చిలకలూరిపేట - రోటరీ క్లబ్ అఫ్ పండరీపురమ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు
చిలకలూరిపేట - రోటరీ క్లబ్ అఫ్ పండరీపురమ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు
చిలకలూరిపేటలో ప్రముఖ స్వచ్చంధ సంస్థ అయిన రోటరీ క్లబ్ అఫ్ పండరీపురం వారి ఆధ్వర్యంలో 1.6 లక్షల విలువైన 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి తెచ్చారు. అత్యవసరంగా పట్టణంలోని ఎవరికీ అయినా ఆక్సిజన్ అంధక ఇబ్బందికి గురి అయితే తమను సంప్రదించాలి అని తెలిపారు. కాన్సన్ట్రేటర్లు కావలసినవారు క్లబ్ సభ్యులు రాఘవయ్యని సంప్రదించాలి అని తెలియజేసారు.
మునిసిపల్ కమిష్నర్ డి. రవీంద్ర గారి ముఖ్య అతిధిగా హాజరై కాన్సన్ట్రేటర్లును ప్రారంభించారు. పట్టణంలోని పేదవారికి ఉపయోగపడే విధంగా కాన్సన్ట్రేటర్లు అందించటం పట్ల పురపాలకసంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో దాతల సహకారం హర్షణీయం అని అన్నారు. ఈ సందర్భంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి
చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి
చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు తక్కువగానే ఉన్న కానీ రోజులు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మాకినేని శారదా గారు ( 62) కరొనతో మృతి చెందారు. గత కొంత కాలంగా కరొనతో బాధపడుతున్న ఆమె గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆమె మృతి తో గ్రామంలోని ప్రజలు దీక్బ్రాంతికి గురి అయ్యారు.
చిలకలూరిపేట నియోజవర్గంలో నాటుసారాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
చిలకలూరిపేట నియోజవర్గంలో నాటుసారాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామము నందు నాటుసారాయి అమ్మే వారిని అదుపులోకి తీసుకున్నారు. చిరుమామిళ్ల గ్రామంలో చాపక్రింద నీరులాగా సారాయి అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో నాదెండ్ల SI సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో ఇద్దరికి అరెస్ట్ చేసారు. వీరు గ్రామంలో ఇళ్లలో నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు సమాచారం. రమేష్, బ్రహ్మం గా గుర్తించి వారి వద్ద నుండి 12 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు.
చిలకలూరిపేట పట్టణం & నియోజకవర్గం పరిధిలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో రేపు 04/06/2021 శుక్రువారం నాడు ఎన్నెన్ని టీకాలు కేటాయించారు అంటే !
CHILAKALURI PET SPEED NEWSThursday, June 03, 2021కరోనా న్యూస్, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట పట్టణం & నియోజకవర్గం పరిధిలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో రేపు 04/06/2021 శుక్రువారం నాడు ఎన్నెన్ని టీకాలు కేటాయించారు అంటే !
చిలకలూరిపేట పట్టణంలో
గవర్నమెంట్ హాస్పిటల్ నందు - 300
సుబ్బయ్యాతోట మునిసిపల్ డిస్పెన్సరీ - 200
రజక కాలనీ ఆరోగ్యకేంద్రం నందు - 300
పురుషోత్తమపట్నం నందు - 200 టీకాలను కేటాయించారు.
నియోజకవర్గ పరిధిలో
యడ్లపాడు పి.హెచ్.సి - 500
నాదెండ్ల - 400
గణపవరం - 500 టీకాలు వేస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ గారు తెలిపారు.
చిలకలూరిపేట - మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిన వ్యక్తి - పరిస్థితి విషమం
చిలకలూరిపేట - మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిన వ్యక్తి - పరిస్థితి విషమం
చిలకలూరిపేట - నరసరావుపేట రోడ్డు నందు లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద బైక్ పైనుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని సాంబశివనగర్ కి చెందిన శామంతపూడి వెంకటరమణ అనే వ్యక్తి కావూరు గ్రామం నందు బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. మద్యం తాగి బైక్ పైనుండి పడి ఉండవచ్చు అని తెలుస్తుది. అయితే సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వటంతో గుంటూరు GGH కి తరలించాలి అని తెలిపారు.
03-06-2021 - చిలకలూరిపేట మండలం, యడ్లపాడు మండలాలలో నమోదు అయిన కేసుల వివరాలు
03-06-2021 - చిలకలూరిపేట మండలం, యడ్లపాడు మండలాలలో నమోదు అయిన కేసుల వివరాలు
చిలకలూరిపేట మండలంలో గురువారం నాడు 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
కుక్కపల్లి వారి పాలెం - 1
కావూరు - 6
లింగంగుంట్ల - 2
పోతవరం - 4 గా నమోదు అయ్యాయి
అలాగే యడ్లపాడు మండలంలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
లింగారావు పాలెం - 1
బోయపాలెం - 1
తిమ్మాపురం - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట - కరోనా కేసుల వివరాలు - 03/06/2021 గురువారం
చిలకలూరిపేట - కరోనా కేసుల వివరాలు - 03/06/2021 గురువారం
చిలకలూరిపేట పట్టణంలో 03-06-2021 న 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
వైయస్సార్ కాలనీ - 1
సుధ వారిపాలెం - 2
క్రీస్తు కాలనీ - 1
మద్ది నగర్ - 1
దాసరి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి.
గుంటూరు జిల్లాలో విదేశాలకు విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్
గుంటూరు జిల్లాలో విదేశాలకు విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్
గుంటూరు జిల్లాలో విదేశీ విద్యకు, ఉద్యోగానికి వెళ్లే వారికి వ్యాక్సిన్ వెయ్యాలి అని అధికారులకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. 18-44 మధ్య వయస్సు వారికీ ఈ వ్యాక్సిన్ సౌకర్యాన్ని కలిపిస్తునట్లు తెలిపారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునే వారు తప్పనిసరిగా సంబంధిత డాక్యూమెంట్లను తీసుకురావాలి అని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునే వారు తమకు ఫలానా బ్రాండ్ వ్యాక్సిన్ కావాలి అనే సౌలభ్యం లేదు అని స్ఫష్టం చేసారు.