అక్రమ మద్యం,గుట్కా వ్యాపారం,పేకాట శిబిరాలు,రేషన్ మాఫియా,కేబుల్ మాఫియా,దొంగ బంగారం,ఇసుక మాఫియా లకు చిలకలూరిపేట అడ్డాగా మారింది - టీడీపీ నేతలు
చిలకలూరిపేట టీడీపీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణంలో జరుగుతున్న అక్రమాల గురించి చర్చించారు టీడీపీ నేతలు. అధికారం అడ్డం పెట్టుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చిలకలూరిపేట అక్రమాలకు అడ్డాగా మారిపోయింది అని తెలిపారు. గత లాక్ డౌన్ లో అక్రమ మద్యం వలన అరెస్ట్ చేసిన ఎక్ససైజ్ అధికారులకు అధికార పార్టీ నేతల నుండి కేసులు లేకుండా చూడాలి అని వత్తిడి తీసుకు వచ్చారు అని గుర్తు చేసారు. ఆయా అధికారిని బదిలీ చేసారు అని,ఓగెరు వాగులోని అక్రమ ఇసుక మాఫియా చాపక్రింద నీరులా సాగిపోతుంది అని. ఇక అక్రమ మద్యం, గుట్కా వ్యాపారాలు అయితే రేచిపోయి చెలరేగుతున్నారని, ఒక్కొక్కరి దగిర సుమారు 50 నుండి కోటి రూపాయ సరుకు దొరుకుతుంది అంటే చిలకలూరిపేట కేంద్రంగా రాష్ర వ్యాప్తంగా ఈ అక్రమ దందా జరుగుతుంది అని, పేకాట శిబిరాలు అయితే అచంగా అధికార పార్టీ నేతలే దగిర ఉండి నడిపిస్తున్నారు అని, రేషన్ మాఫియా కి అంతే లేదని రేషన్ డీలర్ల నుండి అక్రమ రేషన్ అమ్మే వారి వరకు అందరూ అధికార పార్టీ నేతలే అవటం విశేషం. దొంగ బంగారం గుట్టు చప్పుడు కాకుండా ఎదేచ్చగా సాగిపోతుంది అని. గతంలో పని చేసిన రురల్ SI కి అక్రమ బంగారం చొరవ చూపటం వలన VR కి పంపించారు అని, కేబుల్ మాఫియా అంటే ప్రజలందరూ డబ్బులు చెల్లించి టీవీ ప్రసారాలు చూదాం అనుకుంటే లోకల్ ఛానల్లో అధికార పార్టీ భజన తప్ప ఇంకేమి ఉండదు అని దీనితో ప్రజలు విసిగిపోయి DTH లను ఏర్పాటు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి అని, పార్టీకి అండగా ఉన్న దళితుల భూములను లాక్కున్నారని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని కచ్చితంగా గుణపాఠం చెప్తారు అని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ నెల్లూరి సదాశివరావు, టీడీపీ సీనియర్ నాయకులూ, ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment