రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఆధ్వర్యంలో UNION BANK యొక్క పర్యవేక్షణలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత పై ప్రజలకు అవగాహన పెంపొందించుటకు 10 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను 21 వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 3:30 లకు RBI రీజనల్ డైరెక్టర్ శ్రీమతి . K.నిఖిల గారు వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కందిమళ్ల హాస్పిటల్ పక్కన నూతన కార్యాలయం (CFL) (center for financial literacy) ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని స్థానిక యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీమతి. పైలా విజయ కుమారిగారు ప్రారంభించారు.
కార్యాలయం ప్రారంభ సందర్బంగా కావూరు గ్రామానికి చెందిన స్వయం సహాయక బృందాలకు
50 లక్షల రూపాయలు ఋణాలు అందించడం జరిగింది.
కార్యక్రమంలో బ్యాంకు RDO హనుమంతు, బ్యాంకు ఉద్యోగులు మరియు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ కౌన్సిలర్స్ రవిరాజు, భాస్కర్ లు పాల్గొన్నారు.
CFL OFFICE, చిలకలూరిపేట. 9989209814
No comments:
Post a Comment