చిలకలూరిపేట పట్టణ & పరిసర గ్రామ ప్రజలకు కరోనా భారిన పడిన వారికీ శుభవార్త
ఆయుష్ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో రిలీజ్ చేసిన మందు - ఆయుష్ -64
ఇప్పుడు మన చిలకలూరిపేట నందు ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయుష్ సంస్థ వారు చిలకలూరిపేట యందు మందు పంపిణీకి 6 సెంటర్లలో సిద్ధం చేసారు. అందులో పట్టణంలో 3 సెంటర్లు , నియోజకవర్గం గ్రామాలలో 3 సెంటర్లలో పంపిణి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. వాటి వివరాలు
1) భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం, సుబ్బయ్యతోట - 9885790079
2) ఎ బి.వి.పి మురారి , చౌత్ర సెంటర్, ఆంజనేయ స్వామి గుడి రోడ్ - 9121733191
3) వెల్లంపల్లి శ్రీరాములు ( రాము), పాత పోలీస్టేషన్ రోడ్ , వినాయక గుడి ప్రక్కన - 9848421251
4) అమృత వాటర్ ప్లాంట్, గణపవరం - 9494847172
5) వేగ్నేశ్న అంజిరాజు, యడ్లపాడు - 7799662347
6) భవనం శ్రీనివాసరెడ్డి, చిరుమామిళ్ల - 9989546954
పైన తెలుపబడిన సెంటర్ల నందు ఉచితంగా మందు ఇవ్వబడును. 18-60 సంవత్సరాల వయసు మధ్య వారికే ఈ మందు, అలాగే మెడిసిన్ కావలిసిన వారు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకు రావాలి. అల్లోపతి, హోమియోపతి వాడే వారు కూడా ఈ మెడిసిన్ వాడ వచ్చు. ఈ మందు వాడటం వలన కరోనా నుండి ప్రాణాలతో బయట పడవచ్చు.
అయితే గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు, క్యాన్సర్ , గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు , దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కలిగిన ఉన్న వారు అర్హులు కారు, అనర్హులు
గమనిక :- కరోనా వచ్చినవారి కుటుంబసభ్యులు, బంధువులు ఎవరినా వచ్చి ఈ మందు తీసుకువెళ్లొచ్చు. కరోనా రోగులకు అనుమతి లేదు. మాస్క్ పెట్టుకొని రావలెను.
భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ గుడిపల్లి భూషయ్య గారు దానికి సంబంధించి రిలీజ్ చేసిన పత్రాన్ని చూడండి.