24/11/2021 to 28/11/2021 వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్
గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారి ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా 24/11/2021 నుండి 28/11/2021 వరకు భారీ వర్షం సూచికల వలన ప్రజలందరూ అప్రమత్తమై బయటికి రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని... లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమై చిన్నపిల్లలను నీటి ప్రవాహానికి దూరంగా ఉంచుతూ .. వాగులు వంకలు ప్రవహించే ప్రాంతాలలో జాగ్రత్తలు వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు.