మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాము - వ్యాపారాలు లేక కమిషన్ షాపులకి డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తుంది

చిలకలూరిపేట - ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాము - వ్యాపారాలు లేక కమిషన్ షాపులకి డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తుంది 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ , జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో , సౌత్ ఇండియా లోని ప్రధాన కూరగాయల ఇంపోర్ట్స్ లో తమకంటూ ఒక ప్రత్యేక  గుర్తింపు పొందిన చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ఈ రోజు చాల గడ్డు పరిస్థితిని ఎదురుకుంటుంది.మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో పండే ఎటువంటి కూరగాయల పంటలను సైతం హోల్ సేల్ & రిటైల్ సప్లై చేసిన ఘనత చిలకలూరిపేట మార్కెట్ ఉన్నదన్న విషయం ఇప్పుడు ఉన్నకొత్త వ్యాపారులకు, ప్రజా పతినిధులకు తెలియకపోవచ్చు. పాత రోజులలో  పక్క రాష్ట్రాలలో ఉండే రైతులు సైతం ఇక్కడి వారితో స్నేహపూర్వక సంబంధాలు ఉండేవారు.విపత్తు వచ్చిన సమయాలలో మార్కెట్ తరుపున వారి స్థోమత తగట్టుగా ఆర్ధిక సాయం,కూరగాయల పంపిణి  చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికి మన రాష్ట్రము లోని ప్రముఖ పుణ్యక్షేతాలకు పండుగ రోజులలో ఉచితంగా కూరగాయల పంపిణి చేస్తూ ఉంటారు. ఆలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటాయి. ఇక్కడ ఉన్న వర్తకసంఘం వారు ఐకమత్యంతో ఉంటూ తమ తమ వ్యాపారాలలో బిజీ గా ఉండేవారు. కమిషన్ షాపు వారు అయితే నైట్ 1 గంటల నుండి వ్యాపారాలకు అన్ని ఎర్పాట్లు చేసుకుంటూ సమయానికి నిద్ర,ఆహారాలు లేకుండా ఎప్పుడు పట్టణానికి కూరగాయల సప్లై అందించేవారు. 

కానీ ఇప్పుడు పరిస్థితి చాల దారుణంగా తయారు అయినది. చుట్టుపక్కల వ్యాపారాలు పెరిగిపోవటంతో మార్కెట్లో వ్యాపారాలు లేక కనీసం ఇంట్లో ఖర్చులకు తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేనంత దారుణమైన తాయారు అయినది. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో వ్యాపారాలు లేక కమిషన్ షాపులకు లక్షలలో అప్పులలో కురుకుపోయి ఉన్నారు. కరోనా కారణంగా మార్కెట్ షాపులను చిన్న మార్కెట్ యార్డ్ లోనికి మార్చారు. అయితే అసలే ఎండా కాలం కూరగాయల పైనా ఎప్పుడు తేమ లేకపోతే కుళ్లిపోయి పాడైపోతాయి. వేడిగాలులు తో కూరగాయలు వడపడిపోయి వ్యాపారులు చాల నష్టపోతున్నారు. 

అక్కడి వారితో మాట్లాడిన మా బృందానికి వారి మాటలు విని చాల బాధ అనిపించింది. 

కరోనా అని చెప్పి మమ్మల్ని మార్కెట్ యార్డుకి (ఇక్కడికి) పంపించారు. 100 షాపులలో  గత లాక్ డౌన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు షాపులు పెట్టుకోవటానికి ధైర్యం సరిపోక 40 షాపులు ముందుకు వచ్చాయి. అయితే వడగాలులకు కూరగాయలు కుళ్లిపోవటంతో వ్యాపారాలు లేక నష్టాలలో కమిషన్ షాపులకు లక్షలలో నష్టాలు పడి షాపులు తీసేసారు. ఇప్పటికి 10 షాపులు రన్నింగ్ లో ఉన్నాయి. మిగిలిన వారు వ్యాపారాలు మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. రెక్కాడితే డొక్కాడని మా బ్రతుకులకు 2 నెలలుగా ఇంట్లో కనీసం సరుకులు తెచుకోవటనికి డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని పిల్లల్ని , పెద్ద వారిని, చూసుకోలేక అటు కమిషన్ వ్యాపారులకు డబ్బులు కట్టలేక ఆత్మ హత్య చేసుకుందాం అని చాల సార్లు ఆలోచించా అన్నారు. ఆ మాటలకూ మా రిపోర్టర్ షాక్ గురి అయ్యారు. నిజంగానే ఆ వ్యాపారాలు పడే బాధ వారికీ మాత్రమే తెలుస్తుంది. కూరగాయల వ్యాపారం తప్ప ఇంకేం చెయ్యలేని మేము కొత్త వ్యాపారాలలో ఇమడలేము అని తెలిపారు.   
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1000 మందికి పైగా ఈ మార్కెట్ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎటువంటి విపత్తు వచ్చిన ముందుగా మార్కెట్ పైన పడి, మార్కెట్ ఖాళీ చేపించి, వ్యాపారాల స్థావరాన్ని మారుస్తున్నారు. వ్యాపారాలు లేక మేము మా కుటుంబాలు పడుతున్న బాధలు ఎవరికీ రాకూడదు అని అనుకుంటున్నాం. మార్కెట్ చుట్టుపక్కలో ఉన్న చిల్లర కోట్ల దుకాణాల్లో రోజు చూస్తున్నాం కరోనా రూల్స్ పాటించకుండా గుంపులు గుంపులుగా ఎలా ఉంటున్నారో. అయితే మార్కెట్ లో షాప్ మార్చి షాప్ ( బేసి, సరి సంఖ్యల విధానంతో ) కోవిద్ రూల్స్ పాటిస్తూ వ్యాపారాలు సాగిస్తాం అని చెప్తున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోని పరిస్థితిలో మేము ఇలా ఉన్నాము అని వాపోయారు. 
ఏ ప్రాంత అభివృద్ధి లో అయిన వ్యాపారులే ముఖ్య పాత్ర పోషిస్తారు. అంతే కానీ వాళ్ళని బాధ పెట్టాలి అని చూస్తే మాత్రం ప్రాంతానికి చాల నష్టం కలుగుతుంది. 



ఇది చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ కధనం - CHILAKALURIPET SPEED NEWS  


















































Share:

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు 31-05-2021 సోమవారం

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు 31-05-2021 సోమవారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొన్ని రోజులతో పోల్చుకుంటే ఈ రోజు 31/05/2021 సోమవారం నాడు కరోనా కేసులు భారీగా తగ్గాయి. ప్రతి రోజు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండేవి అలాంటిది ఈ రోజు చాలా తక్కువ గా 7943 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే 98 మంది చనిపోయినట్టు తెలిపారు. ఈ రోజుతో రాష్ట్రంలో కరోనా కేసులు  16,93,085 లకు చేరింది. ఆక్టివ్ కేసులు 1,53,795గా ఉంది.  





























Share:

చిలకలూరిపేట - కరోనా తీవ్రతని లెక్కచెయ్యకుండా పోదు పొద్దునే ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న పట్టణ ప్రజలు

చిలకలూరిపేట - కరోనా తీవ్రతని లెక్కచెయ్యకుండా పోదు పొద్దునే ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న పట్టణ ప్రజలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

అసలే కరోనా లాక్ డౌన్తో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైనది. ప్రభుత్వం ఇచ్చే పధకాలకు ఆధార కార్డులోని మార్పులు,మొబైల్ నెంబర్ లింక్ వంటి మార్పులకు మధ్యతరగతి ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 
అయితే పొద్దున్న 6గంటల నుండి ఆధార్ కేంద్రాల వద్ద జనం క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. లాక్ డౌన్ వలన 12 గంటల వరకు అనుమతి, మధ్యాహ్నం అదిరిపోయే ఎండలు వలన ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారులు ఆధార్ కేంధ్రాల పెంపు చేపడితే మాత్రం కొంతవరకు ఈ హడావిడి తగ్గించవచ్చు. 
అయినా మధ్యతరగతి బాధలు ఎవరికీ పట్టవు 3 రోజుల నుండి చూస్తున్నాను ఇంత వరకు మొబైల్ నెంబర్ లింక్ చేపించుకోలేకపోయాయని అని ఒకతని తెలిపారు. కరోనా ని కూడా లెక్కచెయ్యకుండా క్యూ లైన్లో సోషల్ డిస్టెన్స్ లేకుండా నుంచుంటున్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/













 





















Share:

ఆనందయ్య కరోనా ముందుకున ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - కరోనా బాధితులు కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతి

ఆనందయ్య కరోనా ముందుకున ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - కరోనా బాధితులు కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో యావత్ ప్రపంచం మొత్తం తన గురుంచి మాట్లాడుకునేలా చేసిన ఆనందయ్య మూలికల వైద్యంనకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది. సీసీఆర్ఎఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆనందయ్య పసరు ముందుకు అనుమతులు లభించాయి. అయితే కంటిలో వేసుకునే మందుకు, కే అనేమందుకు మాత్రం అనుమతులు రాలేదు. వాటి పైనే ఇంకా నివేదికలు రావలసి వున్నది అని తెలిపారు. మందులో ఆరోగ్యానికి హాని కలిగేంచే పదార్ధాలు ఏమి లేవు అని స్పష్టం చేసారు. అయిన మందు వలన కరోనా రోగం తగ్గుతుంది అని కానీ, దాని వల్ల దుష్ప్రబావాలు ఉంటాయి అని కానీ ఎక్కడ నివేదికలో తెలపలేదు అని తెలిపారు. కంట్లో వేసే మందు కు ఇంకా 2&3 వారల వరకు పట్టొచ్చు అని, మాములు ఇంగ్లీష్ మెడిసన్ వాడుతున్న కానీ ఈ మందు వాడొచ్చు అని తెలిపారు. అయితే మందు కోసం కరోనా ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలి అని. కరోనా బాధితులు మందు కోసం రావొద్దు అని,వారి కుటుంబసభ్యులు కానీ బంధువులు కానీ వచ్చి తీసుకోవచ్చు అని తెలిపారు. 





















Share:

చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్ సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 2

 చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్  సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 2


https://chilakaluripetspeednews.blogspot.com/

కౌన్సిల్ సమావేశం లోని ముఖ్యంశాలు 2 వ పార్ట్ 

* చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పు అంశం మళ్లీ ఒకసారి పరిశీలించాలి అని కొత్త కుమారి,శివ కుమారి గారు కోరారు. రఫాని గారు ఈ అంశం పైనా మళ్లీ చర్చించుకుందాం అని తెలిపారు. 

* 37వ వార్డ్ కౌన్సిలర్ శివ కుమారి గారు మాట్లాడుతూ మంచినీటి చెరువుకు ఫెన్సింగ్ వేపించాలి అని తెలిపారు. చెరువులో చేపలు పట్టటం, స్నానం చెయ్యటం చేస్తున్నారు, అలాగే జంతువులు గేదెలు అందులో దిగితున్నట్లు తెలిపారు. 

* 100% వ్యాక్సిన్ ప్రక్రియ జరగాలి అని చర్చించారు

* రాబోయే కాలంలో పట్టణ శివార్లు అయిన జాలయ్య కాలనీ, AMG వెనుక, భావనారుషి నగర్, పసుమర్రు నందు గార్బజి కలక్టర్ ( చేత పోగు చేసే పాయింట్స్ ) ఏర్పాటు చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అక్కడి నుండి జిందాల్ కంపెనీ కి పంపుతున్నట్లు తెలిపారు. 

* పండరీపురం కందిమళ్ల రెండవ గేట్ నందు పైప్ లీకేజీ, వాటర్ రంగు మార్పుల పైనా చర్చించారు. 

* రోడ్లు, డ్రైనేజీలు, శానిటైజేషన్, కొన్ని ప్రాంతాలలో పందుల వలన సమస్యలు, త్రాగునీరు, పారిశుద్యం [పైన చర్చించారు. 

* అమృత్ స్కీమ్ పధకం కోసం 30 కోట్ల రూపాయల బ్యాంకు లోన్ కి వెళ్ళాం అని. వాటి వలన త్రాగు నీరు సమస్య ఉండదు అని తెలిపారు. 

* త్రాగు నీరు, శానిటైజేషన్ , పారిశుద్యం కొరకు బడ్జెట్ నందు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 

* పట్టణంలోని అన్ని బోరుబావుల మరమ్మతులు, ప్రధాన కాల్వలలోని పూడిక తదితర అంశాలపైనా చర్చించారు.   























