చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు - రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం
చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ రోజు కరోనా టెస్టులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా తరలి వచ్చారు. హాస్పిటల్ బయట వరకు Q కట్టారు. అయితే సుమారు 400 మంది టెస్టులకి వచ్చారు అని అంచనా . హాస్పిటల్ సిబంది ముందస్తు చర్యలు తీసుకోకుండా అందరికి ఓపీ ఇచ్చారు. కానీ టెస్టులకు మాత్రం 100 రెజిస్ట్రేషన్ ఫారంలు మాత్రమే ఉన్నాయి అని ఈ రోజుకి 100 మాత్రమే అని చెప్పారు. పొద్దున 7 గంటలకు వచ్చి ఇప్పటి వరకు మండుటెండలో నిలబడి ఇప్పుడు ఫోరంలు లేవు అంటారు ఏంటి అని కొంచంసేపు ఆసుపత్రి సిబ్బందికి ప్రజలకి వాగ్వివాదం జరిగింది. చివరకు హాస్పిటల్ డాక్టర్ గారి చొరవతో వచ్చిన అందరికి టెస్టులు చేస్తాం అని చెప్పారు.ప్రైవేట్ టెస్టుల వలన బయట మెడికల్ ఫెసిలిటీ లేదు. అందువలన అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చినట్టు చెప్పారు.
వీడియో:-