విజయసాయిరెడ్డిని గుంటూరుకు చెవిరెడ్డిని ఒంగోలుకు - వైసిపి కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ :- రాబోవు ఎన్నికలకు అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాలు మరియు అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్సిపి విజయకేతనం ఎగరేయడం కోసం విజయ్ సాయి రెడ్డిని మరియు ఒంగోలు పార్లమెంటు స్థానం మరియు కావలి, కందుకూరు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఇప్పటికే నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఎంపీ పదవి రాజీనామా చేయడంతో, నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దించారు. అలాగే గుంటూరు పార్లమెంటు స్థానాన్ని మరియు అసెంబ్లీ స్థానాల్లో ఎలా అయినా వైసీపీ కైవసం చేసుకోవాలని ఆ బాధ్యతలను విజయసాయి రెడ్డికి అప్పగించింది. ఒకప్పుడు ఒంగోలు ప్రాంతాలలో బాలినేని శ్రీనివాసరావు లేదా వైవి సుబ్బారెడ్డి, మాగుంట శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చేవారు. అలాంటిది ఈసారి వారందరినీ పక్కనపెట్టి చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.