విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్
చిలకలూరిపేట:- ఎయిడెడ్ స్కూల్స్ & కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు గాను అనంతపురంలో విద్యార్థులపై జరిగిన ఘటనలను నిరసిస్తూ చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మురారి మాట్లాడుతూ ఎయిడెడ్ కాలేజీ & స్కూల్స్ నందు పేద విద్యార్థులు మాత్రమే చదువుకుంటానని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 38, 42 జీవోలను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఎయిడెడ్ కాలేజీలను & స్కూళ్ల పై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో "విద్యార్థులతో చెలగాటమా ఖబడ్దార్ ఖబడ్దార్" అనే నినాదంతో విద్యార్థులు పట్టణంలోని వీధులన్నీ మోత మోగించారు.
VIDEO మీకోసం