,ఇద్దరు కమిషనర్లు,ఇద్దరు తహసీల్ధార్లు మార్చటం చిలకలూరిపేట ప్రజలు ఎన్నడూ చూడలేదు - రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు

రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు CIలు,ఇద్దరు కమిషనర్లు,ఇద్దరు తహసీల్ధార్లు మార్చటం చిలకలూరిపేట ప్రజలు ఎన్నడూ చూడలేదు - రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు

https://chilakaluripetspeednews.blogspot.com/


ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని,ఆరు నెలలకు ఒక పోలీసు అధికారి ఎందుకు మారుతున్నారు ప్రజలకు తెలియజేయాలని అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల్లో ఇద్దరు మున్సిపల్ కమిషనర్ మారారని,తాసిల్దారు కూడా ఇద్దరు మారారని ఈ విధమైన పరిస్థితిని గతంలో ఎప్పుడూ కూడా చిలకలూరిపేట ప్రజలు చూడలేదని దీనిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిలకలూరిపేట ఎమ్మార్వో సెలవ మీద వెళ్లగా నాదెండ్ల మండల తాసిల్దార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు కావలసిన ఇన్కమ్ సర్టిఫికెట్,కాస్ట్ సర్టిఫికెట్ విషయాల మీద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలియజేశారు.కేవలం ఎడవల్లి భూముల సమస్య పరిష్కరించడం కొరకు ఆయన తాసిల్దార్ గా వ్యవహరిస్తున్నారని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. అంతేగాని పూర్తిస్థాయి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదని ప్రజలకు అందుబాటులో లేరని ఈ విధంగా చేయటంవల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటన్నింటిపై స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆయన తెలియజేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అధికారులను మార్చిన సందర్భాలు లేవని ఆయన గుర్తు చేశారు. సమస్యలను గాలికొదిలేసి కేవలం ఆర్భాటాలు శిలాఫలకాలు ప్రచారాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని ఆయన దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య, ఓబీసీ మోర్చా నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్, యువ నాయకులు వి వంశీ, ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Share:

చిలకలూరిపేట - RTC బస్సు సమయాలలో మార్పు - బక్రీదు పండుగకు సామూహిక ప్రార్థనలు అనుమతులు లేవు - ఇన్సిడెంట్ కమాండర్

చిలకలూరిపేట - RTC బస్సు సమయాలలో మార్పు - బక్రీదు పండుగకు సామూహిక ప్రార్థనలు అనుమతులు లేవు - ఇన్సిడెంట్ కమాండర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/


సోమవారం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మాట్లాడుతూ కర్ఫ్యూ సమయాన్ని తగ్గించారు. అలాగే RTC బస్సు పని వేళలను మార్చాలని అని RTC అధికారులకు సూచించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటలకల్లా బస్సులన్నీ డిపోకు చేరేలా ప్రణాళిక చెయ్యాలి అని తెలిపారు.అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు ఆటోలలో,ఇతర ప్రయాణాలు చేసే వాహనాలలో రద్దీ లేకుండా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలి అని తెలిపారు. 

త్వరలో ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ రానుండటంతో మసీదు ప్రదేశాలలో సామూహిక ప్రార్థనలకు అనుమతులు లేవు అని కనుక ఎవరి ఇళ్లలో వారి పండుగ జరుపుకోవాలి అని. అలాగే మసీదు సమీపంలో హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజేషన్ చేపించాలి అని తెలిపారు. 

వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ప్రక్రియ ముందుకి తీసుకువెళ్లాలి అని. వార్డులలో వాలంటీర్లు,AMNలు,ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది కరోనా చైన్ బ్రేక్ చేసే విధంగా చర్యలు చెప్పటాలి అని తెలిపారు. 



























Share:

నేటి నుండి చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు తగ్గింపు - ఉదయం 6 నుండి సాయత్రం 5 వరకు పని వేళలు - ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు

నేటి నుండి చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు తగ్గింపు - ఉదయం 6 నుండి సాయత్రం 5 వరకు పని వేళలు - ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కొనసాగుతున్న కరోనా ఆంక్షల సమయాలలో మార్పు చేస్తున్నట్లు ఈ రోజు సోమవారం నాడు జరిగిన టాస్క్ ఫోర్స్  కమిటీ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాలి అని. సాయంత్రం 5 తర్వాత నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానున్నట్లు అయన తెలిపారు. అన్ని వ్యాపార,వాణిజ్య దుకాణాలలో నో మాస్క్ నో సేల్ బోర్డు పెట్టాలి అని కరోనా ప్రోటోకాల్ పాటించని వారి పైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు.యువకులు క్రీడాకారులు ఆటలు ఆడరాదు అని ఆలా ఆడేవారి పైనా కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు.  





























