మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన RBI రీజనల్ డైరెక్టర్ నిఖిల

చిలకలూరిపేటలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన RBI రీజనల్ డైరెక్టర్ నిఖిల

https://chilakaluripetspeednews.blogspot.com/

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఆధ్వర్యంలో UNION BANK యొక్క పర్యవేక్షణలో  గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత పై ప్రజలకు అవగాహన పెంపొందించుటకు 10 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను 21 వ తారీఖు బుధవారం మధ్యాహ్నం  3:30 లకు  RBI రీజనల్ డైరెక్టర్ శ్రీమతి . K.నిఖిల గారు వర్చువల్ గా ప్రారంభించారు.
 ఈ కార్యక్రమంలో భాగంగా కందిమళ్ల హాస్పిటల్ పక్కన నూతన కార్యాలయం (CFL) (center for financial literacy) ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని స్థానిక యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీమతి. పైలా విజయ కుమారిగారు   ప్రారంభించారు.
కార్యాలయం ప్రారంభ సందర్బంగా  కావూరు గ్రామానికి చెందిన స్వయం సహాయక బృందాలకు 
50 లక్షల రూపాయలు ఋణాలు అందించడం జరిగింది. 
 కార్యక్రమంలో బ్యాంకు RDO హనుమంతు, బ్యాంకు ఉద్యోగులు మరియు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ కౌన్సిలర్స్ రవిరాజు, భాస్కర్ లు పాల్గొన్నారు.  


                                                                                      CFL OFFICE, చిలకలూరిపేట.  9989209814

https://chilakaluripetspeednews.blogspot.com/







 
Share:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీసీ సంఘ నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీసీ సంఘ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు యంగ్ టైగర్ కుమ్మర క్రాంతి కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, చిలకలూరిపేట పట్టణం స్థానిక చీరాల రోడ్డులోని బాపూజీ వృధాశ్రమంలో కేకు కట్టింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ఏర్పాటు చేసిన కేక్ కట్ట్ చేసి కార్యక్రమాని ప్రారంభించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు విచ్చేసారు, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు నిడమానూరు సాంబశివరావు సభ అధ్యక్షత వహించారు, వారు మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ గారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకొనుటకు ముఖ్య ఉద్దేశం మీ లాంటి పెద్దల దీవెనలు ఆయనకు వుండాలని, అదే విధంగా కుమ్మర క్రాంతి కుమార్ గారు గతంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో చిన్న సమస్య వుండి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వేంటనే రెస్పాండ్ అయ్యి 20నిమిషాలలో వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపారని ఆయన పోరాట పటిమ గురించి వివరించారు 

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు మాట్లాడుతూ క్రాంతి కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు కేసనశంకర్ రావు గారికి అను క్షణం అండగా వుంటు బిసిల సమస్యలపై నిరంతరము పోరాటం చేస్తున్నారని మాకు సమస్య ఉన్నది అని అర్ధరాత్రి ఫోన్ చేసిన సమస్యపై రెస్పాండ్ అవుతారని, ఆయన తెలిపారు. ఆయన జన్మదిన వేడుకలు వృద్దాశ్రమంలో జరగటం ఆనంద దాయకమని ఆయన కోనియాడారు. 

నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ రుపేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ అన్న జన్మదినాన్ని ఇంత మంది పెద్దవాళ్ల మధ్య నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, మా యంగ్ టైగర్ మా అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్య లతో ఇలాంటి  పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, బిసిల కోసం అన్న చేస్తున్న పోరాటాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని, అన్నలో వున్న దూకుడుని, పోరాట పట్టిమని నేటి యువత పునికి పుచ్చుకోవాలని వారు తెలిపారు

ఈ కార్యక్రమంలో మహత్మ జ్యోతిరావుపూలే చైతన్యసేవా సంఘం అధ్యక్షులు ఉప్పాల భాస్కర్ రావు గారు, ఉపాధ్యక్షులు శ్రీ కస్తూరి వెంకటేశ్వర్లు గారు,నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు తెప్పలి కాసులు గారు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు వంకదారి పుల్లయ్య గారు మరియు తదితర బిసి నాయకులు పాల్గొన్నారు.

https://chilakaluripetspeednews.blogspot.com/




















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

సాంబశివానగర్ లో - 1

గుర్రాలచావిడీ లో - 1

పండరీపురం లో - 2 గా నమోదు అయింది. 

నాదెండ్ల మండల గ్రామాలలో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది. 

గొట్టిపాడు గ్రామంలో - 1 గా నమోదు అయింది. 

యడ్లపాడు మండల గ్రామాలలో 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

లింగారావుపాలెం గ్రామంలో - 1

తిమ్మాపురం గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 


































Share:

చిలకలూరిపేట మండలం - పేకాట స్థావరం పైన దాడులు - 35 మంది అరెస్ట్ - 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం.

చిలకలూరిపేట మండలం - పేకాట స్థావరం పైన దాడులు - 35 మంది అరెస్ట్ - 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని గుద్దె వారిపాలెం - అనంతవరం గ్రామ శివారులలో జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు నిర్వహించిన దాడులలో మొత్తం 35 మందిని అరెస్ట్ చెయ్యగా వారి వద్ద నుండి 13 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులతో ఒక్కసారిగా ఖంగుతిన్న పేకాట రాయుళ్లు పారిపోవటానికి యత్నించారు. అయితే అర్బన్ పోలీసులు చాకచక్యంగా అందరిని అరెస్ట్ చేసారు.గ్రామాలలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారి పైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. 




















Share:

చిలకలూరిపేట - ఘనంగా సీ.ఆర్ మోహన్ గారి అంతిమ యాత్ర - రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నివాళి

చిలకలూరిపేట - ఘనంగా సీ.ఆర్ మోహన్ గారి అంతిమ యాత్ర - రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నివాళి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట సిపిఐ ఏరియా కార్యదర్శి, రాష్ట్ర పార్టీ కౌన్సిల్ సభ్యుడు,జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ C R మోహన్(80) గారు మంగళవారం సాయంత్రం సమయంలో అనారోగ్యంతో మరణించారు.అయన మృతి పట్ల పట్టణంలోని అన్ని పార్టీల నాయకులూ పాల్గొని నివాళి అర్పించారు. చిలకలూరిపేట లోని జాగుపాలెం నందు ఆయన స్వగృహం నుండి అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో సిపిఐ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ,ముప్పాళ్ల నాగేశ్వరావు,జిల్లా కార్యదర్శి జంగాల అజయ్, వై చంచయ్య, మాల్యాద్రి,చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ గారు,చిలకలూరిపేట టీడీపీ నాయకులు,వైస్సార్సీపీ నాయకులు విడదల గోపి అలాగే సిపిఐ పార్టీ అన్ని జిల్లాల కార్యదర్శిలు పాల్గొన్నారు.   























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.