అసలే కరొనతో అతలాకుతలం అయిన మన దేశంలో కొత్త వేరియంట్లు విజృభిస్తునాయి.కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ మొదలవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తొలిసారిగా ఏపీలో కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటి కేసు నమోదు అయ్యింది అని తెలిపారు. అయితే అతను కోలుకున్నారు అని, అతని వల్ల ఈ వేరియంట్ ఎవ్వరికి సోకలేదు అని తేల్చారు. రోజుకో ఫంగస్ పుట్టుకు వస్తుంది అని, ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకొని థర్డ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలి అని అయన కోరారు.
No comments:
Post a Comment