Share:

చిలకలూరిపేట - కుప్పగంజివాగులో గల్లంతు కాబోయిన వ్యక్తిని కాపాడిన పోలీస్,ఫైర్ సిబ్బంది

చిలకలూరిపేట - కుప్పగంజివాగులో గల్లంతు కాబోయిన వ్యక్తిని కాపాడిన పోలీస్,ఫైర్ సిబ్బంది 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండల గ్రామాలైన మానుకొండవారిపాలెం & ఏలూరు గ్రామాల మధ్యలో ప్రవహించే కుప్పగంజి వాగు ఎగువున కురిసిన వర్షానికి భారీగా వరద నీరు చేరింది.అయితే వేలూరు గ్రామానికి చెందిన దాసు అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పైన వరద దాటానికి ట్రై చేసాడు. వరద ఉధృతికి బైకుతో సహా దాసు కూడా వరదలో కొట్టుకొని వెళ్ళబోయి అక్కడ ఉన్న చెట్టుకొమ్మకి చిక్కుకొని ఆగిపోయాడు. అంతలో అప్రమత్తం అయిన గ్రామస్థులు MLA రజని ని సంప్రదించగా ఆమె వెంటనే స్పందించి సదరు వ్యక్తిని కాపాడలిని అధికారులను ఆదేశించారు. వెంటనే అప్రమత్తం అయిన ఫైర్,పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని దాసు ను కాపాడారు. మునిసిపల్ ఛైర్మెన్ రఫాని హుటా హుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రురల్ SI భాస్కర్,ఫైర్ ఆఫీసర్ సునీల్ తోపాటు గ్రామ సర్పంచ్ తిరుపతయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు దౌలతాఖాన్ ఆధ్వర్యంలో దాసుని ప్రాణాలతో రక్షించారు. అయితే వాహనం మాత్రం వరద ఉధృతిలో కొట్టుకుపోయింది. 
























Share:

చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలలో 17-07-2021,శనివారం నాడు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండలం & యడ్లపాడు మండల గ్రామాలలో  ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి. 

అప్పాపురం గ్రామంలో - 1

చిరుమామిళ్ల గ్రామంలో - 4

నాదెండ్ల గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 










Share:

చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు మొత్తం 2 కేసులు నమోదు అయ్యాయి. 

పురుషోత్తమపట్నం లో - 2 గా నమోదు అయ్యాయి. 

కరోనా కేసులు తగ్గుతున్నాయి అని మాస్క్ లేకుండా బయటకి వస్తే పరాధరుసుము వెయ్యటానికి టౌన్ పోలీసువారు రెడీగా మీకోసమే వేచివున్నారు జాగ్రత్త. రాష్ట్రం మొత్తం ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటూ కరోనా ప్రోటోకాల్ పాటిస్తూన్నారు. మన పట్టణంలో మాత్రం కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కరోనా ప్రోటోకాల్ పాటించండి 🙏.  













Share:

చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు.

చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని ప్రజలందరి దాహం తీరుస్తూ వారి నిత్య అవసరాలు  తీరుస్తున్న మన అందరి జీవనాధారం పట్టణ శివారులలో ఉన్న మన మంచినీటి చెరువు. ఇంతమందికి జీవనాధారం అయిన మంచినీటి చెరువుకు భద్రత కరువైంది. గత కొంత కాలం క్రితం చెరువు చెరువులో అకృత్యాలు ఎక్కువ అయిపోయాయి.పట్టణంలో ఇన్ని లక్షల దాహం తీరుతున్న మన మంచినీటి చెరువును పట్టించుకునే నాధుడు లేరా అని అక్కడికి వచ్చిన పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికి అయినా మునిసిపల్ కమిష్నర్ చెరువు దగ్గిర పరిస్థితిని సమీక్షించాలి అని ప్రజలు కోరుతున్నారు. సాయంత్రానికి చెరువులో గేదెలు,మేకలు జలకాలాడటం పట్ల పట్టణ ప్రజలు ఒకింత అభద్రతకు లోనవుతున్నారు. అధికారులు వీటి పైనా తగిన చర్యలు తీసుకోవాలి అని సామాన్యులు కోరుకుంటున్నారు. 



 
Share:

చిలకలూరిపేట టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు

చిలకలూరిపేట టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న బిలాలుద్దీన్ ను పేకాట నిర్వహణ విషయంలో అధికారులు విఆర్ కి పంపారు. అయితే ఇంకమీదట జి.రాజేశ్వరావు గారు టౌన్ సీఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు.శుక్రువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. టౌన్ పోలీస్టేషన్ నందు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. గతంలో ఆయన మొదటిగా 2004 లో అచ్చంపేట SI గా మొదలై రేపల్లె,చెరుకుపల్లి ప్రాంతాలలో SI గా విధులు నిర్వహించి తరువాత మాచర్ల CIగా , నరసరావుపేట దిశా పోలీసుస్టేషన్లో CI గా పనిచేస్తూ ఇప్పుడు మన చిలకలూరిపేటకి CIగా వచ్చారు. 












Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

డైక్ మెన్ నగర్ లో - 1

పోలిరెడ్డిపాలెం లో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సందెపూడి గ్రామంలో - 2

నాదెండ్ల మండలంలో 13 కేసులు నమోదు అయ్యాయి. 

గిరిజవోలు గ్రామంలో - 8

నాదెండ్ల గ్రామంలో - 5 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో  ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

Share:

చిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపైనా కారు ఢీ కొని వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణానికి చెందిన దేవరకొండ రాంబాబు తాతపూడి వైపు నుండి ద్విచక్ర వాహనం పైన పట్టణం వైపు వస్తుండగా వెనుక నుండి TS07GP4448 బ్లాక్ బెంజ్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నది. రాంబాబు బైక్ పైనుండి క్రిందపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి మృతిచెందారు.



























Share:

చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్

చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని డైక్ మెన్ కాలనీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. గత రెండు రోజులగా ఆ ప్రాంతంలో 12 కేసులు నమోదు అవ్వగా కమిషనర్ కరోనా విస్తరించకుండా కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అలాగే బాధితులను క్వారంటైన్ సెంటర్కు తరలించారు.అలాగే ఆ ప్రాంతం అంతా హైపోక్లోరిక్ సోడియం తో శానిటైజేషన్ చేపించారు. వారం రోజులపాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలియజేసారు. 














Share:

నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021 శుక్రువారం నాడు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 45 సంవత్సరాలు దాటినా ప్రభుత్వ ఉపాయధ్యాయులకు మొదటిడొసు, రెండవ డోసు,పాలు ఇచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు మాత్రమే వ్యాక్సిన్ వెయ్యనునట్లు నోడల్ డాక్టర్ గోపీనాయక్ తెలిపారు. 

యడ్లపాడు పీహెచ్ సీ పరిధిలో - 600

నాదెండ్ల పీహెచ్ సీ పరిధిలో - 500

గణపవరం పీహెచ్ సీ పరిధిలో - 500

కావూరు పీహెచ్ సీ పరిధిలో - 800 

పురుషోత్తమపట్నం యుపీహెచ్ సీ పరిధిలో - 200

రజక కాలనీ పీహెచ్ సీ పరిధిలో - 300

సుబ్బయ్యతోట పీహెచ్ సీ పరిధిలో - 200

పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ లో - 500 మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు. 













































Share:

చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం -

చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం - 

https://chilakaluripetspeednews.blogspot.com/


అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా చట్టల అమలు విషయంలో మీనమేషాలు లెక్కించడం వలన ఆనాటి నుంచి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి సూచన మేరకు భారతీయ జనతా యువమోర్చా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధర్నాలు సంతకాల సేకరణలు వంటి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఇప్పటికి  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన రెడ్డి గారు ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ఆదేశాలు ఇచ్చారు. ఇది భారతీయ జనతా యువమోర్చా విజయంగా భావిస్తూనే ఇప్పటికైనా అగ్రవర్ణ పేదలకు ఆశాజ్యోతిగా మారిన ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా యువమోర్చా నరసరావుపేట పార్లమెంటు శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రతుకు భారంగా భావిస్తున్న అగ్రవర్ణ పేదలకు భరోసానిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ చట్టం చేసి వారి జీవితాల్లో ఆనందం నింపిన మన ప్రధానమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అగ్రవర్ణ పేదల తరఫున ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ , పట్టణ అధ్యక్షులు నందిగామ రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీధర్,ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి వంకాయలపాటి సాయి, ఏబీవీపీ రాష్ట్ర  సభ్యులు మురారి, ఏబీవీపీ పట్టణ నాయకులు లీలా కృష్ణ పలువురు పాల్గొన్నారు

Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజవర్గంలో 15-07-2021 గురువారం నాడు మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 5 కేసులు నమోదు అయ్యాయి. 

డైక్ మెన్ కాలనీ లో - 3

రజక కాలనీ లో - 1

సుభాని నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. 

గోవిందపురం గ్రామంలో - 3

పసుమర్రు గ్రామంలో - 1

గొట్టిపాడు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

తిమ్మాపురం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 






Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

పురుషోత్తమపట్నం లో - 1

మారెళ్లవారివీధి లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 10 కేసులు నమోదు అయ్యాయి. 

వేలూరు గ్రామంలో - 1

గోవిందపురం గ్రామంలో - 8

బొప్పూడి గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలంలో 1 కేసు నమోదు అయ్యింది. 

యడ్లపాడు గ్రామంలో - 1

నాదెండ్ల మండల గ్రామంలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 2

నాదెండ్ల గ్రామంలో - 1

కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 


Share:

చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి

చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో రేపు నియోజకవర్గంలోని మూడు మండలాలలోని గ్రామ & పట్టణంలోని 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి జరుగుతుంది.రైతు బజారు వేదికగా MLA రజిని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మందుకు సంబంధించిన ప్యాకింగ్ ప్రక్రియ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో VR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడీ చేస్తున్నారు.మందుని పొందటానికి సంబందించిన టోకెన్లు ఇప్పటికే వార్డు కౌన్సిలర్లకు అందించారు. 
 
ఆనందయ్య మందు డబ్బాలలో పంపినీ చేస్తున్నారు. ఒక డబ్బా ఆరుగురు వాడవచ్చు. నిల్వ ఉంచటానికి ఫ్రిడ్జ్ లో పెట్టరాదు.ఈ మందు వాడే రోజున ధూమపానం,మద్యం,మాంసాహారం తీసుకోవద్దు.మందు తీసుకున్న కానీ వ్యాక్సిన్ తెప్పనిసరి.గర్భిణీ స్త్రీలు వాడరాదు.ఇతర ఆయుర్వేదం,అల్లోపతి వాడే వారు కూడా ఈ మందు వాడవచ్చు. కచ్చితంగా మందు తీసుకున్న రోజు 5&6 లీటర్ల మంచినీరు త్రాగాలి.కరోనా వచ్చి తగ్గిన వారు కూడా ఈ మందు తీసుకోవచ్చు. చింతపండు గింజ అంత ఉంటుంది ఈ మందు ఉదయం,సాయత్రం భోజనానికి ముందు ఈ మందుని తీసుకోవాలి ఒక్కరోజు మాత్రమే. 




























Share:

చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా ఒక దేశంలో రెండు జండాలు,రెండు రాజ్యాంగాలు ఉండకూడదు అని ఆమరణ నిరాహారదీక్ష చేసి సంఘ విద్రోహుల చేతులో హత్య కాబడిన జనసంఘ్ పార్టీ సృష్టికర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పుట్టిన రోజు వేడుకలు మన నరసరావుపేట పార్లమెంట్ యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఆయన చేసిన ప్రాణ త్యాగం చేసినందుకు ఈనాడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆర్టికల్ 370 రద్దు చెయ్యటం వలన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుతుంది అని. ఏ నినాదంతో ఆయన మరణించారా నరేంద్రమోడీ ముఖర్జీ గారు కన్నా కళలన్ని నిజం చేసారు అని తెలిపారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ అచ్చుకోల బ్రహ్మస్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఎనుగంటి నరేష్,మాదాల మణి, తేజ,రవికుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు

























Share:

పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ

పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు అభివృద్ధి కోసం 
మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె పరిస్థితి ఇంత వరకు ఎప్పుడు రాలేదు. మొత్తానికి మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టారు అని ఒప్పుకున్నారు.MLA గెలిచినప్పుడు సీఎం గారితో మాట్లాడి పట్టణ మునిసిపాలిటికి 50 కోట్ల రూపాయలు గ్రాండ్ ఇప్పిస్తూన్నాము అని తెలిపారు. అప్పుడు రాజకీయాలు పక్కనబెట్టి మేము ఆమెని అభినందించాము. కానీ ఈ రోజు ఆ గ్రాంట్ రావాలి అంటే మునిసిపల్ ఆస్తులను తాకట్టు పెట్టాలి అని చెప్తున్నారు.ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చెయ్యటమే అవుతుంది అని పట్టణ టీడీపీ ఆఫీస్ నందు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్సుమీట్లో తెలిపారు. 

