ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య మృతి చెందారు. అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు. 1933 జూలై 4 గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన ఆయన స్వతంత్ర సమరయోధుడు గా ఎన్.జి.రంగా కు శిష్యునిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక కీలక బాధ్యతలను నిర్వహించి అనూహ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ కు 2009 నుండి 2010 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 1968,1974,1980, 2009 సంవత్సరాలలో MLC గా ఎన్నికయ్యారు. 1989, 2004 లలో చీరాల నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989 సంవత్సరంలో నరసరావుపేట నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 సంవత్సరంలో కర్ణాటక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2011 నుండి 2016 వరకు తమిళనాడుకు గవర్నర్గా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ కు 15వ సీఎంగా, తమిళనాడుకు 31వ గవర్నర్గా పని చేశారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్ అండ్ బి, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 15 సార్లు అసెంబ్లీలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి మన కొణిజేటి రోశయ్య. రాజకీయ భీష్ముడుగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు.గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.