Share:

చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్ సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 1

చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్  సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 1

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం నందు 31-05-2021 సోమవారం నాడు నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాల పైనా చర్చించారు. అయితే సమావేశం మొదలు అవ్వగానే ముందుగా కరోనా వలన మృతి చెందిన పట్టణ ప్రజలకు సంతాపం తెలిపారు. వారి కోసం కొంచంసేపు మౌనం పాటించారు. 
మునిసిపల్ ఛైర్మెన్ రఫాని అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యంశాలు 

* తడి పొడి చెత్త సేకరణ, వినియోగదారుల పైనా యూజర్ చార్జీల అమలు విధానం , రాష్ట్ర మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. దేని పైనా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర పూర్తి అవగాహనా కల్పించేలా చర్చలు
* కరోనా మృతుదేహాల తరలింపుకు ఎర్పాటు చేసిన రెండు వాహనాల కేటాయింపు అయిన రెండు 2 లక్షల ఖర్చు పైన కౌన్సిల్ ఆమోదం 
* గణపవరంలో శానిటైజేషన్ ప్రక్రియ చెయ్యాలి అని తెలిపారు. కమిష్నర్ రవీద్రగారు దీని పైనా ఇప్పటి వరకు 25 లక్షలతో త్రాగు నీరు ఇబ్బందులు లేకుండా చేసాం అని. విలీన గ్రామాల విషయం కోర్టులో ఉండటం వలన కోర్టు పెర్మిషన్ తో ఇతర అభివృద్ధి పనులు చేస్తాం అని తెలిపారు .  
*  అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక భవనానికి 12.43 లక్షల తో నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయి . 
* 8వ వార్డు నందు చేతి పంపు మరమ్మతులు జరగాలి అని ఆ వార్డు కౌన్సిల్ తెలిపారు. 
మిగిలిన ముఖ్య సమాచారం తరువాత పార్ట్ నందు 



























Share:

చిలకలూరిపేట - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు

చిలకలూరిపేట - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీబీఎన్ ఆర్మీ, పట్టాన టీడీపీ యూత్, సీనియర్ నాయకులూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను పార్టీ ఉపాధ్యక్షులు కరీముల్లా గారు కట్ చేసారు. 4000 కోట్ల రూపాయలతో చిలకలూరిపేట నియోజకవర్గ రూపురేఖలు మార్చి వేసిన పుల్లారావు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వర్ధిలాలి అని తెలిపారు. పట్టణంలోని నిరాశ్రయులకు బిర్యానీ పంచిపెట్టారు. అలాగే బాపూజీ వృధాశ్రమం నందు బిర్యానీ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీనియర్ నాయకులు, యూత్ సభ్యులు, పార్టీ నాయకులూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
























Share:

చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు - రావు సుబ్రహ్మణ్యం

చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు  - రావు సుబ్రహ్మణ్యం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు శనివారం మధ్యాన్నం 3 గంటల సమయం లో రజక కాలనీ నందు ఉన్న ఆరోగ్య కేంద్రం నందు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకొని జిల్లా వైద్య అధికారులతో మాట్లాడారు. 240 వ్యాక్సిన్లు కేటాయిస్తే 50 మందికి మాత్రమే వేశారు. 190 వ్యాక్సిన్లు మిగిలాయి వాటిని కూడా అర్హులకు  ఉపయోగించాలి అని . వాలటరీలు స్లిప్స్ ఇచ్చిన తరువాత వ్యాక్సిన్ కోసం అని ఇక్కడికి వస్తే 84 రోజులు గడిచాకే సెకండ్ డోస్ వేస్తాం అని చెప్పటంతో వాళ్ళు వెనుతిగారు అని ఇలా ప్రజలను అనవసరంగా వ్యాక్సిన్ సెంటలకు తిప్పటం పట్ల  జిల్లా వైద్య అధికారుల పని తీరు పైనా ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికీ కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నారు అని తెలిపారు. అలాగే కొన్ని వ్యాక్సిన్ సెంటర్లలో 2000 రూపాయలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అని వాటిపైన ద్రుష్టి పెట్టాలి అని తెలియజేసారు . 



























Share:

చిలకలూరిపేట - బంగారం చోరీ కేసుని నేరుగా పరిశీలించిన డిఎస్పీ

 చిలకలూరిపేట - బంగారం చోరీ కేసుని నేరుగా పరిశీలించిన డిఎస్పీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో నిన్న జరిగిన చోరి కేసును ఛేదించటానికి నేరుగా డిఎస్పీ విజయ భాస్కర్ గారు నేరుగా చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితురాలు పుచ్చకాయల సీతారావమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీతారావమ్మ చెప్పిన దాని ప్రకారం అప్పుడప్పుడు ఆమె బీపీ, షుగర్ పరీక్షల కోసం అని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. అయితే వచ్చిన దొంగలు ఆరోగ్య పరీక్షలు ఏంటి వద్ద నిర్వహిస్తాము అని చెప్పి ఆమెను కట్టేసి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదుతో పారిపోయారు. అని తెలిపారు. డీఎస్పీ చుట్టుపక్కల స్థానికులతో మాట్లాడి అనంతరం త్వరలోనే నిందితులను పట్టుకొని అరెస్ట్ చేస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ తోపాటు పట్టణ, రూరల్ CI లు పాల్గొన్నారు.    







































Share:

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి  

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి పురుషుడు విలియం షేక్స్పియర్ (80) మంగళవారం నాడు కన్నుమూశారు. బ్రిటన్ దేశంలో డిసెంబర్ 8 న ఫైజర్ అనే బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే అయిన చనిపోవడానికి కరోనా కాదు అని తెలుస్తుంది. కరోనా కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన మరణించారు అని వైద్యులు నిర్ధారించారు. 































Share:

చిలకలూరిపేటలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందిన మహిళా

చిలకలూరిపేటలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందిన మహిళా 

https://chilakaluripetspeednews.blogspot.com/

మంగళవారం ఉదయం పట్టణంలోని  రాగన్నపాలెం కి చెందిన ఒక మహిళా (50) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో గుంటూరు GGH లో జాయిన్ అయినది. సదరు మహిళా మంగళవారం సాయంత్రం నాడు మృతి చెందారు. అయితే కరోనా తగిన తర్వాత మళ్లీ ఈ కొత్త బ్లాక్ ఫంగస్ వలన కరోనా తగ్గిన వ్యక్తులలో ఆందోళన మొదలైనది. 






















































Share:

చిలకలూరిపేట - ఆరోగ్యపరీక్షలు చెయ్యటానికి వచ్చాము అని చెప్పి - బంగారం తో ఉడాయించిన దొంగలు

చిలకలూరిపేట - ఆరోగ్యపరీక్షలు చెయ్యటానికి వచ్చాము అని చెప్పి - బంగారం తో ఉడాయించిన దొంగలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం నాలుగో లైన్ నందు కొంతమంది వ్యక్తులు ఆరోగ్య పరీక్షలకు వచ్చాము అని నమ్మబలికి తీరా ఇంటిలోకి ప్రవేశించాక ఆమెను కుర్చీలో తాళ్లతో కట్టివేసి గుడ్డలు నోటిలో కుక్కి ఆమె మేడలో ఉన్న 17 సవర్ల బంగారాన్ని, 4000 రూపాయల నగదుతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పట్టాన CI బిలాలుద్దీన్ గారు సంఘటన స్థలానికి చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. CI బిలాలుద్దీన్ గారు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు వస్తే పట్టాన పోలీసుస్టేషన్ నందు సమాచారం అందించాలి అని తెలిపారు. 







































Share:

చిలకలూరిపేటలో గుట్కా విక్రయాల పైనా పోలీసుల పంజా - ఒకరు అరెస్ట్

చిలకలూరిపేటలో గుట్కా విక్రయాల పైనా పోలీసుల పంజా - ఒకరు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో గుట్కా విక్రయించే వారి పైనా పోలీసులు పంజా విసిరారు. అర్బన్ CI బిలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో SI సుబ్బారావు, నరసాదాసు మరియు పోలీస్ సిబ్బంది తో పట్టణంలోని పలు షాపులలో తనిఖీలు చేపట్టారు. అయితే చలివేంద్రం బజార్ నందు ఒక షాపునందు అనుమానంతో వెతకగా వందల సంఖ్యలో నిషేధిత గుట్కా, విమల్ ప్యాకెట్స్ బయటపడ్డాయి. అయితే సదరు వ్యక్తిని విచారించగా కొంతమంది వ్యక్తులు టూ వీలర్ లో వచ్చి తమకు వీటిని MRP ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి 5,10 రూపాయల లాభంతో వీటిని అమ్ముతున్నట్లు తెలిపారు. అయితే ఆ వ్యక్తిపైన కేసు నమోదు చేసి, పాకెట్స్ సీజ్ చేసి, అరెస్ట్ చేసారు.  5,10 రూపాయల లాభంకోసం ఇతరుల ప్రాణాలని రిస్క్లో పెడుతున్నారని, పట్టణంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. 













Share:

చిలకలూరిపేట - చల్లగా ఉన్నకూడా వడగాలులు

చిలకలూరిపేట - చల్లగా ఉన్నకూడా వడగాలులు

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట గత కొన్ని రోజలుగా పట్టణంలోని చల్లగాలులకు అలవాటుపడ్డ పురప్రజలు ఈ రోజు మాత్రం ఎండ లేకపోయినా కానీ వడగాలులు మాత్రం బాగా వీచాయి. కొన్ని రోజులుగా తుపానులు, అల్పపీడనం వలన పట్టణములో మధ్యాన్నం సమయానికి చల్లటి వాతావరం, చిరుజల్లులతో  సాయంత్రానికి సేద తీరేవాళ్ళు, రాత్రి సమయాలలో హాయిగా నిద్రపోయేవారు. కానీ ఈ రోజు 41డిగ్రీల టెంపరేచర్ నమోదు అయినది. గత 20 రోజులుగా ఇంత ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. రాబోవు రెండు & మూడు రోజులు ఇలాగే ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి అని అంచనా.  


























































Share:

చిలకలూరిపేట ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఎక్కడ చేస్తారు అంటే !

చిలకలూరిపేట ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఎక్కడ చేస్తారు అంటే !

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మొబైల్ నెంబర్ కు ఆధార్ కార్డు లింక్ ఎక్కడ చేస్తారో చాల మందికి తెలియక తెలిసిన 1,2 ప్రదేశాలలో క్యూ లైన్ లో నుంచొని 12 గంటలకి లాక్ డౌన్ మొదలవుతుంది కావున ఇంటికివెళ్ళి తరువాతి రోజు అదేవిధంగా జరుగుతుంది. 

అయితే మన చిలకలూరిపేట నందు 5 ఆధార్ ఎన్రొల్మెంట్ సెంటర్లు ఉన్నాయి. వాటి వివరాలు 
 1) మంజు నర్సింగ్ హోమ్, గాంధీపేట ,ఆపోజిట్  RVSCVS హైస్కూల్
 2) స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా , రామకోటి బిల్డింగ్స్ , ఆపోజిట్ గ్రాండ్ వెంకటేశా 
 3) ఆంధ్ర బ్యాంకు , సుబ్బయ్యతోట ఆంజనేయ స్వామి గుడి రోడ్  
 4) BSNL ఆఫీస్ , RVSCVS హైస్కూల్ రోడ్ 
 5) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ , ఆధార్ సేవ కేంద్రం, గ్రామా సచివాలయం-1, పసుమర్రు

పైన తెలియచేయబడిన ఆధార్ కేంద్రాలలో మొబైల్ నెంబర్ ని ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవచ్చు 
























Share:

ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా బాధితులకు అత్యవసర ఇంజక్షన్ గా పేరు పొందిన రెమిడీసీవర్ ఇంజక్షన్ తయారీకి మన సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం గొల్లపూడి గ్రామము నందు ఉన్నసేఫ్ పేరేంటరల్స్ లిమిటెడ్ నందు MP శ్రీకృష్ణదేవరాయల లేఖ మేరకు అనుమతులు లభించాయి. అయితే 5లక్షల ఇంజక్షన్ తయారీకి మాత్రమే అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే అంబట్టి రాంబాబుగారు, MP శ్రీకృష్ణదేవరాయలుగారు ఆయా ప్రాంతాన్ని సందర్శించి ఇంజక్షన్ తయారీ, ఇతర అంశాలపైనా చర్చించారు. 





















Share:

చిలకలూరిపేట - ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు

చిలకలూరిపేట - ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు, మౌళిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా హాస్పిటల్ సదుపాయాలకు అందరూ సహకరించటం చాలా ఆనందకరమైన విషయం అని, ప్రైవేట్ వైద్య శాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడ ప్రభుత్వ  వైద్యం అందుతుంది అని, MP, MLA పిలుపు మేరకు ధాతల అందించిన సహకారం శుభపరిణామం అని తెలిపారు. అలాగే మౌళిక సదుపాయాలు, 4 లక్షల విలువైన మందులను అందించిన నాయుడు రమేష్ గారికి, ఆక్సిజన్ సిలిండర్ అందించిన బైరా కుటుంబ సభ్యులకు, 4 లక్షల విలువైన మాస్కలు, శానిటైజెర్లు ఇతర  వైద్య సదుపాయాలకు అవసరం అయిన వాటిని అందించిన అసిస్ట్ సంస్థకు ప్రత్యేకమైన  ధన్యవాదాలు తెలిపారు. అలాగే MLA గారి పర్యటించి ఇక్కడ రోగులకు ఉచిత భోజన సదుపాయాన్నిఎర్పాటు చేస్తాం అని చెప్పటం చాల ఆనందంగా ఉంది అని,  అలాగే డాక్టర్ భవాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ పని చేసే స్టాఫ్ డాక్టర్స్, నర్సులు, సిబ్బందికి  అభినందించారు. 
 
