గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో 97,72,000 లక్షల విలువైన గుట్కా,ఖైనీ వంటి మత్తు పదార్ధాలు సీజ్ చేసాము - జిల్లా రురల్ SP విశాల్ గున్ని
గుంటూరు రురల్ SP విశాల్ గున్ని ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో మొత్తం 97,72,000 సరుకుని సీజ్ చేసారు. స్పెషల్ టీమ్ గా ఏర్పడి జిల్లాలోని చిలకలూరిపేట,తెనాలి, వినుకొండ, శావల్యాపురం, నరసరావుపేట పరిధిలోని పట్టణ, గ్రామా ప్రాంతాలలో ముమ్మరంగా సోదాలు చేసారు అని తెలిపారు. రాష్ట్రంలోని బహుశా ఇదే అతి పెద్ద ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు.
* చిలకలూరిపేట పట్టణంలో 40 బస్తాల గుట్కా, ఖైనీ, నకిలీ సిగిరెట్లు, 1 కేజీ గంజాయి సీజ్ చేసారు. వాటి విలువ సుమారు 63,20,000 గా ఉండవచ్చు.
* నరసరావుపేట రురల్ పరిధిలో 54,128 ప్యాకెట్లు గుట్కాలను, ఇతర మత్తు పదార్ధాలను సీజ్ చేసారు, వాటి విలువ సుమారు 6,30,000 గా ఉండవచ్చు.
* వినుకొండ పట్టణంలో 226 బస్తాల ఖైనీ, గుట్కాలను, పొగాకు పదార్ధాలను సీజ్ చేసారు. వాటి విలువ సుమారు 11,20,000 గా ఉండవచ్చు.
* తెనాలి పట్టణ పరిధిలో 40 బస్తాల గుట్కాలను, ఇతర మత్తు పదార్ధాలను సీజ్ చేసారు, వాటి విలువ సుమారు 11,00,000 గా ఉండవచ్చు.
* శావల్యాపురం పట్టాన పరిధిలో 18 బస్తాల నిషేధిత పొగాకు సీజ్ చేసారు. వాటి విలువ 6,00,000 గా ఉండవచ్చు.
ఈ అక్రమ నిషేధిత మత్తు పదార్ధాలను బెంగుళూరు నుండి తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి కర్ణాటక మరియు వేరే రాష్ట్రాలకి పంపించి ఈ అక్రమ దందా కి చెక్ పెట్టాలి అని చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న SI లు,సీఐ ,DSP లకు ప్రత్యేకంగా శుభాకాంషలు తెలిపారు.
ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిస్తే వెంటనే జిల్లా హెల్ప్ లైన్ నెంబర్ 8866268899 నంబర్లకు కాల్ చెయ్యండి అని తెలిపారు.
ముఖ్యంగా ఇలాంటి సమయాలలో పోలీసువారికి సహకరిస్తున్న మీడియా వారికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.