చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
చిలకలూరిపేట టౌన్:- పట్టణంలో యువకుడి ఆత్మహత్య వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన గోపి నాయక్ అనే యువకుడు పండరిపురం లోని ఒక వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ జీవం సాధిస్తున్నాడు. ప్రేమ విఫలం అవటంతో మనస్థాపానికి గురై ఈనెల ఐదవ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సింగ్ నగర్ లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవుడై చెట్టుకి వేరేలాడుతున్న గోపి నాయక్ ను చూసి కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
మరిన్ని వార్తల కొరకు క్రింది లింకుపై క్లిక్ చేయండి.
No comments:
Post a Comment