హాస్పిటల్ నందు శానిటైజ్ సిబ్బందిని ఎర్పాటు చెయ్యాలి అని, అలాగే RK హాస్పిటల్ నందు ఆక్సిజన్ వార్డులో పని చేసే సిబ్బందిని అక్కడ కరోనా ట్రీట్మెంట్ అనుమతులు నిలిచిపోవటం వలన వారిని ఎక్కడికి తీసుకువచ్చి ఆక్సిజన్ సప్లై ఇబ్బందులు లేకుండా చెయ్యాలి అని, పట్టణం నుండి NH 16 జాతీయ రహదారి కారణంగా ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల యాక్సిడెంట్ కేసులు ఇక్కడికే వస్తుంటాయి కావున ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిలో  శవాగారం ఎర్పాటు చేస్తున్నారు. కానీ అత్యవసరం కొరకు కొన్ని ఐస్ బాక్ససులు ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. ఈ సందర్భంగా నవతరం పార్టీ నాయకులూ పాల్గొన్నారు 

డాక్టర్ భావాని గారు మాట్లాడుతూ మేము డాక్టర్ వృత్తిని ఎన్నికొని ఇక్కడ పని చెయ్యటం అందరికి సేవ చెయ్యటం దేవుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం అని, సిబ్బంది కరోనా లెక్క చెయ్యకుండా వారికీ సేవలు అందిస్తున్నరు అని తెలిపారు 


























Share:

కరోనా బాధితులకు ఏ సమస్య వచ్చిన మాకు కాల్ చెయ్యండి - ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ చిన్న

కరోనా బాధితులకు ఏ సమస్య వచ్చిన మాకు కాల్ చెయ్యండి - ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ చిన్న 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ రఫాని గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు పాల్గొన్నారు. నిన్న బుధవారం గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించి అక్కడి రోగులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా ఓపీ, నాన్ కరోనా ఓపీ ఒకచోట ఉండటం అసహనానికి గురి అయ్యారు. వెంటనే రెండు వేరు వేరు ఓపీ విభాగాలని ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. అలాగే కొన్ని వార్డులలో పర్యటించి మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్లతో నీటిని అందించాలి అని తెలిపారు. 
ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో MLA గారి పిలుపు మేరకు ఉచిత కరోనా మృతిదేహాల తరలింపుకు వాహనాని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నందు 100 పడకలుగా నిర్మాణాన్ని పరిశీలించారు అని.అలాగే కరోనా రోగులకు ఎ సమస్య వచ్చిన తమకు కాల్ చెయ్యవచు అని తెలిపారు. 
మున్సిపల్ చై ర్మెన్ రఫాని గారు :- 9440479765
మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు :-9553129726































Share:

ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు

ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట- పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత కొన్ని రోజుల క్రితం పర్యటించిన MP లావు శ్రీకృష్ణదేవరాయలు గారు హాస్పిటల్ నందు ధాతల సహకారం అందిస్తే రోగులకు మంచి వైద్యం అందించవచ్చు అని పిలుపునిచ్చారు. MP గారి పిలుపుమేరకు హాస్పిటల్ నందు వైద్య పరికరాలు, మౌళిక సదుపాయాలు ఎర్పాటుకు చాలా మంది ధాతలు ముందుకి వచ్చారు. 
మళ్ళీ బుధవారం నాడు MP పర్యటించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే అసిస్ట్ సంస్థకు, జోసిల్ కంపెనీ వారికీ, నాయుడు రమేష్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఇలాగే విపత్కర పరిస్థితులలో అందరం కలిసి కట్టుగా పని చేసుకోవాలి అని తెలిపారు. 
గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యురాలు భవాని గారు మాట్లాడుతూ MP, MLA గారి చొరవతో ఈ రోజు సామాన్య ప్రజలకు కరోనా వైద్యాన్ని అందజేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమానికి MP గారి అనుచరులు నాయుడు రమేష్ గార, బైర వెంకటకృష్ణ గారు , వల్లేటి శహిమంతరావు గారు,గడిపూడి దశరధ రామయ్య గారు పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/
























Share:

చిలకలూరిపేట - క్వారంటైన్ సెంటర్ నందు ఫ్రూట్స్ పంపిణి చేసిన భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్

చిలకలూరిపేట - క్వారంటైన్ సెంటర్ నందు ఫ్రూట్స్ పంపిణి చేసిన భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాలలో ఉన్న కరోనా కోరంటైన్ నందు పట్టణములోని భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా రోగులకు ఫ్రూట్స్ అందించారు ట్రస్ట్ సభ్యులు. కోరంటైన్ నందు భోజన సదుపాయాలు , మంచినీటి వసతి ఉన్న రోగులు త్వరగా కోలుకోవడానికి ఫ్రూట్స్ అందజేశారు. మందులతో పటు నాచురల్ ఫ్రూట్స్ వలన కలిగే లాభాలని తెలియజేసి వాటిని కరోనా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వడాల భాస్కర్ , కందుల రవి, వంశీ, సాయి మురారి, నాయుడు ఫణి, కీర్తి సాయి, గుడిపల్లి యశ్వంత్ పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


























Share:

చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులలో ఆందోళన !!!

చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులలో ఆందోళన !!!

https://chilakaluripetspeednews.blogspot.com/
చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 2వ తారీఖున పలువురు బ్యాంకు సిబ్బంది కరోనా రావటంతో 3వ తరుకు నుండి బ్యాంకు మూసివేశారు . అప్పటినుండి మధ్యలో 1,2 రోజులు ఓపెన్ చేసినా బ్యాంకు పనుల నిమిత్తం ఖాతా దారులకు అనుమతి లేకుండా బ్యాంకు పనులు చూసుకొని మళ్లీ మూసివేశారు. ఇప్పటికే 15 రోజుల అవుతున్న కారణంగా వ్యాపారలావాదేవీలు కోసం వ్యాపారస్తులు, అత్యవసర లావాదేవీలు జరపటానికి బ్యాంకు మూసి ఉండటంతో బ్యాంకు ఖాతా దారులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బ్యాంకు ఓపెన్ చేసి అత్యవసర లావాదేవీలకు అనుమతించాలి అని కోరుతున్నారు 










































Share:

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు.

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని భగవత్ గీతా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా సేఫ్టీ కొరకు ప్రత్యేకంగా తాయారు చేయించిన పొడిని ఫ్రంట్ లైన్ వర్కర్స్ (మునిసిపాలిటీ ఆఫీస్, పోలీస్టేషన్, హాస్పిటల్స్ ) ఆఫీసు నందు అందజేశారు. ఈ పౌడర్ని ఏడు రకాల సుగంధ ద్రవ్యాలతో( జాజికాయ, జాపత్రి జాజిపువ్వు, అనాసపువ్వు, యాలుకాయలు, లవంగాలు, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం ) తాయారు చేసారు. ట్రస్ట్ అధ్యక్షులు గుడిపల్లి నాగభూషణం గారు  వీటి వలన కరోనా బాక్టీరియా గాలిలో విస్తరించకుండా కొంత వరకు కాపాడుతుంది అని తెలిపారు.కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా తాయారు చేయించారు అని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు వీటిని  మునిసిపల్ చైర్మన్ రఫ్ఫాని గారికి, అర్బన్ CI బిలాలుద్దీన్ గారికి, రూరల్ CI సుబ్బారావు గారికి, కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కి అందించారు. ఈ కార్యక్రమంలో వడాల భాస్కర్, కందుల రవికుమార్, నాయుడు ఫణి, ఇతర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.   

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/







































Share:

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున కరోనా మృతి దేహాలను తరలించటానికి ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసారు. 
కరోనా కారణంగా పట్టణంలో చాలామంది చనిపోయారు.  హాస్పిటల్ ట్రాట్మెంట్ కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ చివరికి చాల మంది ఆక్సిజన్ అంధక, వ్యాధి తీవ్రతని ముందుగా గ్రహించలేక చివరకి చాలామంది మృతిదేహాలతో బయటకి వస్తున్నారు. అప్పటికే లక్షల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురి అయిన  మృతి చెందిన కుటుంబానికి ఆ మృతుదేహాలను ఖననం కొరకు శ్మశానం వరకు తరలించటానికి ఎవరు సహకరించక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తు మళ్లీ అక్కడ ఇంకో 50 వేలు వరకు దోపిడీకి గురి అవుతున్న నేపథ్యంలో, అలాంటి వాటి అన్నింటికీ తెర దించుతూ పట్టణంలోని మునిసిపాలిటీ పురపాలకసంఘం ఆధ్వర్యంలో ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మెన్ షేక్ రఫాని గారు, మునిసిపల్ కమిషనర్ ఫణి కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఫాని గారు ,మాట్లాడుతూ ఎవరైనా కరొనతో మృతు చెందిన వారికీ ఈ వాహనం సేవలు ఉపయోగించుకోవాలి అని తెలియజేశారు. 
ఉచిత వాహనం కొరకు రవికుమార్ :- 9948923050 , మస్తాన్ రెడ్డి :- 9951079006 ఈ నంబర్లకు కాల్ చేసి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు, తలహఖాన్ గారు , దరియావాలి గారు పాల్గొన్నారు. 










































Share:

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కరోనా వైద్య చికిత్సలు అందిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా రోగుల,వైద్యుల భద్రత కొరకు చిలకలూరిపేట ఇంటర్నేషనల్ సేవా సంస్థ అసిస్ట్ 5 లక్షల రూపాయల విలువగల వైద్య సామగ్రి అందజేశారు. ఆసుపత్రి వైద్యురాలు భవాని గారికి పి పి ఏ కిట్లు, ఎన్ 95 మాస్కులు , శానిటైజెర్ , సెలైన్ స్టాండ్లు,ధర్మామీటర్లు అందజేశారు. ఈ సందర్భంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఇంకా వైద్య సదుపాయాలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ కృష్ణ. రంగారావు గారు, సూర్యనారాయణ, డేవిడ్, రాజు,ఇమ్రాన్,వంశీ తదితరులు పాల్గొన్నారు 
































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట కరోనా మొదటి వేవ్ నందు గ్రామాల ప్రజలు తపించుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ మాత్రం గ్రామాలను కూడా వదలటం లేదు. చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామాలలో మాత్రం ఈసారి ఏ పల్లెటూరుని కూడా వదలటం లేదు. ఎక్కడ నిర్లక్ష్యం గా వ్యవహరించినా అసలు కనికరం చూపటంలేదు. ముఖ్యంగా యడ్లపాడు, పసుమర్రు ఏరియాలలో చాపక్రింద నీరులాగా వ్యాపిస్తుంది. గ్రామాలలోని ప్రజలు కొన్ని రోజులపాటు 10 రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి తెచ్చుకొని బయటకు రాకుండా ఉంటే పట్టణంలో కన్నా గ్రామాలలో త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. దయచేసి గ్రామాలలో ఉన్న యువకులు ముందుకి వచ్చి ఈ కరోనా సమయంలో ప్రోటోకాల్ పాటిస్తూ తమ తమ గ్రామాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను సంప్రదించి ఊరులోని వ్యక్తులు బయట జాబ్ చేసుకునే వాళ్ళ నుండి కరోనా విపత్తు వివరించి చందాలు పోగుచేసి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళని ఇళ్లలో నుండి బయటకి రావద్దు అని చెప్పి వారికీ ఆహార సదుపాయాలు చూసుకుంటే కొన్ని రోజులలోనే కరోనా విపత్తు నుండి బయటపడవచ్చు. గ్రామపెద్దలు సహకారంతో యువకులు ముందుకు వచ్చి నిలబడాలి అని కోరుకుంటున్నాము. ఎంతో మంది డబ్బు ఉన్నవారు కరొనతో చనిపోయినవారు ఉన్నారు కానీ అక్కడ డబ్బు ఉపయోగపడలేదు. మనుషులు మాత్రమే ముఖ్యం.  యువకులు తలుచుకుంటే ఏది అయిన చెయ్యవచ్చు. మన గ్రామాలను అందులోని మనుషులను కాపాడుకుందాం. కరోనా తతీవ్రత తగ్గినప్పటి నుండి గ్రామాలలో వ్యాక్సిన్ ప్రక్రియకు కూడా మీ సహకారం అందించి గ్రామ సుభిక్షతకు తోడ్పడండి.  



























Share:

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట రేపు శనివారం కారణంగా విధ్యుత్ మరమ్మతులు కోసం పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో కరంటు కోత విధిస్తున్నట్లు డి ఈ ఈ సీహెచ్ రంబొట్ట్లు గారు తెలిపారు. పట్టణంలోని ఎన్ ఆర్ టి సెంటర్ నుండి విజయ బ్యాంకు వరకు స్టేట్ బ్యాంకు , సిటీ యూనియన్ బ్యాంకు , హనుమాయమ్మ సత్రం,గాంధీపేట,హైస్కూల్ రోడ్డు, మునిసిపల్ ఆఫీస్ రోడ్డు, కొత్త పోలీస్టేషన్ రోడ్డు, డిక్మెన్ నగర్  ఉదయం 8:30 నుండి 11:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది అని తెలిపారు . 






































Share:

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ నందు ప్రతి సంవత్సరం ఎర్పాటు చేసే సామూహిక ప్రార్ధనలూ కరోనా కారణంగా ఈసారి నిర్వహించలేక రోడ్లు అన్ని బోసిపోయాయి. అయినా పట్టణంలో రంజాన్ వేడుకలు కరోనా ప్రొటొకాల్ పాటిస్తూ ఘనంగా జరుగుతున్నాయి. పరిమితి సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదులకు చేసుకొని మత పెద్దల సహకారంతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అలాగే మసీదులకు రాని వారు తమ తమ ఇళ్లలోనే ప్రార్ధనలు నిర్వహించుకుంటున్నారు. దేశంలోని ప్రజలు ఆరోగ్యంగా గా ఉండాలి అని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. అలాగే ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కట్టడికి కలిసి కట్టుగా కృషి చెయ్యాలి అని తెలిపారు మత పెద్దలు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ , శానిటైజేర్ వాడాలి అని తెలిపారు. 





























 

Share:

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించారు. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు మౌలిక సదుపాయాలు తనిఖీ చేశారు. హాస్పిటల్ గదులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల శుభ్రతను పరిశీలించి దిశా నిర్దేశం చేసారు. అలాగే కరోనా వార్డు నందు బెడ్లు పెంపు నాకు లేఖ జిల్లా అధికారులకు రాసారు. అలాగే త్వరలో రెమిడీసివెర్ ఇంజక్షన్,ఆక్సిజన్ సీలిండర్ల పైనా ద్రుష్టి పెట్టారు.హాస్పటల్ నందు అత్యవసర గా కొంత మంది డాక్టర్లను, నర్స్ లను తీసుకోవాలి అని ప్రధాన వైద్యురాలిని కోరారు. అలాగే కొత్తగా తీసుకున్న వారికీ గవర్నమెంట్ జాబులకు రెఫరెన్సు సిఫారసు చేస్తాము అని తెలిపారు. దాతలు ఎవరైనా హాస్పిటల్ నాకు సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు. 
 
ఎంపీ పిలిపు మేరకు హాస్పిటల్ నందు నాయుడు రమేష్ గారు మరుగుదొడ్లు నందు పైపులను మరమ్మతు చేపించారు, హాస్పిటల్ గదుల నందు కొత్త ఫ్యాను లను ఎర్పాటు చేసారు. అలాగే గురువారం నాడు అసిస్ట్ సంస్థ నుండి కరోనా రోగులకు ఆక్సిజన్ మాస్కులు, గన్ మీటర్లు, పేస్ షీల్డులు , డాక్టర్లకు,సిబ్బందికి పి పి ఏ  కిట్లను అందజేశారు . అలాగే సింగపూర్ నందు ఉంటున్న బైరా స్వర్ణలత గారు 20 ఆక్సిజన్ సీలిండర్లను అందజేశారు. అలాగే కరోనా వార్డులలో ఉన్న 20 బెడ్లను 30 కి పెంచారు. మరో రెండు రోజులలో మరిన్ని సౌకర్యాలను అందజేస్తాం అని మంత్రి అనుచరులు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు వైస్సార్సీపీ ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.  


https://chilakaluripetspeednews.blogspot.com/


































Share:

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ముందుగా చిలకలూరిపేట ముస్లిం సోదరులకు చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ తరుపున రంజాన్ శుభాకాంక్షలు. అలాగే పట్టణములోని ముఖ్య నాయకులూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. MLA విడదల రజని గారు, ప్రతిపక్షనేత మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే రంజాన్ విశిష్టత తెలియజేసారు. 
ఈ రంజాన్ పండుగ నుండి కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని అల్లా ని కోరుకుందాం. ప్రార్ధన సమయాలలో మాస్క్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. 


































Share:

చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు

చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట -  పట్టణాన్ని వరుణ దేవుడు అలా పలకరించి వెళ్లారు . కొన్నిరోజులుగా పట్టణములో ఎండలు మండిపోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా మధ్యాహ్నం 12 తరువాత ఎవరు బయటకి రాకపోవటంతో ఎండల తీవ్రత అర్ధం కావటం లేదు కానీ బయట ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈరోజు 3 గంటల ప్రాంతంలో నల్లటి మొబ్బులతో చల్లటి వాతావరం ఏర్పడింది. అయితే దానికి తోడు తుపాను తలపించేలా గాలులు వీచాయి. దీనితో పట్టణములోని ప్రజలు కొంచం సేపు వాతావరణాన్ని ఆస్వాదించారు. చల్లటి గాలులు, చిన్న చిన్న వర్షపు చినుకులతో రోడ్లు అన్ని తడిచాయి. ఇంతలోనే మొబ్బులు మాయం గాలులు ఆగిపోయాయి . 






















Share:

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే 

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



శ్యామ్ కలకడ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ అభిమానులు, పార్టీ సోషల్ మీడియా, పార్టీ  ముఖ్యనేతలకు ఈ పేరు తెలియని వారు ఉండరు. వైస్సార్సీపీ పార్టీకి సోషల్ మీడియా వెన్నుముక గా చెప్పుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు.
శ్యామ్ కలకడ సొంత ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. వృత్తి రీత్యా సాఫ్టువేర్ ఇంజనీర్, బెంగళూర్ నందు ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్, ముఖ్యంగా తెలుగువారు ఎవరైనా బెంగళూర్ వచ్చారు అంటే అక్కడి వసతులకు, ఆహారానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే వ్యకి ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి అనుకోకుండా 2010 నుండి రాజకీయాలకు దగ్గిరగా ఉండి వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి యువతను పార్టీకి దగ్గిర చేస్తూ , ముఖ్యంగా గత పాలకుల వైఫల్యాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు తెలిసేలా చేసి పార్టీ ని యువతలో బలోపేతం చేసిన వ్యక్తి . అలా బెంగళూర్ వేదికగా వైస్సార్సీపీ పార్టీ తెలుగు ప్రజలకు చేరువ చెయ్యటంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ముఖ్య నేతలే ఒప్పుకుంటారు.బెంగళూర్ వైస్సార్సీపీ ఐటీ వింగ్ శ్యామ్ కలకడ 

అయితే కరోనా కారణంగా శ్యామ్ నిన్న తుది శ్వాస విడిచారు. లక్షలాది మంది వైస్సార్సీపీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ సభ్యులు ఆయన మరణ వార్తను ట్రిండింగ్ చేసారు. ట్విట్టర్,ఫేసుబుక్కులలో ఎక్కడ చూసిన అతని పోస్థులే. పార్టీలో అంత చనువు ఉన్న ముఖ్య వ్యక్తి చనిపోతే సాయంత్రం వరకు కూడా సీఎం జగన్ స్పందించక పోవటం పార్టీ యువతను తీవ్రంగా కలచివేసింది. పార్టీ ఫాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని గురి అయ్యారు. పార్టీ ముఖ్య వ్వక్తి కరొనతో బాధపడుతుంటే మంచి వైద్యం అందించలేకపొయ్యారు అని. మంచి వైద్యం అందించి ఉంటే బ్రతికి ఉండేవాడు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్రేండింగ్ చేసారు అభిమానులు. ఎట్టకేలకు సాయంత్రం సమయానికి స్వయంగా సీఎం జగన్ శ్యామ్ భార్యకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. సీఎం జగన్ స్పందనకు పార్టీ యూత్ కొంచం శాంతించారు. అయిన శ్యామ్ మరణం పార్టీ సోషల్ మీడియా కి తెరనిలోటుగా భావిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/




ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/
























Share:

చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్

చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా అఖిల భారత విద్య పరిషత్ (ABVP ), బీజేపీ,భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు,యువకులు సంయక్తంగా పట్టణములోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్వచ్చంధంగా శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. పట్టణములోని దేవాలయాలు,గోశాలలు, మార్కెట్ పరిసర ప్రాంతాలు,పాఠశాలలో  వైరస్ వ్యాప్తి చెందకుండా  ఈ శానిటైజేషన్ చేపడుతున్నారు. రోజుకు ఒక ఏరియా చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యకార్యకమాలలో ABVP -  మురారి,బీజేపీ - వంశీ, ఫణి , ట్రస్ట్ -  కందుల రవి, నాయుడు ఫణి , సాయి, నరసరావుపేట పార్లమెంట్ ఓబీసీ ,మోర్చా ఉపాధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి, డీజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 




























 
Share:

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే  

https://chilakaluripetspeednews.blogspot.com/
గూగుల్ పే ప్రస్తుత పరిస్థితులలో డిజిటల్ పేమెంట్స్ తెలియనివారు ఉండరు. ఫోన్ పే , గూగుల్ పే బ్యాంకు ట్రాన్సక్షన్ మరింత సులభతరం చేసాయి. బ్యాంకులకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించటం  వలన సమయము కలిసి రావడంతో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ మొగ్గు చూపుతున్నారు. పల్లెలు, పట్టణాలు,గ్రామాలూ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క చోట బడ్డీ కొట్టు నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి.     
అయితే డిజిటల్ పేమెంట్ ఆల్ఫాబెట్ కంపెనీ కి సంబంధించిన  గూగుల్ పే ఇప్పుడొక శుభవార్త తెలిపింది. త్వరలో అంతర్జాతీయ పేమెంట్స్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా నుండి పేమెంట్స్ పంపుకోవటానికి వీలుగా ఎర్పాట్లు చేస్తున్నాము అని , అయితే అమెరికాలో కూడా గూగుల్ పే వాడే వారికి  మాత్రమే ఈ అవకాశం అని. త్వరలోనే అన్ని దేశాలలో ఈ ఫీచర్ని తీసుకువస్తాము అని తెలిపింది. 
గూగుల్ పే తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే ఎలా రెస్పాండ్ అవుతుందో చూదాం.  







































Share:

చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!

చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!! 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టాన పుర ప్రజలకు కరోనా వీర విజృంభణ కారణంగా మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ కారణంగా విద్యుత్ బిల్లు చెల్లింపునకు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే రావలెను అని డి ఈ ఈ సి. హెచ్ రాంభొట్ల గారు తెలిపారు. అందువలన బిల్లు చెలింపునకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ వాడాలి అని , క్యూ లైన్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాలి. కరోనా నియమాలు పాటించాలి అని తెలిపారు 











































Share:

తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.

తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

తమిళనాడు గడిచిన 2021 అసెంబ్లీ ఎన్నికలలో DMK (స్టాలిన్) 234 స్థానాలకు గాను 159 స్థానాలు గెలిచి విజయకేతనం ఎగురవేశారు. అయితే గెలిచిన ఆనందంలో పార్టీ కార్యకర్తలు చెన్నై లోని  AIDMK పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎర్పాటు చేసిన అమ్మ కాంటీన్ల పైన  దాడి చేసి జయలలిత ఫోటోలను చించివేశారు.  విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి MK స్టాలిన్ అలాంటి చర్యలకు పాల్పడిన సొంత పార్టీవాళ్ల పైనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఇక పైన కూడా అమ్మ కాంటీనులు కొనసాగుతాయి అని తెలిపారు. కొనసాగటమేకాదు అందులో జయలలిత ఫొటోలు కూడా ఉంటాయి అని తెలిపారు. అలాగే కార్యకర్తలు చించివేసిన జయలలిత ఫోటోల స్థానంలో జయలలిత కొత్త ఫొటోలను ఎర్పాటు చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసారు. MK స్టాలిన్ కు తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు 


















Share:

ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు

ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇప్పటి వరకు 20 కొవిడ్ బెడ్లు మాత్రమే ఉండేవి. 20 మందికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం  ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆకస్మిక పర్యటన చేసి హాస్పిటల్ వసతుల పైన దృష్టి పెట్టాలి అని తెలియజేశారు. అయితే ఎంపీ గారి చొరవతో 20 బెడ్లను 30 కి పెంచాలి అని అధికారులకు లేఖ రాయటం జరిగింది. అయితే ఆయా లేఖ పైన స్పందిస్తూ జిల్లా అధికారులు 10 బెడ్లు అదనంగా ఎర్పాటు చేసారు. దీనితో పట్టణములోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొత్తం 30 బెడ్లు ఉన్నవి. ఇక పైన 30 మంది కరోనా రోగులకు ఉచిత వైద్యం నిర్వహిస్తారు 






Share:

నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ - MP శ్రీ కృష్ణ దేవరాయలు

నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ - MP శ్రీ కృష్ణ దేవరాయలు  

https://chilakaluripetspeednews.blogspot.com/

రెమిడీసివిర్ ఈ పేరు ఈ మధ్య కాలంగా బాగా అందరి నోళ్ళలో నానుతున్న పేరు. ఇక కరోనా వలన  హాస్పిటల్ కి వెళ్లి  అక్కడి నుండి  నుండి కోలుకున్న వాళ్లకు అయితే ఇది ఒక అమృతం లాగా  ఫీల్  అవుతారు. ఎందుకు అంటే కరోనా వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికీ కూడా ఈ ఇంజక్షన్ ఇచ్చిన తరువాత త్వరగా కోలుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందువలన దీని రేటు కూడా 2500 అమ్మవలసిన ఒక్క ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్లో 40,000 కొనుకున్న వారు కూడా ఉన్నారు. 
అయితే నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ రాసారు  MP శ్రీ కృష్ణ దేవరాయలు గారు.  నరసరావుపేటలో గుంటూరు రోడ్డులో ఉన్న సేఫ్ ఫార్మాసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే  మందులు తయారీ కంపెనీకు రెమిడీసీవర్ తయారు చేయటానికి కావలిసిన సదుపాయాలు ఉన్నవి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి అత్యవసర అనుమతులు కోరుతూ లేఖ రాసారు. రెమిడీసీవర్ అనుమతులు ఇస్తే ప్రతి రోజు 60,000 ఇంజక్షన్ తాయారు చేయగలమని. దాని వలన కొంచం అయినా కొరత తగ్గించవచ్చు అని లేఖ లో పేర్కొన్నారు నరసరావుపేట MP లావు శ్రీ కృష్ణ దేవరాయలు . 


https://chilakaluripetspeednews.blogspot.com/





https://chilakaluripetspeednews.blogspot.com/

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.