చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు
చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు
యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS
చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని
ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని
చిలకలూరిపేట మున్సిపల్ తొలి సమావేశంలో చాలా సమస్యలపైనా చర్చించారు. అలాగే రోడ్లు , నీటి సమస్యల పైనా చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షలుగా రఫాని గారు, ఎక్స్ అఫీషియా సభ్యురాలి హోదా లో MLA రజని గారు పాల్గొన్నారు. రఫాని గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కౌన్సిలర్ తమ వార్డు పైన పూర్తి అవగాహనా కలిగి ఉండాలి అని, వార్డు లో ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తెలుసుకురావాలి అని, పార్టీలకు అతీతంగా కలసి చిలకలూరిపేట పట్టణాన్ని అభివృద్ధి పధంలో తెలుసుకు వెళ్లాలి అని అన్నారు. ఇప్పటికే మానుకొండవారిపాలెం కి 75 లక్షలు , పసుమర్రు కి 2 కోట్లు, గణపవరంకి 5 కోట్లు తో పరిశుద్ధ,త్రాగునీరు సమస్యల పరిష్కారానికి అంచనా వేసి ప్రభుత్వానికి పంపటం జరిగింది అని చెప్పారు. పార్టీ ఏది అయినా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండాలి అని, చౌకబారు మాటలతో దిగజారుడు తనగా ఉండకూడదు అని, ప్రజలలో మంచి పేరు తెచ్చుకొని ముందుకు సాగాలి అని అన్నారు.
MLA రజని మాట్లాడుతూ వార్డు సమస్యలు ఏవైనా చైర్మెన్ గారికి లేదు అంటే తన దృష్టికి తెలుసుకురావాలి అని, ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు అని, ప్రజలు తమ సమస్యలని తీరుస్తారు అని మిమ్మల్ని ఎన్నుకున్నారు అని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని, పాత బకాయిగా ఉన్న 82 కోట్ల రూపాయలని సిఎం జగన్ గారితో మాట్లాడటం జరిగింది అని ఆ భారం మన మున్సిపాల్టీ పైన పడకుండా తగు చర్యలు తీసుకుంటాం అని, కౌన్సిలర్లలో చాలా వరకు కొత్త వారు కనుక ఒక రోజు సభ్యుల హక్కులు, విధులు, సమస్యలని ఎలా ప్రస్తావించాలి, అనే అంశాల పైనా శిక్షణ ఇస్తారు అన్నారు.
అలాగే సభ్యులు తమ తమ వార్డులలో సమస్యలను చైర్మెన్ దృష్టికి తీసుకువచ్చారు.
చిలకలూరిపేట 52 ఎకరాలలో 6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు
చిలకలూరిపేట 52 ఎకరాలలో 6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు
చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులూ , అభిమానుల మధ్య టీడీపీ పట్టాన అధ్యక్షులు పఠాన్ సమ్మద్ ఖాన్ పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులూ మాట్లాడుతూ 4000 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుగారికి మాత్రమే సాధ్యం అన్నారు. అలాగే 52 ఎకరాలలో ఎర్పాటు చేసిన 6500 ఇళ్ల నిర్మాణం 90% పూర్తి అయినా మిగిలిన 10 % నిర్మాణాలని పూర్తిచేయకుండా శిధిలా లుగా మిగిల్చిన ఘనత ఒక్క రజనికి మాత్రమే సాధ్యం అని అన్నారు . అలాగే పట్టణంలో త్రాగు నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ఎన్టీఆర్ సృజల పధకం ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు సదరు ప్లాంట్ సామాగ్రిని తూకం వెయ్యటానికి కూడా పనికిరాకుండా చేసారు అని అన్నారు. ప్రత్తిపాటి హయాం లో వచ్చిన కేంద్రీయ విశ్వ విద్యాలయం, గురుకుల పాఠశాల, మైనారిటీ విద్యార్థుల వసతి నివాసం, ఎస్సి సాంఘిక సంక్షేమ విద్యాలయం, పురపాలక సంఘం అనుమతు పొందిన రోడ్ల్ , డ్రైనేజీలు రాబోవు మూడు సంవత్సరాలలో పూర్తిచేసి MLA గా మీ కనీస ధర్మం పాటించాలి అని అన్నారు. ప్రత్తిపాటి ని విమర్శిస్తే మీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని అనుకుంటే అది మీ భ్రమే అని, ఇక MLA భర్త కుమారస్వామి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు తట్టుకోలేక ఏమి మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కావటం లేదు అని, మైనారిటీ వర్గానికి పురపాలక మున్సిపల్ ఛైర్మెన్ సీటు MLA రజని ఇవ్వలేదు అని , కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇవ్వవలసి వచ్చింది అని, 30 సీట్ల మెజారిటీ ఇచ్చిన పురప్రజలకి న్యాయం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యూత్ నాయకులూ, సీనియర్ నాయకులూ, అభిమానులు పాల్గొని ర్యాలీ గా నర్సరావుపేట సెంటర్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో MLA రజనిని , చైర్పర్సన్ రఫ్ఫాని ని సత్కరించిన TDP కౌన్సిలర్లు
చిలకలూరిపేటలో నేడు తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు
చిలకలూరిపేటలో నేడు తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు
చిలకలూరిపేట తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు అంశాల పైనా చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా పట్టణంలో మంచినీటి పైపుల లీకేజీలు , రోడ్ల మరమ్మతులు, పట్టణాన్ని పరిశుబ్రముగా ఉంచటం, పొట్టి శ్రీరాముల,YS రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాట్లు, మంచినీళ్ల పైపు లైన్ లేని వార్డులకు ఆయా పైపు లైన్ ఏర్పాటు. పలు అభివృద్ధి కార్యకర్మల పైనా చర్చలు. కాంట్రాక్టు టెండర్ల పైన చర్చలు జరిగే అవకాశం ఉంది
చిలకలూరిపేట మండలంలోని దండమూడిలో -- పేకాట రాయుళ్లు
చిలకలూరిపేట లో మంగళవారం సాయంత్రం భాస్కర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ - భారీగా పాల్గొన్న జనసైనికులు, మెగా అభిమానులు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్ళీ మోగుతున్న కరోనా డేంజర్ బెల్స్ - చాలా రోజుల తర్వాత 1000 ధాటిన కేసులు
చిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని
పట్టణంలో శనివారం సాయంత్రం వైస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీ గా తరలి వచ్చారు. MLA విడదల రజని చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సహం తీసుకువచ్చాయి. ఈ సందర్భంలో ఆమె మట్లాడుతూ "2024 లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లో జగన్ ఆశీసులతో BC మహిళగా చిలకలూరిపేట MLA అభ్యర్థి నేనే నిన్ను ఓడించేది కూడా నేనే" అని ప్రతిపక్ష నాయకులకి సవాళ్లు విసిరారు. ఒక SC వక్తి కి మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పదవి , ఒక మైనారిటీ వక్తికి మున్సిపల్ ఛైర్మెన్ పదవి ఒక జగన్ అన్న ప్రభుత్వం లోనే సాధ్యం అని ఆమె అన్నారు.
చిలకలూరిపేటలో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా సినీ నటుడు ఆలీ
చిలకలూరిపేటలో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా సినీ నటుడు ఆలీ
చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్ విజయోత్సవ సభకు సినీ నటుడు ఆలీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. గడిచిన మున్సిపల్ ఎన్నిలలలో పట్టణములో వైస్సార్సీపీ 38 వార్డులకి గాను 30 వార్డులతో విజయఢంకా మోగించింది. ఎప్పుడు లేని విధంగా 12 వార్డులలో ముస్లిం మైనారిటీలు గెలుపు గుర్రాలు అయ్యారు. అయితే సినీనటుడు ఆలీ రావటం ప్రాధాన్యత సంతరించుకున్నది. మధ్యాన్నం 3:30 నిమిషాకి ఎన్ ఆర్ టి సెంటర్ లోని వైస్సార్సీపీ కార్యాలయము నుండి భారీ బైక్ ర్యాలీ గా కళామందిర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆలీతో పాటు జిల్లా ఇంచార్జీ , గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, MLA ముస్తఫా, మద్దాలి గిరి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. చిలకలూరిపేట వైస్సార్సీపీ నాయకులూ కార్యకర్తలు భారీ గా తరలిరావాలి అని మున్సిపల్ చైర్మెన్ రఫాని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం
గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ తన యాక్షన్ ప్లాన్ మార్పుపైన కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ వాలంటరీ వ్యవస్థకు పోటీగా టీడీపీ సొంత టీమ్ను రెడీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి 50 కుటుంబాలకు ఒక కార్యకర్తను ఎంపికచేసి ఎలక్షన్ బాధ్యత అప్పగించాలి అని చూస్తుంది. ఇప్పటికే ఈ యాక్షన్ ప్లాన్కు చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలలో ఈ వ్యూహాన్ని అమలుపరచాలి అని అనుకుంటున్నట్లు సమాచారం.
చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన
చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన :-
చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం గురువారం మండలంలోని పోతవరం, బొప్పూడి గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు. ఆసుపత్రి ఎర్పాటు చెయ్యాలి అంటే 5 ఎకరాల భూమి అవసరం. అయితే పోతవరం గ్రామా పరిధిలోని త్రాగునీరు చెరువు సమీపం లో 275,276 సర్వ్ నంబర్లలో 15 ఎకరాలని పరిశీలించారు . అయితే ఆ భూమి ప్రజారోగ్య శాఖకు కేటాయించారు. ఆ భూమి లో నిర్మాణం చెయ్యాలి అంటే కేటాయించిన భూమిలో 5ఎకరాల భూమి కోసం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాల్సిఉంది . లేదా బొప్పూడి గ్రామా ప్రాంతంలో బొప్పూడి రాజాపేట మార్గంలో 513 సర్వే నెంబర్ కొంత పోరంబోకులో ఉన్న 29. 04 ఎకరాలను పరిశీలించారు. ఈ సందర్భంలో తసీల్ధార్ సుజాత, మండల సర్వేయర్ , ఆర్ఐ , విఆర్వోలు పాల్గొన్నారు.
AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్
AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్
ప్రస్తుత SEC గా వున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెల చివరకు ముగియనున్నది. అందువలన SEC గా ఎవరిని నియమిస్తారు అనే ప్రశ్న కు తెర దిన్చుతూ నీలం సాహ్ని గారి పేరు ఖరారు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు పేర్లను సిఫార్సు చెయ్యగా గవర్నర్ హరిచందన్ గారు నీలం సాహ్ని గా నియమిస్తూ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సీఎం జగన్ కి ముఖ్య సలహాదారుగా ఉన్న ఆమె ఆయా పదవికి రాజీనామా చేసి SEC గా బాధ్యతలు స్వకరించనున్నారు .
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్ :--
పట్టణంలో కళామందిర్ సెంటర్ నందు రేపు శనివారం జరగబోయే భారీ బహిరంగ సభ ఎర్పాట్లను పరిశీలించిన ఛైర్మెన్ రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, బూత్ కన్వీనర్ విడదల గోపిగారు, పట్టణ అధ్యక్షులు తలహఖాన్ గారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చెప్పాలి అని తెలిపారు.
చిలకలూరిపేటలో శారదా హైస్కూల్ నందు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్
చిలకలూరిపేట పట్టణంలో శనివారం మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని
చిలకలూరిపేట పట్టణంలో శనివారం మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని
చిలకలూరిపేట లో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైస్సార్సీపీ విజయఢంకా మోగించింది. మొత్తంగా 38 వార్డులకి గాను 30 వార్డులలో ఫ్యాన్ గాలి బాగా వీచింది అనే చెప్పాలి. ఆయా వియజానికి గుర్తుగా శనివారం నాడు పట్టణంలో ఒక భారీ ర్యాలీ ని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ లో పట్టణములోని వైస్సార్సీపీ అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చెయ్యవలసినదిగా కోరారు మున్సిపల్ చైర్మెన్ రఫాని గారు
చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు
చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???
చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???
26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది
దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు :--
చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
చిలకలూరిపేట పసుమర్రులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం కి చెందిన సూర్యనారాయణ (61) అనే వ్యక్తి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన పసుమర్రు వెళ్ళాడు. పసుమర్రు శివారుల్లో రహదారి పక్కనే ఉన్న సిమెంట్ బల్లపై గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ గా తెలుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వారు ప్రాధమిక నివేదికలో తేలిచ్చారు. మృతుడు కొంతకాలంగా చిలకలూరిపేట లో నివాసం ఉంటున్నాడు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు
చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు :--
చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు
చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి
చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు
చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు :--
చిలకలూరిపేటలోని బాలికకు గిన్నిస్ బుక్ లో చోటు. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని ఫజిలాతబస్సుమ్ అనే తొమ్మిది సంవత్సరాల బాలిక రికార్డు నెలకొల్పింది . బాలికకు పిరియాడికల్ టేబుల్ లోని (ఆవర్తన పట్టిక ) మూలకాలని 1.57 నిమిషాలలో అమర్చింది. గతంలో ఈ రికార్డును పాకిస్తాన్ కి చెందిన ఒక అమ్మాయి 2.27 గా ఉన్నా రికార్డను ఇప్పుడు మన ఫజిలా రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పటికే ఇండియా బుక్ అఫ్ రికార్డు లో చోటు దక్కించుకుంది. త్వరలో గిన్నిస్ బుక్ లో దక్కనుంది.
ఆవర్తన పట్టిక |
ఫజిలా, తండ్రి రహీమ్ స్థానిక వైస్సార్సీపీ కార్యాలయం నందు MLA రజని ని కలిసి మరోసారి తన ప్రతిభని చూపించింది. అయితే ఈసారి 1. 27 నిమిషాలలో అమర్చి తన ప్రతిభ చాటుకున్నది ఈ చిన్నారి. ఈ సందర్భంగా MLA రజని మాట్లాడుతూ బాలిక ప్రతిభను కొనియాడారు. అలాగే విద్యార్థి భవిషత్ కు అన్ని విధాలుగా సహకారం అందచేస్తాం అని అన్నారు.
గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు
గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు
బ్రిటిష్ వారి కాలంలో 1907 లో నిర్మించబడిన గుంటూరు జిల్లా రురల్ SP కార్యాలయం జగనన్న నాడు-నేడు అనే కార్యక్రమం తో అన్ని హంగులతో రీ మోడలింగ్ చేపించి ఈ రోజు పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MLA రజని,డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఇంచార్జి శ్రీ రంగనాథ్ రాజు గారు,సుచరితగారు, మోపి దేవి వెంకటరమణ గారు. కోన రఘుపతిగారు,నందిగం సురేష్ గారు,పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి గారు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి:--
జిల్లాలో కాళిగా ఉన్న 407 గ్రామ , వార్డు వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి తేదీ. ఆసక్తి కలవారు ఇక్కడ ఇచ్చిన లింకును క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు .
https://gswsvolunteer.apcfss.in/
పైన లింక్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోగలరు. 24న దరకాస్తు పరిశీలన. 25&26 తేదీలలో మండల పరిషత్ కార్యాలయాలలో ఇంటర్వూస్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఎంపిక అయిన వారికి సంచారం ఇస్తారు
రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి
చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం
చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--
చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--
చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఒకప్పుడు పట్టనములోని చౌత్ర సెంటర్కు , మదినగర్ వెళ్లే దారులలో ప్రజలు అటువైపుగా వెళ్ళాలి అంటే భయపడేవారు, పెద్ద పెద్ద గుంతలు ఆగుంట్టలు తపించుకోవటానికి చిన్నగా వెళ్తూ ట్రాఫిక్ జాంలో చిక్కుకునేవారు వాహనదారులు. రోడ్లు సరిగాలేక దుమ్ము ధూళితో పుర ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ కొన్ని రోజుల క్రితం మరమ్మతులు చేసిన రోడ్లు (నరసరావుపేట సెంటర్ నుండి చౌత్ర సెంటర్ మీదుగా కళామందిర్ సెంటర్ వైపు ) వలన పట్టణములో ట్రాఫిక్ కష్ఠాలు తగ్గాయి మరియు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత
చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత :--
చిలకలూరిపేట లో గంజాయి పట్టివేత. స్థానిక సమాచారం మేరకు చిలకలూరిపేట బొప్పూడి గుడి సమీపంలో నేషనల్ హైవే పైన ఒక వక్తి బైక్ పైన తరలిస్తున్న క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకి వచ్చిన సమాచారంతో ఆయా వ్యక్తిని పట్టుకున్నారు. అతడి నుండి సుమారు 20 kgల గంజాయి ని పట్టుకున్నారు. దాని విలువ సుమారు లక్షలలో ఉండవచ్చు. ఎక్కడనుండి ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపైన విచారణ మొదలుపెట్టారు.
చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--
చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--
చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ లో ఉన్న మహాలక్ష్మి e టికెట్స్ అనే మనీ ట్రాన్సఫర్ దుకాణంలో చోరీ జరిగినది. దుండగులు షట్టర్ తలుపులు పగులకొట్టి షాప్ లో ఉంచిన సుమారు నాలుగువేల రూపాయల నగదుని తీసుకొని పారిపోయారు. షాప్ యజమాని బాల మురళీకృష్ణ స్థానిక పోలీస్టేషన్ కి సమాచారం అందించారు. పోలీసులు వారు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.