చిలకలూరిపేటలో అర్ధరాత్రి దొంగల బీభత్సం
చిలకలూరిపేట టౌన్ :- పట్టణంలోని సుభాని నగర్ లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని సుభాని నగర్ నందు లహరి పిల్లల హాస్పిటల్ రోడ్డులోని జండా చెట్టు ఎదురుగా ఉన్న పటాన్ సుభాని అనే వ్యక్తి ఇంట్లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. పఠాన్ సుభాని మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం విజయనగరంలోని ఉరుసు కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఇది అదునుగా భావించిన దొంగలు అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి 25 వేల రూపాయలు నగదు, బంగారు దుద్ధులు, వెండి పట్టీలు దొంగిలించి పారిపోయారు. తెల్లవారుజామున తలుపులు తెరిచి ఉండటానికి గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో సామాన్లు అన్ని కింద పడేసి ఉండటానికి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలను వేగంగా పొందడం కోసం కింది ఉన్న లింకు పై క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.
No comments:
Post a Comment