46.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ - ముఖ్యాంశాలు
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్ ఉంటుందని ఆమె తెలిపారు. బడ్జెట్ 46.6 లక్షల కోట్లు ఉండగా ఆదాయం 30.80 కోట్లు గా ఆమె తెలిపారు.
* ప్రభుత్వం మరింత సమగ్రమైన GDP (పాలన, అభివృద్ధి, పనితీరు)పై దృష్టి పెట్టింది.
* ప్రభుత్వం 10 ఏళ్లలో 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది.
* పంటల బీమా పథకం ప్రయోజనాలు 40 మిలియన్ల మంది రైతులకు చేరుతాయి.
* ద్రవ్యోల్బణం తగ్గింది, ఆర్థిక వృద్ధి పుంజుకుంది.
* పన్ను సంస్కరణలు పన్ను స్థావరాన్ని విస్తృతం చేశాయని, పన్ను వసూళ్లను పెంచాయని అన్నారు.
* వచ్చే ఐదేళ్లలో భారత్లో అపూర్వమైన ఆర్థిక వృద్ధి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
* 2047 నాటికి దేశాన్ని 'విక్షిత్' (అభివృద్ధి) చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆమె చెప్పారు.
* రక్షణ ప్రయోజనాల కోసం డీప్ టెక్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.
* అర్హులైన మధ్యతరగతి వర్గాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడించారు.
* స్వయం సహాయక సంఘాల విజయం వల్ల 1 కోటి మంది మహిళలు "లక్షపతి దీదీ'లుగా మారేందుకు సాధికారత.
* ప్రత్యక్ష, పరోక్ష పన్నులలో ఎలాంటి మార్పులు లేవు.
* స్టార్టప్లకు పన్ను ప్రయోజనాలు, సార్వభౌమ సంపద ద్వారా చేసే పెట్టుబడులు, పెన్షన్ ఫండ్లు మార్చి 2025 వరకు పొడిగించబడతాయి.
* పరిశోధన, సృజనాత్మకకు లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం.
* మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం.
* 40వేల నార్మల్ బోగీలను వందేభారత్ ప్రమాణాలకు పెంచుతాం.
* యువతకు ముద్ర యోజన ద్వారా రూ.25 లక్షల కోట్ల రుణాలిచ్చాం.
* 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందించాం.
* లక్ష కోట్లతో ప్రైవేట్ సెక్టార్కి కార్పస్ ఫండ్.
* టూరిస్ట్ హబ్గా లక్షద్వీప్.
* 517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు.
* 3 మేజర్ రైల్వే కారిడార్లు నిర్మాణం చేస్తున్నాం.
* వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం.
* 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
* ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి.
* దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు.
* రూఫ్టాప్ సోలార్ పాలసీతో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్.
* 80 కోట్ల మందికి ఫ్రీరేషన్తో ఆహార సమస్య తీర్చాం.
* మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం.
* వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యం.
* ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది.
* GDP అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్.
* మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు ఇచ్చాం.
* 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు.
* 15 ఎయిమ్స్లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం.
* స్టార్టప్ ఇండియా, స్టార్టప్ క్రెడిట్ గ్యారంటీతో యువతకు ఉద్యోగాలు.
* 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిలు 28 శాతం పెరిగారు.
* 11.8 కోట్ల మంది అన్నదాతలకు ఆర్థిక సాయం.
* 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం.
* జన్ధన్ ఖాతాలతో పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం.
* స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు.
* లక్ పతీ దీదీ టార్గెట్ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపు.
* 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తాం.
* నానో యూరియా తర్వాత పంటలకు నానో DAP కింద ఎరువులు అందిస్తాం.
* అంగన్వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్ భారత్ కవరేజ్.
* దేశంలో పర్యాటక రంగంలో ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగంలో తెలిపారు.
మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
https://chilakaluripetspeednews.blogspot.com/?m=1