మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరికపై - అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం

లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరికపై - అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం 

మార్చి 2న తెలుగుదేశం పార్టీలోకి లావు శ్రీ కృష్ణదేవరాయలు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం

పలనాడు జిల్లా :- ఎప్పుడు ఎప్పుడు పార్టీలో చేరుతారా అని నరసరావుపేట పార్లమెంట్ టిడిపి కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు లావు శ్రీకృష్ణ TDP లో చేరిక తేదీ ఖరారు చేశారు. మార్చి 2వ తేదీన గురజాల నియోజకవర్గం, దాచేపల్లిలో జరగబోయే 'రా కదలి రా ' సభలో టిడిపిలోకి చేరుతున్నట్లు లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు.  సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని మన పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని మరలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకాన్ని కోరారు.

- లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారి కార్యాలయం

Share:

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

చిలకలూరిపేట:-  మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు పత్తిపాటి శరత్ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తూ పట్టణంలోని టిడిపి శ్రేణులు సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం దిష్టిబొమ్మ తగలబెట్టి నరసరావుపేట సెంటర్లో భారీ మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ

జగన్మోహన్ రెడ్డి రాజకీయ వికృత చర్యకు పరాకాష్ట ఈ కేసు. ఆ కంపెనీతో ఎటువంటి సంబంధం లేకపోయినా మా అబ్బాయి శరత్ బాబుని అక్రమంగా ఈ కేసులో అరెస్టు చేశారు.

నారా చంద్రబాబు గారు నాకు సీటు కన్ఫర్మేషన్ చేయగానే కొన్ని గంటలలోనే ఈ కేసు రిజిస్టర్ అయింది అంటే అర్థమవుతుంది రాజకీయ ప్రేరేపిత కేసు అని.. కుటుంబ సభ్యుల పైన కేసులు పెట్టి మా మానసిక ధైర్యాన్ని నీవు దెబ్బతీయాలనుకుంటే అది జరగని పని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో.. నీ ఉడత ఊపులకి ఇక్కడ భయపడేది ఎవరూ లేరు. నాలుగు సంవత్సరాల నుంచి మమ్ములను వేధించిన వేధింపులు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి నిన్ను ప్రజా క్షేత్రం నుంచి తరిమి వేసే రోజులు దగ్గర పడ్డాయి.. అందుకే ఇటువంటి చేష్టకు నీవు పూనుకుంటున్నావు అంటూ ఆయన ద్వజమెత్తారు.

ప్రత్తిపాటి శరత్ బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలియజేసిన టిడిపి శ్రేణులు..

పత్తిపాటి నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేశారు. బైపాస్ పై నిరసన తెలియజేస్తూ డౌన్ డౌన్ సీఎం, నశించాలి నిరంకుశ పాలన డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపీ -  జనసేనలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?


చిలకలూరిపేట మంత్రి పార్టీ తనయుడు ప్రత్తిపాటి శరత్ ను బ్రెస్ట్ చేశారు వివరలోకి వెళితే ... GST పన్ను ఎగవేత కేసులో కృష్ణాజిల్లా విజయవాడ పరిధిలోని మాచవరం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎటువంటి కంపెనీలలో షేర్ హోల్డర్ గా లేని తన తనయుడిని అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేపించారని ప్రత్తిపాటి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సమాచారాన్ని అందుకున్న టిడిపి శ్రేణులు భారీ ఎత్తున ప్రత్తిపాటి నివాసానికి చేరుకుని అరెస్టుని ఖండిస్తూ ర్యాలీని నిర్వహించారు.

Share:

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

చిలకలూరిపేట రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో  అన్యాయంపై పోరాటం చేయడంలో ముందుండే నవతరం పార్టీ 15 మంది అసెంబ్లీ 15 మంది పార్లమెంటు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.

