చిలకలూరిపేట:- ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మరో యాక్సిడెంట్
చిలకలూరిపేట:- పిఎస్ ఫైవ్ ఆపోజిట్లో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినది. రామచంద్రపురం గ్రామానికి చెందిన తాళ్లూరు ఇజ్రాయేలు (40) మార్తమ్మ (32) కీర్తన (15) చిలకలూరిపేట పట్టణంలోని ఒక ప్రముఖ చర్చ నుండి ప్రార్థనకు వెళ్లి తిరిగు ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది.టు వీలర్ మీద ముగ్గురు చిలకలూరిపేట పేట నుంచి రామచంద్రపురం వెళుతున్నారు. అప్పుడే అక్కడ అనంతారం క్రాస్ రోడ్డు వద్ద హైవే క్రాస్ చేస్తూ ఎక్సెల్ మీద మద్దిరాల ప్రేమానందమ్మ వచ్చింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ప్రేమానందమ్మ కుడి చెయ్యి మణికట్టు విరిగింది. ఇజ్రాయేలు, మార్తమ్మ, కీర్తనలకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 చిలకలూరిపేట అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నలుగురికి ప్రథమ చికిత్స చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.