చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి
చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక జాలయ్య కాలనీకి చెందిన ఐదు కుటుంబాలు గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తుంటారు. ఉన్నట్టుండి ఈరోజు ఉదయాన్నే 35 గొర్రెలు ఎక్కడికక్కడ విగత జీవులై పడి ఉండటంతో వారు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. మరో 10 గొర్రెలు అస్వస్థతతో ఉండటంతో గమనించిన యజమానులు హుటా హుటిన వెటర్నరీ హాస్పటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని వైద్యశాలకు చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. డాక్టర్ చెప్పిన సమాచారం మేరకు గొర్రెలు ప్లాస్టిక్ కవర్లను, ఇతర కలుషిత పదార్థాలను తినడం వల్ల మరణించాయని ఆయన తెలిపారు. చనిపోయిన 35 గొర్రెలు విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని అంచనా ! అస్వస్థతతో ఉన్న 10 గొర్రెలను ప్రాణాలతో కాపాడాలని షేక్ రఫాని వెటర్నరీ వైద్యులకు తెలిపారు.