చిలకలూరిపేట మార్కెట్ యార్డు నందు పాములు కలకలం - వారం రోజులలో మూడు సార్లు - భయాందోళనలో కూరగాయల వర్తక సంఘ వ్యాపారులు
చిలకలూరిపేట - పట్టణంలోని RTC బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డు నందు పాములు హడావిడి ఎక్కువ అయింది.వర్షాకాలం కావటంతో యార్డు చుట్టుపక్కల ఉన్న పొలాల నుండి పాములు యార్డులోకి ప్రవేశిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. కరోనా కారణంగా కూరగాయల మార్కెట్ వర్తకులను యార్డులోకి తరలించారు. అయితే తెల్లవారు జామున 3 గంటలకల్లా వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి సర్దుకొనే సమయంలో పాములు ఎక్కడ ఎక్కడ ఉంటాయో అని బయాందోనళకు గురి అవుతున్నారు వ్యాపారులు. తాజాగా 5 గంటలకు వర్తకులు షాపులు మూసివేస్తుండగా ఇంతలో సుమారు 5 అడుగుల పాము ఒక వ్యక్తిపై దాడి చెయ్యబోయింది వెంటనే స్పందించిన సదరు వ్యక్తి అందరిని పిలువగా పాముని చంపివేశారు. ఇది ఎలా జరగటం మూడవసారి. అయితే సదరు వ్యాపారులు కరోనా పేరు చెప్పి మమ్మల్ని ఊరికి దూరంగా ఉన్న ఈ యార్డులో ఉంచారు. అసలే వ్యాపారాలు లేక బ్రతుకు బండి మోయలేకపోతుంటే ఇప్పుడు ఈ పాముల వలన ప్రాణభయం ఏర్పడుతుంది అని వాపోయారు. ఇప్పటికి అయిన శాసనసభ్యురాలు మా యందు దయ ఉంచి మార్కెట్ నందు యధావిధిగా వ్యాపారాలు కొనసాగించటానికి అనుమతులు ఇవ్వండి, కొట్టు మార్చి కొట్టు లేదా రోజుకి ఒక వరుసగా కోట్లు పెట్టుకొని జనల రద్దీ లేకుండా కరోనా నియమాలు పాటిస్తూ, మార్కెట్ మొత్తానికి కరోనా గుంపులు గుంపులుగా లేకుండా ఉండేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటాము అని తెలిపారు.