రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి
పట్టణంలోని ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పర్వం మొదలైంది, నేడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేయగా రేపు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భారీ ర్యాలీతో నామినేషన్ వేనున్నారు. అందులో భాగంగా నేడు ప్రత్తిపాటి స్వగృహంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో మంచి-చెడుల మధ్య యుద్ధంలో కూటమిదే విజయమన్నారు మాజీమంత్రి, కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. మంగళవారం చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో విజయం సాధించాలని సంకల్పిస్తూ పట్టణంలోని తన నివాసంలో సోమవారం సుదర్శన నరసింహస్వామి హోమం వైభవంగా నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ క్రతువులో ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి వెంకటకుమారి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు హోమాలు, వైదిక కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిపించారు. నారసింహ, సుదర్శన యంత్రాలతో హోమం నిర్వహించారు. హోమ ద్రవ్యాలను యజ్ఞ గుండాల్లో సమర్పించి పూర్ణాహుతి జరిపించారు. చిలకలూరిపేటతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. పలువురు కుటుంబసభ్యులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి చెడు గెలిచిన సందర్భాలు చరిత్రలోనే కాదు పురాణేతిహాసాల్లో ఎక్కడ వెదికినా కనిపించవన్నారు. కూటమి తరపున ప్రజాబలానికి దైవ సంకల్పం కూడా తోడు కావాలనే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ప్రత్తిపాటి.
మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5
No comments:
Post a Comment