చిలకలూరిపేట - మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నారా భువనేశ్వరి
చిలకలూరిపేట :- నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు గ్రామానికి చెందిన మొగిలి సత్యనారాయణ గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక మనస్థాపనతో గుండెపోటుతో మృతి చెందారు. నేడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన నారా భువనేశ్వరి వారికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయం గా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు, టిడిపి కౌన్సిలర్ సభ్యులు, మాజీ టిడిపి ఎంపీటీసీలు జడ్పీటీసీలు పాల్గొన్నారు.
మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.