రేపు 19-04-2021 ఫీజు రేయింబర్సమెంట్ డబ్బులు విడుదల - నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలోకి
ఎప్పటి నుండో విద్యార్థులు ఎదురు చూస్తున్నా జగనన్న విద్య దీవెన పధకం కింద ఫీజు రేయింబర్స్మెంట్ డబ్బులను రేపు అనగా 19-04-2021 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కాలేజీ, స్కూల్ యాజమాన్యాలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతా కి తరలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. ఇప్పటికే కాలేజీల యాజమాన్యం పలు సార్లు విద్యార్ధులకి ఫీజు కట్టమని నోటీసులు పంపించారు.