6 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ పైన ఆధారపడిన టీం ఇండియా సెమీస్ ఆశలు
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో మొదటి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ తడబడింది. 17.4 ఓవర్లకు 10 వికెట్ల నష్టానికి 85 స్కోర్ చేసింది. తరువాత దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్ శర్మ 16 బంతులకు 30 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 18 బంతులకు 50 పరుగులు చేశాడు. చివరలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సిక్స్ బాది మ్యాచ్ ముగించారు. 6.3 ఓవర్లకు భారత్ మ్యాచ్ ఫినిష్ చేసింది. ఆదివారం జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, భారత్ & నమీబియా మధ్య జరగబోయే మ్యాచ్ భారత్ గెలిస్తే టీమిండియా సెమీస్కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇందులో ఏది తడబడినా టీమిండియా ఇంటి బాట పట్టాల్సిందే.
No comments:
Post a Comment