చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి
చిలకలూరిపేట:- మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ కనెక్షన్ కోసం చిలకలూరిపేట రూలర్ ఏపీ సీపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సదరు 55,000 లంచం అడగగా బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. వెంటనే రంగంలోకి దిగిన ACB అధికారులు లంచం తీసుకుంటుండగా ప్రకాష్ రావు నాయక్ ను పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్ మత్తె, డీఎస్పీ సత్యానంద్ రైడ్ లో పాల్గొన్నారు. లంచాలకు పాడుపడుతున్న అధికారుల సమాచారాన్ని తమతో పంచుకోవాలని వారు తెలిపారు.
మరిన్ని వార్తలు వేగంగా పొందడం కోసం కింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి వాట్స్అప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.
No comments:
Post a Comment