గుంటూరు YSRCPలో భగ్గుమన్న రాజకీయం - దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేసి గెలవాలి - మద్దాలి గిరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరపత్రాలు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి టిడిపి నుండి గెలిచి YSRCP కండువా తప్పుకున్న విషయం అందరికీ తెలిసినదే. గుంటూరు మేయర్ పదవి ప్రకటించే ముందు రెండున్నర సంవత్సరం కావటి మనోహర్ నాయుడు మరో రెండున్నర సంవత్సరం పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కేటాయిస్తున్నట్లు అప్పట్లో గుంటూరు YSRCP తెలిపింది. అయితే పాదర్తి రమేష్ గాంధీ గుండెపోటుతో మరణించడం తో ఆరో వార్డు జరగవలసిన ఉప ఎన్నికలకు టిడిపి నుండి వైసిపికి వచ్చిన మద్దాలి గిరి పెత్తనం చేస్తున్నారంటూ స్థానిక వైయస్సార్ సిపి కార్యకర్త గుజ్జుల రామకృష్ణారెడ్డి మద్దాలి గిరి విమర్శిస్తూ కరపత్రాలు ప్రచురించారు. ఆరవ వార్డు స్థానికులకు కాకుండా మద్దాల గిరి సొంత ఊరైన రెంటచింతల నుండి వ్యక్తిని తీసుకొనివచ్చి అభ్యర్థిగా ప్రకటించడం తో ఈ వివాదం చెలరేగింది. సదరు వ్యక్తి గుట్కా సప్లై చేస్తూ అక్రమంగా డబ్బులు డబ్బులు సంపాదిస్తారు అని, స్థానికులకు కాకుండా స్థానికేతరులను ఎలా అభ్యర్థి గా పర్యటిస్తారని అసహనం వ్యక్తం చేశారు. టిడిపి నుండి Ysrcp కండువా కప్పుకున్నారు అని, దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కోసం మద్దాలి గిరి నాలుగు కోట్లు డిమాండ్ చేశారని ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన గుండెపోటుతో మరణించారని ఆయన తెలిపారు. దీంతో ఒక్కసారిగా గుంటూరు నగర వైఎస్సార్సీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.