చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలు
చిలకలూరిపేట: జాతీయ రహదారిపై చిలకలూరిపేట పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీ బైపాస్ రోడ్డు ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన ఏడుగురు ఆదివారం పట్టణంలోని భావనారుషి నగర్ వద్ద ఉన్న ఒక ప్రార్థనమందిరానికి వెళ్ళి తిరిగి వెళ్లే ఈ క్రమంలో గుంటూరు వెళ్లే రోడ్డు వైపు నుంచి హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా రజక కాలనీ వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ఈ సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తున్న కారు వేగంగా ఆటోను ఢీ కొట్టింది... ఈ సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గొల్ల శేవీరియేలు 60 సంవత్సరాలు తలకు తీవ్ర గాయమైంది. ఎం.అక్షయ (14)కు కుడికాలు యాంకిల్ లో ఓపెన్ ఫ్రాక్చర్ అయింది. బొందు ప్రసన్న (25) తలకు గాయమైంది, బంధు విజయ్ (29) లెఫ్ట్ షోల్డర్ కి దెబ్బ తగిలింది. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నలుగురికి ప్రథమ చికిత్స చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment