చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు.
గత మూడు నెలలుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యునియన్(AITUC) నాయకులు మాట్లాడుతూ మూడు నెలలుగా మున్సిపల్ అధికారులు తమకు జీతాలు ఇవ్వకపోవడం వలన కుటుంబ పోషణ భారంగా మారిందని, అద్దె ఇళ్లల్లో ఉంటున్న తమను ఇంటి ఓనర్లు ఖాళీ చేయించడం జరుగుతుందని తెలిపారు.
గత కొద్ది కాలంగా పాడైపోయిన పారిశుధ్య పనిముట్లను వెంటనే బాగు చేయాలని, క్రొత్త పారిశుద్ధ్య పనిముట్లను కొని ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.
సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారికి అందజేయడం జరిగినది.
రెండు రోజులలో చిలకలూరిపేట మున్సిపల్ అధికారులు పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతామని తెలిపారు.
క్రింది లింక్ పై క్లిక్ చేయండి