చిలకలూరిపేట ASI శ్రీరాములు అనారోగ్యంతో మృతి
నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి !- చిలకలూరిపేట నోడల్ అధికారి గోపీనాయక్
నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి !- చిలకలూరిపేట నోడల్ అధికారి గోపీనాయక్
చిలకలూరిపేట ( 52 ఎకరాలలో) టిడ్కో వసతి సముదాయం నందు కరోనా వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు గా ఉన్న వాళ్లు అందరూ ఉచితంగా సేవలు చేస్తుంటే, సామాజిక మాధ్యమాలలో ఎంట్రీ ఫీజు 1000 చెలించాలి అని అబద్దపు ప్రచారం చేస్తున్నారు అని డాక్టర్ గోపి నాయక్ గారు ఆవేదన వ్యక్తం చేసారు. నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలను సామజిక మాధ్యమాలలో ప్రచారం చేసేవారి పైన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారికి ఫిరియాదు చేసాము అని తెలియచేసారు. పగలు రాత్రి తేడా లేకుండా మంచి భోజన సదుపాయాలు, అందజేస్తున్నామని, కరోనా బారిన పడినవాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలియచేసారు. అలాగే గతంలో 500 మందికి ఇక్కడ వైద్య సదుపాయాలు అందజేశాము, కానీ ఇప్పుడు 200 మందికి మాత్రమే అనుమతి అవి కూడా ఫుల్ అయ్యాయి అని తెలిపారు. త్వరలో ఇంకో 300 మందికి సదుపాయాలు ఎర్పాటు చేస్తాము అని తెలియచేసారు .
అలాగే కరోనా టెస్టు చేపించిన వారికీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ లో కానీ ID నెంబర్ ఇస్తారు. ఆ ID నెంబర్ ఉన్న వాళ్ళని అనుమతి ఇస్తున్నాము అని తెలిపారు. ప్రైవేట్ టెస్టులు చేసి ID నంబర్లు ఇవ్వకుండా గవర్నమెంట్ కు లెక్క చెప్పకుండా ప్రజల దగిర డబ్బులు ఎక్కువగా దండుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు.