రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. కొత్తగా విడిపోయిన తరువాత చాలా పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ 2019 ఎన్నికల అనంతరం పరిస్థితి అంతా మారిపోయింది. గత ప్రభుత్వం సంబంధించిన టెండర్లలో అవకతవకలు ఉన్నాయి అని భావించి, సీఎం జగన్ మోహన రెడ్డి రివర్స్ ట్రేండింగ్ మొదలుకొని రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలి అంటే భయం ఏర్పడే పరిస్థితి నెలకొన్నది. ఏపీ కన్నా తెలంగాణ, తమిళనాడు లో ప్రశాంతంగా ఉంటుందనో ఏమో మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లు, ఐటీ హబ్బులు వెళ్లిపోయాయి. ఇపుడు పరిశ్రమలు స్టార్ట్ చేస్తే మళ్లీ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని పెద్ద పెద్ద కంపినీలు వేరే రాష్ట్రాలకి తరలిపోయాయి.
తాజాగా రిలయన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చెయ్యాలి అనుకున్న 15వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ - సెట్టాప్ బాక్ససులు, ఢాంగిల్స్ మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లకు బ్రేకులు వేసింది ఆ సంస్థ, కారణం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 136 ఎకరాలను కేటాయించారు, దానిని ఈ ప్రభుత్వంలో 75ఎకరాలకు కి తగ్గించారు. ఆ 75 ఎకరాల భూమి ఉన్న రైతులు కేసు వెయ్యటంతో ఇక్కడ మనకి పని అవ్వదు అని అనుకున్నారో ఏమో రిలియన్స్ సంస్థ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment