మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

గుంటూరు YSRCPలో భగ్గుమన్న రాజకీయం - దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేసి గెలవాలి - మద్దాలి గిరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరపత్రాలు

గుంటూరు YSRCPలో భగ్గుమన్న రాజకీయం - దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేసి గెలవాలి - మద్దాలి గిరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరపత్రాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి టిడిపి నుండి గెలిచి YSRCP కండువా తప్పుకున్న విషయం అందరికీ తెలిసినదే. గుంటూరు మేయర్ పదవి ప్రకటించే ముందు రెండున్నర సంవత్సరం కావటి మనోహర్ నాయుడు మరో రెండున్నర సంవత్సరం పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కేటాయిస్తున్నట్లు అప్పట్లో గుంటూరు YSRCP తెలిపింది. అయితే పాదర్తి రమేష్ గాంధీ గుండెపోటుతో మరణించడం తో ఆరో వార్డు జరగవలసిన ఉప ఎన్నికలకు టిడిపి నుండి వైసిపికి వచ్చిన మద్దాలి గిరి పెత్తనం చేస్తున్నారంటూ స్థానిక వైయస్సార్ సిపి కార్యకర్త గుజ్జుల రామకృష్ణారెడ్డి మద్దాలి గిరి విమర్శిస్తూ కరపత్రాలు ప్రచురించారు. ఆరవ వార్డు స్థానికులకు కాకుండా మద్దాల గిరి సొంత ఊరైన రెంటచింతల నుండి వ్యక్తిని తీసుకొనివచ్చి అభ్యర్థిగా ప్రకటించడం తో ఈ వివాదం చెలరేగింది. సదరు వ్యక్తి గుట్కా సప్లై చేస్తూ అక్రమంగా డబ్బులు డబ్బులు సంపాదిస్తారు అని, స్థానికులకు కాకుండా స్థానికేతరులను ఎలా అభ్యర్థి గా పర్యటిస్తారని అసహనం వ్యక్తం చేశారు. టిడిపి నుండి Ysrcp కండువా కప్పుకున్నారు అని, దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కోసం మద్దాలి గిరి నాలుగు కోట్లు డిమాండ్ చేశారని ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన గుండెపోటుతో మరణించారని ఆయన తెలిపారు. దీంతో ఒక్కసారిగా గుంటూరు నగర వైఎస్సార్సీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.




Share:

6 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ పైన ఆధారపడిన టీం ఇండియా సెమీస్ ఆశలు

6  ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ పైన ఆధారపడిన టీం ఇండియా సెమీస్ ఆశలు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో మొదటి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ తడబడింది. 17.4 ఓవర్లకు 10 వికెట్ల నష్టానికి 85 స్కోర్ చేసింది. తరువాత దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్ శర్మ 16 బంతులకు 30 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 18 బంతులకు 50 పరుగులు చేశాడు. చివరలో వచ్చిన  సూర్యకుమార్ యాదవ్ సిక్స్ బాది మ్యాచ్ ముగించారు. 6.3 ఓవర్లకు భారత్ మ్యాచ్ ఫినిష్ చేసింది. ఆదివారం జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, భారత్ & నమీబియా మధ్య జరగబోయే మ్యాచ్ భారత్ గెలిస్తే టీమిండియా సెమీస్కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇందులో ఏది తడబడినా టీమిండియా ఇంటి బాట పట్టాల్సిందే.



Share:

కదలిరండి అమరావతి రైతుల మద్దతుదారులారా - చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ

కదలిరండి అమరావతి రైతుల మద్దతుదారులారా - చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అమరావతి మాత్రమే రాజధాని కాదు అంటూ మొత్తం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో అమరావతిలో వేల ఎకరాల భూములు దానం చేసిన రైతులు ఖంగు తిన్నారు. నాటి నుండి మొదలుకొని ఇప్పటికీ దీక్షలు చేస్తున్న - రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోగా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీక్ష చేస్తున్నారంటూ రైతులు చేసే దీక్షను పక్కదోవ పట్టిస్తున్నారని, న్యాయపోరాటానికి "న్యాయస్థానం టు దేవస్థానం" అనే నినాదంతో అమరావతి రైతులు పాదయాత్ర  మొదలుపెట్టారు. అందులో భాగంగా రేపు అనగా 6/11/2021 శనివారం నాడు పెదనందిపాడు చేరుకోనున్నారు. రేపు ఉదయం మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీ గా పెదనందిపాడు తరలిరావాలని - నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మరియు అమరావతి రైతుల మద్దతుదారులు ఈ పాదయాత్రలో భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి - 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని రైతులు గళాన్ని వినిపించాలి అని చిలకలూరిపేట టిడిపి పిలుపునిచ్చింది. నియోజకవర్గం పరిధిలోని వార్డు, మండల, జిల్లాస్థాయి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు-

 ఇట్లు 

తెలుగుదేశం పార్టీ 

చిలకలూరిపేట నియోజకవర్గం.





Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.