చిలకలూరిపేట నుండి పెదనందిపాడు వెళ్లే మార్గంలోని మానుకొండవారిపాలెం , దండమూడి జంక్షన్ వద్ద చిలకలూరిపేట వస్తున్నహోమ్ గార్డ్ నిరీక్షణరావు ని నందిపాడు వైపు గా వెళ్తున్న మహేంద్ర మినీ వ్యాను ఢీ కొని మరణించారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని ఎంవి నారాయణపురం లో నివాసం ఉంటున్న వేముల నిరీక్షణరావు (46) గతం లో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ నందు హోమ్ గార్డ్గా విధులు నిర్వహించారు. అయితే ప్రస్తుతానికి డిప్యుటేషన్ పైన గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ నందు పని చేసున్నారు. అయితే ఈస్టర్ పండుగ సందర్భంగా స్వగ్రామం అయిన గరికపాడు లోని పెద్దల సమాధులకు రంగులు వేపించటానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినది. ప్రమాద సమయములో నిరీక్షణరావు హెల్మెట్ పెట్టుకున్నారు. కానీ అది పగిలిపోవటం వలన తలకు బలమైన గాయం తో అక్కడికి అక్కడే చనిపోయారు. పట్టణ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుదేహాన్ని పట్టణ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తోటి హోమ్ గార్డులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి చేరుకున్నారు. ఉదయమే తమతో పాటుగా కరోనా వ్యాక్సిన్ వేపించుకున్నాడు ఇంతలో ఇలా జరగటం ధిక్బ్రాంతి లోనయ్యారు. మృతుడికి ఒక పాప,ఒక బాబు, వారి భార్య సన్నిధి గారు ఆర్టీసీ నందు కండక్టర్ గా పనిచేస్తున్నారు.
Home »
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి
చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి
చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి
No comments:
Post a Comment