చిలకలూరిపేట లో ఆదివారం నాడు 80 కేసులు నమోదు అయ్యాయి :--
పట్టణంలో ఆదివారం నాడు భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి . దీనితో పట్టణం లో ని ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు . గత ఐదు రోజులగా పట్టణంలో 20,30 కేసులు వస్తున్నాయి. కానీ ఆదివారం రోజు పట్టణంలో కరొన కేసులు భారీగా బయటపడ్డాయి
చిలకలూరిపేట పెద్ద మార్కెట్ స్వచ్చందంగా మూడు రోజులు మూసివేస్తున్నారు:---
చిలకలూరిపేట పెద్ద మార్కెట్ స్వచ్చందంగా మూడు రోజులు మూసివేస్తున్నారు:---- చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘము వారి ఆధ్వర్యం లో మంగళవారం , బుధవారం , గురువారాలలో , కూరగాయల విక్రయాలు నిలిపివేస్తున్నాట్లు మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నారు . దయ చేసి పట్టాణ ప్రజలు గమనించగలరు
చిలకలూరిపేట సంజీవయ్య నగర్లో వ్యక్తి ఆత్మహత్య
చిలకలూరిపేట సంజీవయ్య నగర్లో వ్యక్తి ఆత్మహత్య ;---
చిలకలూరిపేట లోని సంజీవయ్య నగర్లో రోశయ్య అనే వ్యక్తికి అలేఖ్య అనే మహిళతో ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి అయినది . వారు ఉద్యగారీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు . అయితే చిన్న చిన్న విబేధాల వాళ్ళ 9 నెలల క్రితం విడిపోయారు . అతను భార్యకు దూరంగా పేట లోని సంజీవయ్య నగర్లో నివాసం ఉంటున్నాడు . అయితే గురువారం నాడు ఎవరు లేని టైం లో మనస్తాపంతో ఉరివేసుకొని మరణించాడు .
చిలకలూరిపేట లో శుక్రవారం 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు
పట్టణం లో కరోనా పంజా
చిలకలూరిపేట లో శుక్రవారం 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు :--
పట్టణం లో కరోనా పంజా
పట్టణంలో కరోనా ఉదృతి రోజు రోజుకి పెరిగిపోతుంది . తాజాగా 8 కేసులు నమోదు అయ్యాయి .
ఎన్టీఆర్ కాలనీలో 1 కేసు , గుండయ్య తోటలో 1, సుభాని నగర్ లో 1 కేసు, పద్మశాలి పేటలో 1 కేసు కృష్ణారెడ్డి నగర్ లో 1 కేసు గుర్రాలచావిడీ ఉర్దూ స్కూల్ బజార్ లో 1 కేసు , మరో 2 కేసులు చొప్పున మొత్తంగా 8 కేసులు నమోదు అయ్యాయి . కావున పట్టణ ప్రజలు బయటకి వచ్చినపుడు జాగ్రత్తలు పాటించాలి
గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక ( స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ గారు )
శ్యామ్యూల్ ఆనంద్ |
గుంటూరు జిల్లా లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు " శనివారం నుండి జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉంచాలి అని " హెచ్చరించారు . 11 గంటల తరవాత ఎవరైనా వ్యాపారాలు కొనసాగితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికీ ఆదేశాలు జారీ చేసారు . ఇప్పటికే పిడుగురాళ్ల , నరసరావుపేట పట్టణాలలో ఫుల్ లొక్డౌన్ అమలులో వుంది .
చిలకలూరిపేట లో వైరల్ ఫీవర్ ఆందోళనలో పట్టణ ప్రజలు (కరోనా ఫీవర లేక వైరల్ ఫీవర )
చిలకలూరిపేట పట్టణ ప్రజలకి వర్షాకాలం కనుక సీజనల్ వ్యాధుల్లో ( జ్వరం , దగ్గు ) లేక కరోనా లక్ఖణలో అర్థం కాక ప్రజలు భయానికి గురి అవుతున్నారు . ప్రతి రోజు నీటిని కాచి వడకట్టి తాగటం వాళ్ళ కొన్ని రకాల వ్యాధుల బారి పడకుండా ఉండవచ్చు మరియు మన పరిసరాల్ని శుభ్రంగా వుంచుకుందాం .
చిలకలూరిపేట మర్రి శేఖర్ గారికి గవర్నర్ కోటాలో MLC పదవి
గడిచిన ఎలెక్షన్ లో రాజశేఖర్ గారికి కాకుండా రజని గారికి MLA టికెట్ కన్ఫర్మ్ అయిన తరువాత చిలకలూరిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట ప్రజల సమక్షంలో ఆనాడు YS జగన్ మోహన రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారిని మంత్రి ని చేస్తా అని హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండు MLC స్థానాలు కాళిగా ఉండటం వలన ఆనాడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు గవర్నర్ కోటాలో రాజశేఖర్ గారికి MLC పదవిని ఖరారు అయినట్టు సమాచారం . ఇదే కనుక కన్ఫర్మ్ అయితే రాజశేఖర్ గారి అభిమానులకి వారి అనుచరులకు చిలకలూరిపేట పట్టణ ప్రజలకి ఆనందదాయక విషయం . మర్రిరాజశేఖర్ గారికి గతం లో YCP పార్టీ ఆవిర్భావం నుండి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి గారి వెనకాలే వుంటూ జిల్లా లో పార్టీ గెలుపుకి కృషిచేశారు . గతం లో గుంటూరు జిల్లా కన్వీనర్ గ పనిచేసేసారు
యడ్లపాడు మండలంలో కరొనతో మహిళ మృతి
యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చందిన ఒక వృద్దురాలు కొన్ని రోజులగా అనారోగ్యం తో బాధపడుతున్నది . అయితే ఆమెను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స్ పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందినది . చనిపోయిన తరువాత ఆమెకు కోవిద్ 19 టెస్ట్ చెయ్యగా ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయినది .
చిలకలూరిపేట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఉద్యోగికి పాజిటివ్
చిలకలూరిపేట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ అయిన్ది:---
పట్టణంలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసుస్టేషన్ నందు పని చేయుచున్న కాన్స్టేబుల్ (52) కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినది . . నరసరావుపేట నుండి రోజు చిలకలూరిపేట కి వచ్చి విధులు నిర్వహిస్తూ వుంటారు . కాన్స్టేబుల్ గత వారం రోజులగా అనారోగ్యం తో బాధపడుతున్నాడు . నరసరావుపేట లోని ప్రభుత్వ హాస్పిటల్ నందు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గ నిర్ధారణ అయినది . అయితే సదరు వ్యక్తి గత వరం రోజులగా విధులకు హాజరుకావటం లేదు . ప్రస్తుతానికి ఎక్సైజ్ శాఖ లో ఎనిమిది మంది వీధులు నిర్వహిస్తున్నారు వారు అందరు టెస్ట్ కి సిద్ధం అయ్యారు
చిలకలూరిపేట లో ఏ రోజు పెద్ద మొత్తం లో కరోనా కేసులు నమోదు అయ్యాయి
చిలకలూరిపేట టౌన్ లో ఈ రోజు రెండవ వర్డు కి చెందిన వర్డ్ వాలంటరీగా పని చేస్తున్న ఒక మహిళకి , కళామందిర్ థియటర్ వెనుక బొబ్బిళ్ళ సత్యనారాయన వీధి లోని యువకునికి , వడ్డరకాలని లో ఒక యువకునికి , పండరీపురం లోని ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్టు అధికారులు ప్రకటిన్చారు
చిలకలూరిపేట లో కరోనా అలెర్ట్
మాస్క్ తప్పనిసరి
మాస్క్ తప్పనిసరి
చిలకలూరిపేట లో కరోనా అలెర్ట్ :----
చిలకలూరిపేట లో కరోనా బాధితుల సంక్య రోజు రోజు కి గణనీయంగ పెరిగిపోతుంది , పట్నంలో ప్రజలు మీ యొక్క ఇళ్ల పరిసరాల్ని శుభ్రం గ వుంచుకుందాం , వర్షకాలం కాబట్టి మీ యొక్క ఇళ్ల పరిసరాలలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోండి\, కరోనా ఎక్కడోలేదు మన ఊరుని తాకింది కాబట్టి సుబ్రతా తప్పనిసరి . బ్యాంకుల వద్ద మరియు కూరగాయల మార్కెట్ వద్ద , చికెన్ షాప్ ల వద్ద నరసరావుపేట సెంటర్ ట్రాఫిక్ వద్ద చలివేంద్రం బజార్ వద్ద మెయిన్ రోడ్ వద్ద జనసంచారం ఎక్కువగా వున్నా చోట మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి . మాస్క్ పెట్టుకొని వాళ్ళకి 500 రూపాయల జరిమానా విధిస్తున్నారు