ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF
చిలకలూరిపేట :- త్వరలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షల సమయం రానున్నటంతో చిలకలూరిపేట లోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంవత్సరకాలం మొత్తం కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఆర్థిక స్తోమత వలన ఫీజులు కట్టకపోతే వారికి హాల్ టికెట్లు నిలిపివేయకుండా విద్యార్థులకు అందించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆర్థికపరమైన చిక్కుల వలన వెనక్కి వెళ్ళకూడదు అని, అలాగే ప్రభుత్వం తల్లి ఖాతాలో కాకుండా విద్యార్థుల పాఠశాలల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చట్టం తీసుకురావాలని దీని ద్వారా విద్యార్థులు చదువుకి ఆటంకం కలగకుండా విద్యా దీవెన సక్రమంగా స్కూళ్లకు మరియు కాలేజీలకు చేరుతుందని వారు కోరారు. ఇలా చేయడం వలన హాల్ టికెట్లు, విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకునే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉంటారని వారు తెలిపారు. విద్యార్థులకు కాలేజీలలో, స్కూల్లలో హాల్ టికెట్లు పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మేకపోతుల నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సాయి నాయక్, బొంత భగత్ సింగ్, సహాయ కార్యదర్శి పృద్వి, త్రిపురం సురేంద్ర మరియు మండాది ఫణి పాల్గొన్నారు.
వేగంగా వార్తలను పొందటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి