చిలకలూరిపేట - మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిన వ్యక్తి - పరిస్థితి విషమం
చిలకలూరిపేట - నరసరావుపేట రోడ్డు నందు లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద బైక్ పైనుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని సాంబశివనగర్ కి చెందిన శామంతపూడి వెంకటరమణ అనే వ్యక్తి కావూరు గ్రామం నందు బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. మద్యం తాగి బైక్ పైనుండి పడి ఉండవచ్చు అని తెలుస్తుది. అయితే సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వటంతో గుంటూరు GGH కి తరలించాలి అని తెలిపారు.
No comments:
Post a Comment