చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు :--
నేటి యువత మత్తుకి బానిస అవకుండా ఉండటం కోసం పట్టణంలోని ప్రముఖ మోడరన్ డిగ్రీ కళాశాల నందు రురల్ CI సుబ్బారావు గారి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రురల్ SI రాంబాబు గారు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సుభాని గారు, కళాశాల ఉపాధ్యాయులు, పెద్ద ఎత్తున విధ్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలూ కావద్దు అని , వాటివల్ల కలిగే దుష్పరిణామాలు తెలియచేసారు. అయితే నిన్న పట్టుబడ్డ గంజాయి అమ్మే వ్యక్తి నుండి రాబట్టిన సమాచారం మేరకు విద్యార్థులు ఈ మత్తు పధార్ధాలకి దూరంగా ఉంచటం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించటం పట్ల CHILAKALURIPET SPEED NEWS తరుపున పోలీస్ వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
No comments:
Post a Comment