నవతరంపార్టీ ఆంధ్రప్రదేశ్ 2024 సాధారణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా పార్లమెంట్ 15 మరియు అసెంబ్లీ 15 మొత్తం 30 మంది అభ్యర్థులను నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు చిలకలూరిపేటలోని నవతరంపార్టీ కార్యాలయంలో ప్రకటించారు. మంగళగిరి అసెంబ్లీ నుండి నారా లోకేష్ పై జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరేలా తమ మేనిఫెస్టో ఉన్నదని అధికారంలోకి వచ్చిన వెంటనే తమ మేనిఫెస్టో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు అభ్యర్థులు: -

1) మంగళగిరి : శ్రీ రావు సుబ్రహ్మణ్యం

2)చిలకలూరిపేట : శ్రీమతి రావు రామతులసి

3)ప్రత్తిపాడు (sc) : శ్రీ మేరుగ విజయరాజు

4)తిరుపతి : శ్రీ షేక్ నౌషాద్ బాషా

5)పీలేరు : శ్రీమతి భుక్కే లలిత

6)తంబళ్లపల్లె : శ్రీ కొక్కాల శ్రీకాంత్

7)శ్రీకాళహస్తి : శ్రీ గానుగపెంట రమేష్

8)చీరాల : శ్రీ కొమరగిరి దుర్గారావు

9)సంతనూతలపాడు(ఎస్సి):శ్రీచెరుకూరి సుబ్బారావు

10)బాపట్ల : శ్రీ షేక్ కరీం

11)పర్చూరు: గోనుగుంట్ల వెంకట సుబ్బారావు

12)గుంటూరు తూర్పు : శ్రీ షేక్ అబ్దుల్ రజాక్

13)గుంటూరుపశ్చిమ:శ్రీవెల్లాల సాయి సుబ్రహ్మణ్యంరాజు

14)సత్తెనపల్లి:శ్రీ బక్కా వెంకట విఘ్నేశ్వరస్వామి

15)పెనుకొండ : ఎల్.ఆనంద్ కుమార్


*పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థులు:*

1) శ్రీకాకుళం : శ్రీ నాయుడుగారి శేఖర్

2) విజయనగరం : శ్రీ పైడి గోవిందరావు

3)మచిలీపట్నం : శ్రీ కందుల చంద్రమౌళి

4)విజయవాడ :శ్రీ యణమండ్ర కృష్ణకిషోర్ శర్మ  

5)గుంటూరు: శ్రీమతి పోకూరి కవిత

6)నరసరావుపేట : శ్రీ చెల్లి దయారత్నం

7)బాపట్ల (ఎస్సి) : శ్రీ నలమాల తిరుపతిరావు

8)ఒంగోలు : శ్రీ వేమిశెట్టి యశ్వంత్

9)నంద్యాల : శ్రీ ఐ జె వెంకట రమణ

10)కర్నూల్ : శ్రీ తుడుము ఓబులేసు

11)   అనంతపూర్: శ్రీమతి హరిజన చాముండేశ్వరి

12)హిందుపూర్ : శ్రీ అల్లు మాలకొండ్రాయుడు

13)కడప : శ్రీ అల్లు వెంకటేశ్వర్లు

14)నెల్లూరు : శ్రీ తెనాలి రాంప్రసాద్

15)తిరుపతి (ఎస్సి) : శ్రీ Dr.కుక్కంబాకం చంద్రశేఖర్.

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం


Share:

చిలకలూరిపేట - సైన్స్ డే - విజ్ఞాన ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు

 చిలకలూరిపేట - సైన్స్ డే - విజ్ఞాన ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు

చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.


శ్రీచైతన్య పాఠశాల నందు

చిలకలూరిపేట - శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలలో సైన్స్ డే ప్రదర్శనలు - రకరకాల ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు  చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.    శ్రీచైతన్య పాఠశాల నందు     శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు  ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.    నారాయణ స్కూల్ నందు  పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


 శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు

ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.


