చిలకలూరిపేట - పలు రద్దీ సెంటర్లలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలపైనా వ్యూహాలు సిద్ధం చేసిన CI రాజేశ్వరావు
చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా CI బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరరావు. శనివారం సాయత్రం సమయంలో పట్టణంలోని పలు రద్దీ ప్రదేశాలు పర్యటించి ట్రాఫిక్ సమస్యల పైనా వ్యూహాలు సిద్ధం చేసారు. పట్టణంలోని ట్రాఫిక్ ప్రధాన సమస్యలలో ఒకటి ముఖ్యంగా మార్కెట్ సెంటర్,చలివేంద్రం బజార్ కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటున్న కారణంగా, అసలే కరోనా సమయంలో రద్దీ తగ్గించాలి అనే ఆలోచనతో CI రాజేశ్వరావుతో పాటుగా టౌన్ పోలీస్ సిబ్బంది పళ్ళు మార్కెట్ వ్యాపారులను పిలిచి వారితో చర్చించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఏర్పాట్లు చెయ్యాలి అని వారిని సూచించారు. తోపుడు బళ్లకు హద్దులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి అని తెలిపారు. అలాగే కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి అని తెలిపారు. కర్ఫ్యూ సమయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం అని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఆయన తెలిపారు.