చిలకలూరిపేటలో 1858 మందికి వ్యాక్సిన్ రెండవ డోసు వెయ్యాలి, ఈ రెండు రోజులు వారికీ మాత్రమే వ్యాక్సినేషన్ అన్నారు. రెండవ డోసు సమయానికి వెయ్యకపోతే వృధా అవుతుంది కాబట్టి వారికీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది అంతా బాగుంది. కానీ ఇప్పటి వరకు గవెర్నమెంట్ ప్రజా వైద్యశాలలలో 1858 మంది మొదటి డోసు వేపించుకున్నారు. వారి వివరాలు సిద్ధం చేసి రెండవ డోసు రెడీ అవుతున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటలలో మొదటి డోసు వ్యాక్సిన్ వేపించుకున్న వారి పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు. ఇప్పటికే పట్టంలో కోవిడ్ ఆసుపత్రులకు అనుమతి పొందిన వాటిలలో చాలా మంది మొదటి డోసు తీసుకున్నారు. అయితే ప్రజా వైద్యశాలలో మాత్రమే మొదటి డోసు తీసుకున్న వారికీ మాత్రమే రెండవ డోసు వేస్తున్నారు. మేము కూడా వ్యాక్సిన్ తీసుకొని 4 వారలు అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ దగిరకు వెళ్లి సెకండ్ డోసు అని అడిగేతే ప్రభుత్వం మాకు వ్యాక్సిన్ ఇవ్వటం లేదు అని సమాధానం వస్తుంది. సెకండ్ డోసు లేట్ అయితే మళ్లీ మొదటి డోసు తీసుకోవలసి వస్తుంది అని మా పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వీరి పైన కూడా ద్రుష్టి పెట్టి రెండవ డోసు కి అవకాశం కలిపించాలి అని కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment