చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం -
అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా చట్టల అమలు విషయంలో మీనమేషాలు లెక్కించడం వలన ఆనాటి నుంచి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి సూచన మేరకు భారతీయ జనతా యువమోర్చా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధర్నాలు సంతకాల సేకరణలు వంటి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఇప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన రెడ్డి గారు ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ఆదేశాలు ఇచ్చారు. ఇది భారతీయ జనతా యువమోర్చా విజయంగా భావిస్తూనే ఇప్పటికైనా అగ్రవర్ణ పేదలకు ఆశాజ్యోతిగా మారిన ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా యువమోర్చా నరసరావుపేట పార్లమెంటు శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రతుకు భారంగా భావిస్తున్న అగ్రవర్ణ పేదలకు భరోసానిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ చట్టం చేసి వారి జీవితాల్లో ఆనందం నింపిన మన ప్రధానమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అగ్రవర్ణ పేదల తరఫున ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ , పట్టణ అధ్యక్షులు నందిగామ రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీధర్,ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి వంకాయలపాటి సాయి, ఏబీవీపీ రాష్ట్ర సభ్యులు మురారి, ఏబీవీపీ పట్టణ నాయకులు లీలా కృష్ణ పలువురు పాల్గొన్నారు