జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు - బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్
2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం మొత్తం 10,143 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగుల యువత తీవ్ర అసహనానికి గురి అయ్యారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్రమోహన్ గారి ఆదేశాలతో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ నందు నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే ఈ జాబ్ క్యాలెండరు రద్దు చేస్తూ త్వరలో నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాల భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండరు రిలీజ్ చెయ్యాలి అని నరసరావుపేట ఆర్టీఓ ఆఫీస్ నందు ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్, జిల్లా నాయకులు నెమలికంటి బ్రహ్మం, వంశీ ,మురళి,నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ళ కోటేశ్వరావు, కామినేని హనుమంతురావు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.