చిలకలూరిపేట - మంచినీటి కోసం అని మోటార్ స్విచ్ వెయ్యబోయి కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
చిలకలూరిపేట - పసుమర్రు గ్రామంలో ఇంట్లో మంచి నీటి కోసం అని మోటర్ స్విచ్ ఆన్ చెయ్యబోయి కరెంటు షాక్ తో వ్యక్తి మృతి చెందారు. వివరాలలోకి వెళ్తే పసుమర్రు గ్రామంలోని తన్నీరు కొండలరావు (56) బుధవారం నాడు మంచి నేటి కోసం అని మోటర్ స్విచ్ వెయ్యటానికి వెళ్ళాడు. అదే సమయంలో మోటార్ కి సంబంధించిన హై వోల్టాజి వైర్లు తగిలి అక్కడికి అక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి వచ్చి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. దీనితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్యతో పాటుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు.