చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మైనార్టీ, ప్రధాన కార్యదర్శిగా ఎస్సీని నియమిస్తూనట్లు ప్రకటించిన ప్రత్తిపాటి
చిలకలూరిపేట :- ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ తమ స్ట్రాటజీలను అమలు చేయడంలో స్పీడును పెంచాయి. ఇప్పటికే అధికార వైసిపి మున్సిపల్ చైర్మన్ గా మైనారిటీ వ్యక్తిని, రెండుసార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి ఎస్సీలను నియమించింది. అయితే తాజాగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పార్టీ ప్రధాన అధ్యక్షుడిగా పఠాన్ సమద్ ఖాన్( మైనారిటీ) మరియు పట్టణ ప్రధాన కార్యదర్శిగా మద్దుమాల రవిని( SC) నియమిస్తున్నట్లు ప్రతిపాటి పుల్లారావు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ జెండా విజయకేతనం ఎగరవేయాలని అభిమానులకు దిశా నిర్దేశం చేశారు.
మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
No comments:
Post a Comment