చిలకలూరిపేట- పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత కొన్ని రోజుల క్రితం పర్యటించిన MP లావు శ్రీకృష్ణదేవరాయలు గారు హాస్పిటల్ నందు ధాతల సహకారం అందిస్తే రోగులకు మంచి వైద్యం అందించవచ్చు అని పిలుపునిచ్చారు. MP గారి పిలుపుమేరకు హాస్పిటల్ నందు వైద్య పరికరాలు, మౌళిక సదుపాయాలు ఎర్పాటుకు చాలా మంది ధాతలు ముందుకి వచ్చారు.
మళ్ళీ బుధవారం నాడు MP పర్యటించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే అసిస్ట్ సంస్థకు, జోసిల్ కంపెనీ వారికీ, నాయుడు రమేష్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఇలాగే విపత్కర పరిస్థితులలో అందరం కలిసి కట్టుగా పని చేసుకోవాలి అని తెలిపారు.
గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యురాలు భవాని గారు మాట్లాడుతూ MP, MLA గారి చొరవతో ఈ రోజు సామాన్య ప్రజలకు కరోనా వైద్యాన్ని అందజేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమానికి MP గారి అనుచరులు నాయుడు రమేష్ గార, బైర వెంకటకృష్ణ గారు , వల్లేటి శహిమంతరావు గారు,గడిపూడి దశరధ రామయ్య గారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment