మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp
Showing posts with label ఆంధ్రప్రదేశ్. Show all posts
Showing posts with label ఆంధ్రప్రదేశ్. Show all posts

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన IAS మైలవరపు కృష్ణ తేజ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా లండన్ హై స్పీడ్ డైవర్సిటీ కార్యక్రమంలో  మన కృష్ణతేజకు అవార్డుని అందజేశారు. ప్రస్తుతం కేరళ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. కేరళలో "అయమానం" గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుకు (WTM) 'వరల్డ్ ట్రావెల్ మార్కెట్' అవార్డు లభించింది. కేరళ లో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ అయమనం ప్రాజెక్టుకు అవార్డు దక్కడంతో కేరళ పర్యాటక శాఖ అధికారి మహమ్మద్ రియాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ అవార్డు తమ రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే కృష్ణ తేజ పదునైన ఆలోచనలను అవలంబించడం వలన ఇలాంటి అవార్డులు తమకు దక్కాయని వారు తెలిపారు. కృష్ణ తేజ తనకు అప్పగించిన బాధ్యతలను తన ఆలోచనలను కలుపుకొని సంపూర్ణంగా నిర్వహించడం వలన ఈ యొక్క అవార్డే కాదు గతంలోనూ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కేరళలో వరదలు మొదలుకొని & కోవిడ్ నియంత్రణను చర్యలను చేపట్టడంలో మైలవరపు కృష్ణ తేజ తనకు తానే సాటి అని - ఈనాడు లండన్లో ఈ అవార్డును అందుకోవడంతో మరోసారి మన తెలుగువారి ఘనతను విదేశాల్లో కూడా చాటిచెప్పారు. ఇలాంటి అవార్డులు మరెన్నో పొంది తెలుగువారి కీర్తిని దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల తెలియజేయాలని కోరుకుంటూ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

బద్వేల్లో YSRCP భారీ కాదు అతి భారి విజయం - భర్త కన్న భార్యకి డబల్ మెజారిటీ

బద్వేల్లో YSRCP భారీ కాదు అతి భారి విజయం - భర్త కన్న భార్యకి డబల్ మెజారిటీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మళ్లీ వీచిన ఫ్యాన్ గాలి - అందరూ అనుకున్నట్లే YSRCP విజయ ఢంకా మోగించింది. గత ఎన్నికల్లో భర్త వెంకటసుబ్బయ్యకు 44,000 మెజారిటీతో గెలుపొందితే. ఇప్పుడు సుబ్బయ్య భార్య దాసరి సుధా కు 1,11,710 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పి సురేష్ కు  21,612 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ కు 6,191 ఓట్లు వచ్చాయి. దీంతో బద్వేల్ ఎన్నికల్లో YSRCP 90,089 ఓట్ల మెజారిటీతో అతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కొంచెం తక్కువగా నమోదు అయినా కూడా భర్త వెంకట సుబ్బయ్య కన్నా డబల్ మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో టిడిపి పాల్గొనలేదు.



Share:

బద్వేల్ ఉపఎన్నికల్లో సూపర్ స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ - ఎంత స్పీడుగా అంటే ?

బద్వేల్ ఉపఎన్నికల్లో సూపర్ స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ - ఎంత స్పీడుగా అంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


బద్వేలు ఉపఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం మొదలైంది. అయితే ఇప్పటివరకు జరిగిన మూడవ రౌండ్ కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా 23,700 భారీ ఆదిత్యంలో కొనసాగుతున్నారు, తరువాత బిజెపి అభ్యర్థి పి సురేష్ 1688 ఓట్లతో, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ 580 ఓట్లు పొందారు. ప్రత్యర్థులకు అందనంత ఆదిత్యం లో ఉండటంతో YSRCPపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.



Share:

రోజు పెరిగే పెట్రోల్ రేటు కన్నా ఈరోజు రికార్డు స్థాయిలో పెరుగుదల - ఎంత అంటే ?

రోజు పెరిగే పెట్రోల్ రేటు కన్నా ఈరోజు రికార్డు స్థాయిలో పెరుగుదల - ఎంత అంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


గత కొంత కాలంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చి ఆకాశంలో వీర విహారంగా ఎగిరిపోతున్నాయి. ప్రతిరోజు 30 నుండి 35 పైసల వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేవి. అలాంటివి మొట్టమొదటిసారిగా 40 పైసల పైకి ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా సోమవారం నాడు పెట్రోల్ పై 41 పైసా డీజిల్ పై 42 పైసలు పెరిగాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మెట్రో నగరాల్లో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.



Share:

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ  - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

నాటి కన్నడ సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలను కనుసైగలతో శాసించిన కంఠీరవ రాజ్ కుమార్ మూడవ కుమారుడు కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా నిన్న మరణించడంతో యావత్ కర్ణాటక రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సాధారణంగా ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులు చాలా యాటిట్యూడ్, రిచ్నెస్ మెయిటింగ్ చేస్తూ ఉంటారు. అయితే అది ఏమీ తనకు వంట పట్టించుకోకుండా చాలా సింపుల్ గా జీవితం సాగిస్తూ కన్నడ మరియు దక్షిణ భారతదేశం ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తన మరణ వార్త విన్న భారతదేశం చిత్ర పరిశ్రమ అతనితో ఉన్నా అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అలాగే తమిళం, తెలుగు లో ఉన్న స్టార్ హీరోలతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నారు. అయితే ఈరోజు నందమూరి బాలకృష్ణ పునీత్ పార్థివ దేహాన్ని చూడటానికి బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. అయితే అక్కడ విగతజీవిగా ఉన్న పునీత్ ను చూసి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. సాయంత్రానికి తెలుగు పరిశ్రమ నుండి ఎన్టీఆర్, చిరంజీవి,రాణా లాంటి ప్రముఖులు పునీత్ అంతిమయాత్ర లో పాల్గొననున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మోహన్ బాబు మరియు చాలామంది ఇది సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సంఘీభావం తెలిపారు.

ఆయన మృతి పట్ల కన్నడ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బెంగళూరు వ్యాప్తంగా వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ మూడు రోజుల పాటు బంద్ ప్రకటించారు. పునీత్ కుమార్తె అమెరికాలో చదువుతున్న కారణంగా ఆమె ఈరోజు సాయంత్రానికి బెంగళూరు చేరుకొన్నది. నిన్నటి సాయంత్రం నుండి కంఠీరవ స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసి పోయింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సినీ ప్రముఖులు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖులు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.







Share:

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తరువాత నుండి దేశంలో ఇంధనం రేట్లు ఆకాశానికి వెళ్తున్నాయి. అయితే గత నెల సెప్టెంబర్ 28 నుండి ఈనెల అక్టోబర్ 28 వరకు మొత్తం 24 సార్లు ఇంధనం రేట్లు పెరిగాయి. అందులో పెట్రోల్ పైన 7.11రూ  డీజల్ పైన 8.43రూ పెరిగాయి. దేశంలో ఒక్క నెలలో ఇన్ని సార్లు ఇంత మొత్తంలో ఇంధనం రేట్లు పెరగటం ఇదే మొదటిసారి. చమురు రేట్లు ఈ విధంగా పెరగటంతో నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంధనం రేట్లకి అడ్డుకట్ట ఎప్పుడు వేస్తారు అని సామాన్యులు లబోదిబో మంటున్నారు.



Share:

చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్

 చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట -  రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండరు కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్ ఆదేశానుసారం రాష్ట్రంలోని మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి పులుపునిచ్చారు. అయితే మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన జిల్లా జనరల్ సేకరేటరీ పులుగుజ్జు మహేష్ తో పాటుగా, చిలకలూరిపేట టౌన్ ప్రెసిడెంట్ నందిగం రాజుని చిలకలూరిపేట పోలీస్ వారు ఆదివారం రాత్రి సమయంలో వారి ఇంటి వద్ద అరెస్ట్ చేసి నిర్బంధించారు. పులుగుజ్జు మహేష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండరును రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్లో 2,40,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయాయి ఇంకొకరిపైనా ఆధారపడి జీవిస్తున్నారు అని, జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల యువకులలో విశ్వసనీయత కోల్పోతుంది అని తెలిపారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/























Share:

ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.

ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కేసులు తగ్గుతున్న వేళా రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు చెయ్యాలి అని జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. పాజిటివిటీ రేట్ 5% కన్నా తక్కువగా ఉన్న8 జిల్లాలలో మినహా మిగిలిన 5 జిల్లాలలో కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుంది అని తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ,చిత్తూరు, ప్రకాశం జిల్లాలో తప్ప మిగిలిన 8 జిల్లాలలో ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు సడలింపు ఉంటుంది అని. జులై 1 నుండి 7 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలిపారు. 











































Share:

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు - బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు -  బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం మొత్తం 10,143 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగుల యువత తీవ్ర అసహనానికి గురి అయ్యారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్రమోహన్ గారి ఆదేశాలతో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ నందు నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే ఈ జాబ్ క్యాలెండరు రద్దు చేస్తూ త్వరలో నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాల భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండరు రిలీజ్ చెయ్యాలి అని నరసరావుపేట ఆర్టీఓ ఆఫీస్ నందు ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్, జిల్లా నాయకులు నెమలికంటి బ్రహ్మం, వంశీ ,మురళి,నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ళ కోటేశ్వరావు, కామినేని హనుమంతురావు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/






























Share:

మరో కంపెనీ గోవిందా ! - ఏపీ నుండి తరలిపోనున్న15 వేల కోట్ల రిలయన్స్ ప్రాజెక్టు

మరో కంపెనీ గోవిందా ! - ఏపీ నుండి తరలిపోనున్న15 వేల కోట్ల రిలయన్స్ ప్రాజెక్టు 

https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. కొత్తగా విడిపోయిన తరువాత చాలా పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ 2019 ఎన్నికల అనంతరం పరిస్థితి అంతా మారిపోయింది. గత ప్రభుత్వం సంబంధించిన టెండర్లలో అవకతవకలు ఉన్నాయి అని భావించి, సీఎం జగన్ మోహన రెడ్డి రివర్స్ ట్రేండింగ్ మొదలుకొని రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలి అంటే భయం ఏర్పడే పరిస్థితి నెలకొన్నది. ఏపీ కన్నా తెలంగాణ, తమిళనాడు లో ప్రశాంతంగా ఉంటుందనో ఏమో మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లు, ఐటీ హబ్బులు వెళ్లిపోయాయి. ఇపుడు పరిశ్రమలు స్టార్ట్ చేస్తే మళ్లీ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని పెద్ద పెద్ద కంపినీలు వేరే రాష్ట్రాలకి తరలిపోయాయి. 
తాజాగా రిలయన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చెయ్యాలి అనుకున్న 15వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ - సెట్టాప్ బాక్ససులు, ఢాంగిల్స్ మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లకు బ్రేకులు వేసింది ఆ సంస్థ, కారణం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 136 ఎకరాలను కేటాయించారు, దానిని ఈ ప్రభుత్వంలో 75ఎకరాలకు కి తగ్గించారు. ఆ 75 ఎకరాల భూమి ఉన్న రైతులు కేసు వెయ్యటంతో ఇక్కడ మనకి పని అవ్వదు అని అనుకున్నారో ఏమో రిలియన్స్ సంస్థ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునట్లు తెలుస్తుంది. 




























 



















































Share:

ఏపీలో మొట్టమొదటి డెల్టా ప్లస్ కరోనా కేసు నమోదు

ఏపీలో మొట్టమొదటి డెల్టా ప్లస్ కరోనా కేసు నమోదు 

https://chilakaluripetspeednews.blogspot.com/

అసలే కరొనతో అతలాకుతలం అయిన మన దేశంలో కొత్త వేరియంట్లు విజృభిస్తునాయి.కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ మొదలవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తొలిసారిగా ఏపీలో కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటి కేసు నమోదు అయ్యింది అని తెలిపారు. అయితే అతను కోలుకున్నారు అని, అతని వల్ల ఈ వేరియంట్ ఎవ్వరికి సోకలేదు అని తేల్చారు. రోజుకో ఫంగస్ పుట్టుకు వస్తుంది అని, ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకొని థర్డ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలి అని అయన కోరారు. 



































Share:

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ 

https://chilakaluripetspeednews.blogspot.com/


కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రంగం అంతా సిద్ధంగా ఉన్నారు అని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజషన్ అధికారి యాస్మిన్ తెలిపారు. థర్డ్ వేవ్ వస్తుంది అని ఎవరు భయపడవద్దు. ఈ లోపు చాల వరకు వ్యాక్సిన్ పూర్తి చేసేస్తాం. చాలా వరకు కంట్రోల్ అవుతుంది.వ్యాక్సిన్ తీసుకోవటం వలన కరోనా నుండి సేఫ్ గా బయటపడవచ్చు. థర్డ్ వేవ్ కు 186 ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. అందులో 35 ఆసుపత్రులు చిన్నపిల్లల కోసం సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలలో 10 పడకలకు ఆక్సిజన్ సప్లై ఉన్నాయి అని ఆమె తెలిపారు. 







































Share:

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత 

https://chilakaluripetspeednews.blogspot.com/q


చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ  మరో అరుదైన  ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.  ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.  
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు. 

Book of Achievers 


కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే 

మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
  
    జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.

    అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....

 🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
 🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
 🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి               వారికి ఇచ్చే గౌరవం.
 🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.

         ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........

 🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ                            ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
 🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
 🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
 🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
 🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన  I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
 🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
 🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
 🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
 🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
 🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో........... 

అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. 










































Share:

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో  - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు 

https://chilakaluripetspeednews.blogspot.com/`

చిలకలూరిపేట - 2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం 450 పోస్టులు రిలీజ్ చేసింది. దీని పైన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎన్నో రోజులుగా SI ఎగ్జామ్స్ కోసం కష్టపడుతుంటే మీరు వదిలిన పోస్థులను సంఖ్యను చూసి షాక్ కి గురి అయ్యాము అని అంటున్నారు. అందులో మన చిలకలూరిపేట పట్టణంలోని కొంత మంది అభ్యర్థులు ఏమి అంటున్నారో చూదాం. 

మనోహర్ నాయుడు :- నా పేరు మనోహర్, గత ఎన్నిక ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి ఇయర్ 6000 పోస్టులు భర్తీ చేస్తూ 4 సంవత్సరాలలో 24000 పోస్టులు భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చారు. నేను బ్యాంకు ఎంప్లాయ్ పోలీస్ జాబ్ కోసం అని జాబ్ వదిలేసి పోలీస్ అవ్వటం కోసం పగలు రాత్రి తేడా లేకుండా చదువుకుంటున్న, అయితే మొన్న జాబ్ క్యాలెండర్లో 450 పోస్టులు చూసి తీవ్ర నిరాశకిగురి అయ్యాను, అటు జాబ్ లేక  ఇటు పోలీస్ జాబ్ పైన నమ్మకం లేక సతమతం అవుతున్నాను.

కిరణ్ :- నా పేరు కిరణ్ హోమ్ గార్డ్ గా జాబ్ చేస్తున్న, 8 లక్షల మందికి 450 పోస్టులు ఏంటి అసలు 13 జిల్లాలకు ఎన్ని కానిస్టేబుళ్లు, ఎన్ని SI పోస్తులు వస్తాయి. అసలు దీనికన్నా కూడా పోస్టులు వదలకపోవటమే మంచిది. 6000 పోస్టులు అన్నారు ఇక్కడ మాత్రం 450 వదిలారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు. 

శంకర్ నాయక్ :- అన్ని వదిలేసి పోలీస్ జాబ్ పైన ద్రుష్టి పెట్టి కష్టపడుతుంటే మీరు రిలీజ్ చేసిన పోస్టులు చూసి మా ఆశలు పైన నీళ్లు చల్లినట్లు ఉంది. 

అమానుల్లా :- జగన్ వ్యవస్థ పైన నమ్మకం పోగొట్టుకొంటున్నారు. మాలాంటి నిరుద్యోగుల జీవితాల తో ఆడుకుంటున్నారు. దయ చేసిన జీవో ని మార్చి మళ్లీ కొత్త జీవోలో మినిమమ్ 5000 పోస్టులు అయిన నిరుద్యోగులకు అందించండి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. 

రవికాంత్ :- మేము ఎంత కష్టపడినా 450 పోస్టులు 8 లక్షల మంది రాస్తే అందులో మనకి రావటం అంటే కష్టం. పోస్టుల సంఖ్య పెంచండి. 

 ఇలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోజు మంచినీటి చెరువు పైనా , చెరువు రోడ్డు, CR కాలనీ పార్క్, బొప్పూడి - చిలకలూరిపేట రోడ్డు, గొర్రెల సంత రోడ్డులో రన్నింగ్ చేస్తున్న కష్టపడుతుంటారు మన పేట అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు తగిన పోస్టులు రిలీస్ చేసి వారి భవిషత్ మంచి బాటలు వెయ్యాలి అని కోరుకుందాం. 
 













































































Share:

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం నాడు సుప్రీం కోర్టు జెడ్జి లావు నాగేశ్వరావు గారు పర్యటించారు. పట్టణంలోని సుభాని నగర్ నందు ఉన్న లాహిరి పిల్లల హాస్పిటల్ నందు తేళ్ల సుబ్బారావు గారు ఏర్పాటు చేసిన చిన్న వేడుకలలో అయన పాల్గొన్నారు. లావు నాగేశ్వరావు గారి స్వగ్రామం పెదనందిపాడు కావటంతో చిలకలూరిపేటతో ఉన్న సంబంధాన్ని పంచుకున్నారు.నాగేశ్వరావు గారి పర్యటనతో ఆ ప్రాంతం అంతా పోలీస్ బందోబస్తుతో నిండిపోయింది. 
























































































Share:

అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట - స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు

అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట -  స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - మాజీ మినిష్టర్ ప్రత్తిపాటి పుల్లారావు ఏంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో నేను అధికారంలో ఉన్నపుడు ఎన్నిక ప్రచారంలో దళిత భూముల విషయంలో తన పైన విమర్శలు చేసిన జగన్ మోహనరెడ్డి  ఈ రోజు అధికారంలో ఉండి అదే దళిత భూములను ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుంది అని ప్రశ్నించారు. స్థానిక నాయకులు నేతలు కూడా దీని పైనా మౌనం వహించటం ఏంటని, అలాగే దీని పైనా జగన్ మోహన రెడ్డి స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని దిని పైనా పోరాటం చేస్తాం అని తెలిపారు. అలాగే చిలకలూరిపేట అధికారం అడ్డం పెట్టుకొని అక్రమ దందా సాగిస్తున్నారు అని 175 నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా అక్రమ మద్యం,పేకాట, గుట్కా వ్యాపారాలకు కేరాఫ్ గా మార్చారు, ఎక్కడో పక్క జిల్లా పోలీసులు ఇక్కడ అక్రమ గుట్కాలు పట్టుకునే వరకు ఎక్కడ పొలిసువారు ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు. 

సెంట్రల్ గవర్నమెంట్ జర్నలిస్ట్ లను ఫరంట్ లైన్ వర్కర్లుగా గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అని , మరణించిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల ఆర్ధిక నష్టం చెలించాలి అని డిమాండ్ చేసారు.  












































Share:

చిలకలూరిపేట - డాక్టర్ల పైనా దాడి కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన - ప్రతి ఆసుపత్రిని పోలీసులతో రక్షణ కల్పించాలి

 చిలకలూరిపేట - డాక్టర్ల పైనా దాడి కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన - ప్రతి ఆసుపత్రిని పోలీసులతో రక్షణ కల్పించాలి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని డాక్టర్ లావు సతీష్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయిన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు  మంది తమ యొక్క సహనాన్ని కోల్పోయాయి డాక్టర్ల పైన దాడికి పాల్పడటం నిజంగా వైద్య రంగానికి సిగ్గు చేటుగా అని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితిలో ఇంట్లో వాళ్ళకి దూరముగా ఉంటూ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటే కొంత మంది ఇలా దాడులకు పాల్పడటం ఏంటి అని బాధని వ్యక్తం చేసారు. 

కరోనా వలన చనిపోయిన వైద్య కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించాలి అని కోరారు, అలాగే హాస్పిటలను రక్షణ కేంద్రాలుగా ప్రకటించి ప్రతి ఆసుపత్రి వద్ద కొంత మంది పోలీసులను తో రక్షణ చర్యలు చేపట్టాలి అని కోరారు. ఈ సమావేశంలో కొల్ల రాజమోహన్, కొల్ల అమర్, గణేశుని పరశురామ్, ముద్దన రమేష్,లావు సతీష్,లావు అరుణ,వెల్లటూరు రాణి, సురేష్ బాబు, వ్ కిషోర్, గారు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు 









































Share:

చిలకలూరిపేట - డబ్బులు డిమాండ్ చేసిన వార్డు లేడీ వాలంటరీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ - మూడు వార్డు అడ్మిన్లను బదిలీ

చిలకలూరిపేట - డబ్బులు డిమాండ్ చేసిన వార్డు లేడీ వాలంటరీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ - మూడు వార్డు అడ్మిన్లను బదిలీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత రెండు రోజులుగా పట్టణంలోని 27వ వార్డు వాలంటరీ లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేసిన విషయం సామాజిక మాధ్యమాలలో, పట్టణ, రాష్ట్ర మీడియా ఛానళ్లలో కోడై కూసింది. వీడియో లో వాలంటరీ చెప్పినట్లుగా తాను ఒక్క రూపాయి కూడా తీసుకోను అంతా ఫై అధికారులకు వెళ్తుంది అని చెపింది. దీని పైనా సీరియస్ అయిన మునిసిపల్ కమిష్నర్ ఘటన తెలిసిన వెంటనే ఆయా వాలంటరీని విధుల నుండి తప్పించారు. అలాగే తాజాగా ఆమె పైన ఉన్న అడ్మిన్లను బదిలీ చేస్తూ మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేసారు. 9,27,29 వార్డు అడ్మిన్లను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. 9 వ వార్డు అడ్మిన్ సిద్దాబత్తుని రాజేష్ ను 27 వ వార్డుకి , 29 వ వార్డు అడ్మిన్ కరిష్మాను 9 వ వార్డుకి, 27 వ వార్డు అడ్మిన్ గడ్డం మురళి కృష్ణ ను 29 వ వార్డుకి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.  






























Share:

చిలకలూరిపేట పట్టణంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన బసవతారకరామ సర్వీస్ సొసైటీ , టీడీపీ నాయకులూ

చిలకలూరిపేట పట్టణంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన బసవతారకరామ సర్వీస్ సొసైటీ , టీడీపీ నాయకులూ

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో సినీ నటుడు,హిందుపూర్ MLA  బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవతారకరామ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ కేకును మాజీ మునిసిపల్ ఛైర్మెన్ అయిన గంజి చంచు కుమారి గారితో కట్ చేసి నిరుపేదలకు 100 మందికి ఆహరం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పండు శ్రీను, కంచర్ల వెంకటేష్, గంజి మోహన్, గాలం కోటి, మద్దిబోయిన శివ, పేరయ్య, గోపిదేశి వెంకటేష్ పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

అలాగే పట్టాన టీడీపీ ఆఫీస్ నందు కూడా తెలుగు యువత నాయకులూ ఏలూరి నాగేశ్వరరావు గారు భారీ కేక్ ఎర్పాటు చేసారు. ముఖ్య అతిధిగా RK హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామకృష్ణ గారు విచ్చేసి కేక్ కట్ చేసారు. 
 ఈ రోజే జిల్లా SC  నాయకులు ఇనగంటి జగదీష్ గారి పుట్టిన రోజు కూడా కలిసి రావటంతో అయన కూడా కేక్ కట్ చేసారు. ఈ సందర్భంలో కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు గారు, మల్లి బాబు గారు, పిల్లి కోటి గారు, అజారుద్దీన్ గారు, రవి గారు, అబ్దుల్ బాషా, శ్రీన, హరి బాబు, వేణు తదితరులు టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగు యువత,  పాల్గొన్నారు. 































Share:

చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్

చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్ 


https://chilakaluripetspeednews.blogspot.com/2021/06/27.html





చిలకలూరిపేట పట్టణంలోని 27 వార్డు కి చెందిన లేడీ వాలంటరీ నిర్వాకం బయట పడింది. ప్రభుత్వ పధకాలు నేరుగా ప్రజలకు చేరువ చెయ్యవలసిన వాలంటరీ పధకాలు రావాలి అంటే ముందు గా తమకు  డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రభుత్వ లంచగొండ్లు నుండి ప్రజలను కాపాడటానికి వాలంటరీ వ్యవస్థ ఉన్నది. అలాంటిది ఫై వీడియో చూస్తే వాలంటరీ తీరు పైన అక్కడ ఉన్న లబ్దిదారుల కుటుంబం బిత్తర పోయింది. 

ఛైర్మెన్ రఫాని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఆయా వాలంటరీ ని విధుల నుండి తప్పిస్తునట్లు తెలిపారు. అయితే ప్రజలు మాత్రం ఆ వీడియో లో  చెప్పునట్లు గా ఆ ఫై అధికారులు ఎవరో వారిని కూడా విచారించి వారిపైన చర్యలు తీసుకోవాలి అని కోరారు.  





































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.