ప్రత్తిపాటి పుల్లారావు గారు పట్టణంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పధకం తీసుకు వచ్చి అంతర్గత పైపు లైనులు 41 కిలోమీటర్లకు గాను 11 కిలోమీటర్లు పూర్తి చేస్తే మీరు అధికారంలోకి వచ్చాక 1 కిలోమీటరు పని కూడా చెయ్యలేదు. 6 వ వార్డులో 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి మీకు తెలియదా రఫాని గారు అని తెలిపారు.పట్టణంలో ఎంత అభివృద్ధి చేసిన ఒక్క మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టలేదు అని తెలిపారు.మీరు మున్సిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె చర్యలు మానుకోవాలి అని తెలిపారు. 
































Share:

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు 21 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

చింఘిజ్ ఖాన్ పేట గ్రామంలో - 1

లింగారావుపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

కావూరు గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి. 

సంక్రాంతిపాడు గ్రామంలో - 2

ఇర్లపాడు గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో -7 

కనపర్రు గ్రామంలో - 2

గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 



































Share:

చిలకలూరిపేట - వర్షన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులు మూయిస్తున్న మునిసిపల్ అధికారులు - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ మాకు సహకరించండి.

చిలకలూరిపేట - వర్షన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులు మూయిస్తున్న మునిసిపల్ అధికారులు - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ మాకు సహకరించండి. 

https://chilakaluripetspeednews.blogspot.com/



 

చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ అధికారులు మంగళవారం నాడు కర్ఫ్యూ అమలులో భాగంగా వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులను మూయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ పట్టణంలోని దుకాణాలు అన్ని మధ్యాహ్నం 2 గంటలకల్లా మూసివేసి మాకు సహకరించండి అని కోరారు. అన్ని ప్రాంతాల వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ మన పట్టణంలో మాత్రం కరోనా కర్ఫ్యూ పాటిస్తున్నాము.అందరూ కలసి కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ ఉంటే తీవ్రత తగ్గించగలిగితే ఎవరి వ్యాపారాలు వారు కొనసాగించుకోవచ్చు అని వారు తెలిపారు. 





























 
Share:

చిలకలూరిపేట RTC బస్సు వేళలలో మార్పులు - మధ్యాహ్నం 2 వరకు మాత్రమే బస్సులు తిరుగుతాయి.

చిలకలూరిపేట RTC బస్సు వేళలలో మార్పులు - మధ్యాహ్నం 2 వరకు మాత్రమే బస్సులు తిరుగుతాయి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట RTC బస్సు వేళలలో మార్పులు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ఎన్.సుజాత తెలిపారు. చిలకలూరిపేట నుండి మాచర్ల,చీరాల,గుంటూరు విజయవాడ, నరసరావుపేట,ఒంగోలు వేళ్ళ మార్గాలలో మధ్యాహ్నం 2 గంటల వరకే బస్సులు తిరుగుతాయి అని ఆమె తెలిపారు. ప్రయాణికులు గమనించి డిపో వారికీ సహారించాలి అని ఆమె కోరారు.అధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బస్సు వేళలు ఇలాగే కొనసాగుతాయి అని ఆమె తెలిపారు.  


























Share:

చిలకలూరిపేట పట్టణంలో కఠినంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ - 2గంటలకల్లా మార్కెట్,పట్టణ నలుమూలలా వ్యాపారాలు బంద్

చిలకలూరిపేట పట్టణంలో కఠినంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ - 2గంటలకల్లా మార్కెట్,పట్టణ నలుమూలలా వ్యాపారాలు బంద్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళా మన చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం కరోనా కేసులు విపరీతంగా పెరిగితున్నాయి. ఇన్సిడెంట్ కమాండర్ మల్లిఖార్జునరావు ఆదేశాల మేరకు పట్టణంలో కర్ఫ్యూ సమయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసారు.ఉదయం 6 గంటల నుండి మధ్యాహనం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంటాయి అని తెలిపారు.అలాగే మంగళవారం నాడు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు.పట్టణంలోని టౌన్ పోలీసు వారు పలు సెంటర్లలో షాపులను 2 గంటలకల్లా మూపించారు.ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ కరోనా తీవ్రత తగ్గించాలి అని తెలిపారు 

































Share:

చిలకలూరిపేట - ఆస్థి తగాదా విషయంలో ఘర్షణ - ఒకరు మృతి

చిలకలూరిపేట - ఆస్థి తగాదా విషయంలో ఘర్షణ - ఒకరు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్ కాలనిలో ఆస్థి తగాదా ఒకరిని బలి తీసుకుంది. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని వైస్సార్ కాలనిలో నివాసం ఉంటున్న జానీ బాషా అంతని బావమరిది సుభాని స్థలం విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. గొడవ ముదరటంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో జానీ భాషా తండ్రి సుభాని అడ్డురాగా సుభాని(68) తీవ్రమ్గా గాయపడి అక్కడే మృతి చెందారు. జానీ భాషా బావమరిది సుభాని కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికుల వలన సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 




















Share:

చిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.

చిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళ్తున్న చక్క దుంగల లోడుతో వెళ్తున్న లారీ కారుని NRT సెంటర్లో ఢీ కొన్నది. ఈ సమయంలో కారులో వారికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.లారీ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చెయ్యటం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులోని వ్యక్తులు నరసరావుపేట వైపు నుండి రోడ్డు దాటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/



















































Share:

చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని

చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - గత ప్రభుత్వంలో చేసిన అప్పులు వలన మునిసిపాలిటీ రెవిన్యూ పూర్తిగా లోటు బడ్జెట్ లోకి వెళ్ళింది అని.గత ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన అమృత్ పధకంలో మునిసిపాలిటీ వాటా 82 కోట్లుగా ఉంది.ఏడాది మునిసిపాలిటీ ఆదాయం మాత్రం 8 కోట్లు మాత్రమే. అయితే  MLA రజిని అమృత్ పధకం లోటు బడ్జెట్ను ముఖ్యమంత్రికి విన్నవించగా మునిసిపాలిటీలో ఉన్న ఆదాయ వనరులను చూపించి బ్యాంకులో ఋణం పొందండి. ఆయా నిధులకు సంబంధించిన లోనును మునిసిపాలిటీ ప్రజలపైన ఈ భారం పడకుండా ప్రభుత్వమే చెలిస్తుంది అని తెలిపారు. ప్రజలకు త్రాగునీరు సమస్య లేకుండా పరిష్కరించాలి అని చూస్తుంటే టీడీపీ కౌన్సిలర్లు మాత్రం మా పైన బురద చల్లుతూ ప్రజలను ప్రక్కదోవ పాటిస్తున్నారు అని మునిసిపల్ ఛైర్మెన్ రఫాని తెలిపారు. 

మార్కెట్ యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక టీడీపీ కౌన్సిలర్లు తమ పైనే దుష్ప్రభావం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది - ఎంత అభివృద్ధి జరిగింది అనే దాని పైన బహిరంగ చర్చకు రావాలి అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న,వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  



































Share:

06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్

06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంల,మండల గ్రామాలలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ 06-07-2021 మంగళవారం నుండి కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తూ వ్యాపారాలు, దుకాణాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయి అని కరోనా నియమాలు పాటించనివారి పైనా కఠిన చర్యలు తప్పవు అని ఇన్సిడెంట్ కమాండర్ మల్లిఖార్జునరావు తెలిపారు.సోమవారం జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో కరోనా తీవ్రత తగ్గించటానికి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. కరోనా నియమాలు కఠినంగా అమలు చేయాలి అని కమిటీ సభ్యులకు తెలిపారు.ఈ సమావేశంలో కమిషనర్ రవీంద్ర,నోడల్ డాక్టర్ గోపీనాయక్, SI నరసాదాసు,ఎంపీడీఓ హేమలతా దేవి, శివ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.  
































Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. 

పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సుబ్బయ్యతోట లో - 1

బొందిలిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 4

సంక్రాంతిపాడు గ్రామంలో - 2

నాదెండ్ల గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

ఈ రోజు చిలకలూరిపేట మండల గ్రామాలలో గాని, యడ్లపాడు మండలంలో కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 



























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.