నారాయణ స్కూల్ నందు

చిలకలూరిపేట - శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలలో సైన్స్ డే ప్రదర్శనలు - రకరకాల ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు  చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.    శ్రీచైతన్య పాఠశాల నందు     శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు  ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.    నారాయణ స్కూల్ నందు  పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Share:

ప్రతినెల 20 వేల రూ|| ఫండ్ ను టైలర్ అసోసియేషన్‌కు అందజేస్తాం - జాన్ సైదా

ప్రతినెల 20 వేల రూ|| ఫండ్ ను టైలర్ అసోసియేషన్‌కు అందజేస్తాం - జాన్ సైదా

చిలకలూరిపేట:- పట్టణంలోని టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ జాన్ సైదా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కుట్టుమిషన్ సృష్టికర్త అయిన స్త్రీ ఇలియన్స్ హోవే గారి చిత్రపటానికి పూలమల వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాన్ సైదా మాట్లాడుతూ ప్రతినెల 20 వేల రూపాయలు టైలర్స్ అసోసియేషన్ సభ్యులకు అందిస్తానని హామీ ఇచ్చారు. టైలర్స్ అసోసియేషన్క తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం టైలర్  అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి జాన్ సైదా గారిని పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యులు , పోతవరం సర్పంచ్ భాషా మేస్త్రి, కరీముల్లా, ఆది బాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 

Share:

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడవల్లి గ్రామ సర్పంచ్ తిరుమలేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఏడవల్లి గ్రామ సర్పంచ్ గా చేసిన మహిళా కుమారుడు గ్రామంలో మూడు ఆర్చీలు నిర్మించారని వాటి వలన కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లడానికి అడ్డంగా ఉందని పలుసార్లు చెప్పినా కూడా వారు పట్టించుకోవటం లేదని ఆమె తెలిపారు. ఊరిలో కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని, కాపుల స్మశాన వాటికను పూర్తిగా ఆక్రమించుకున్నారని... ఏంటని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లారని ఎమ్మార్వో ని కలిస్తే ఆమె కూడా వారికే వత్తాసు పలికారని తిరుమలేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న పోరంబోకు స్థలాలు మొత్తాన్ని ఆక్రమించుకున్నారని చివరకు వాగులను స్మశానవాటికలను కూడా వదలడం లేదని ఆమె తెలిపారు. గ్రామంలో కాపులకు, కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారని, స్మశాన వాటికలో ఆక్రమాలు తొలగించాలని పలుమార్లు ఎమ్మార్వో చుట్టూ తిరిగిన ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని చివరిగా ఆమె ట్రాన్స్ఫర్ వెళ్లిపోయిందని  ఆవేదనను తెలియజేశారు.

Share:

చిలకలూరిపేట - బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ

చిలకలూరిపేట - బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ


చిలకలూరిపేట:- బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే చలంచర్ల నాగమ్మ(55) అనే మహిళ రెండు సంవత్సరాలుగా సొలస గ్రామం ఎస్టి కాలనీలో నివాసం ఉంటుంది. స్థానికుల సమాచారం మేరకు ఒంటరిగా జీవిస్తున్న ఆమె పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని, అందువలనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని వారు తెలిపారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని బావి నుండి బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Share:

త్వరలో జరగబోయే పల్నాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నాను - ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

త్వరలో జరగబోయే పల్నాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నాను  - ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు




పల్నాడు జిల్లా :- గత కొంతకాలంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపి టిడిపిలో చేరడం ఖరారు అయినా కూడా తేదీని ప్రకటించకపోవడంపై సందిగ్ధత నెలకొన్నది. నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బిజెపికి ఇస్తారనే ప్రచారంతో అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిత్వం వస్తుందో అనే ప్రచారానికి తెరపడింది. ఎంపీ ఆఫీస్ నుండి అఫీషియల్ గా త్వరలో జరగబోయే పలనాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గురించి మరియు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ పలనాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను అని ఆ ప్రెస్ నోట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

Share:

టిడిపి - జనసేన అభ్యర్థులు వీరే

టిడిపి - జనసేన అభ్యర్థులు వీరే :-


టీడీపీ అభ్యర్థులు :-

ఆముదాలవసల - కూన రవికుమార్

ఇచ్చాపురం - బెందాళం అశోక్

టెక్కలి - అచ్చెన్నాయుడు

రాజాం - కొండ్రు మురళీమోహన్

అరకు - దొన్ను దొర

కురుపాం - జగదీశ్వరి

పార్వతీపురం - విజయ్ బొనెల

సాలూరు - గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలి - బేబీ నాయన

గజపతి నగరం - కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం - పూసపాటి అదితి

నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు

పాయకరావుపేట - వంగలపూడి అనిత

విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ వెస్ట్ - గణబాబు

ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు

పి గన్నవరం - మహాసేన రాజేష్

కొత్తపేట - బండారు సత్యానందరావు

మండపేట - జోగేశ్వరరావు

రాజమండ్రి - ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ

పెద్దాపురం - చినరాజప్ప

తుని - యనమల దివ్య

అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

ఆచంట - పితాని సత్యనారాయణ

పాలకొల్లు - నిమ్మల రామానాయుడు

ఉండి - మంతెన రామరాజు

తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ

చింతలపూడి - సొంగా రోషన్ కుమార్

తిరువూరు - కొలికపూడి శ్రీనివాసరావు

నూజివీడు - కొలుసు పార్థసారథి

ఏలూరు - బడేటి రాధాకృష్ణ

గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ - వెనిగండ్ల రాము

పెడన - కాగిత కృష్ణ ప్రసాద్

మచిలీపట్నం - కొల్లు రవీంద్ర

పామర్రు - కుమార్ రాజా

విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ ఈస్ట్ - గద్దే రామ్మోహన్

జగ్గయ్య పేట - శ్రీరామ్ తాతయ్య

నూజివీడు - కొలుసు పార్థసారథి

నందిగామ - తంగిరాల సౌమ్య

తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్

మంగళగిరి - నారా లోకేష్

పొన్నూరు - ధూళిపాళ్ల నరేందర్ కుమార్

బాపట్ల - నరేంద్ర వర్మ

ప్రత్తిపాడు - బూర్ల రామాంజనేయులు

చిలకలూరి పేట - ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ

వినుకొండ - జీవీ ఆంజనేయులు

మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి

రేపల్లె - అనగాని సత్యప్రసాద్

ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు

పర్చూరు - ఏలూరి సాంబశివరావు

సంతనూతలపాడు - బీఎన్ విజయ్‌కుమార్

అద్దంకి - గొట్టిపాటి రవికుమార్

ఒంగోలు - దామచర్ల జనార్థనరావు

కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహరెడ్డి

కొండెపి - డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి

కావలి - కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

గూడూరు - పాశం సునీల్ కుమార్

సూళ్లూరు పేట - విజయ శ్రీ

ఉదయగిరి - కాకర్ల సురేష్

కడప - మాధవి రెడ్డి

రాయచోటి - రాంప్రసాద్ రెడ్డి

పులివెందుల - బీటెక్ రవి

మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్

ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియ రెడ్డి

శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్ రెడ్డి

కర్నూలు - టీజీ భరత్

పాణ్యం - గౌరు చరితా రెడ్డి

నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్

బనగానపల్లె - బీసీ జనార్థన్ రెడ్డి

డోన్ - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

పత్తికొండ - కేఈ శ్యాంబాబు

కొడుమూరు - దస్తగిరి

రాయదుర్గం - కాలువ శ్రీనివాసులు

ఉరవకొండ - పయ్యావుల కేశవ్

తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి

శింగనమల - బండారు శ్రావణి శ్రీ

కళ్యాణ దుర్గం - అమిలినేని సురేంద్రబాబు

రాప్తాడు - పరిటాల సునీత

మడకశిర - సునీల్ కుమార్

హిందూపురం - నందమూరి బాలకృష్ణ

పెనుకొండ - సవితమ్మ

తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి

పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

నగరి - గాలి భాను ప్రకాష్

గంగాధర నెల్లూరు - బీఎం థామస్

చిత్తూరు - గురజాల జగన్‌మోహన్

పలమనేరు - అమర్‌నాథ్ రెడ్డి

కుప్పం - నారా చంద్రబాబునాయుడు


జనసేన అభ్యర్థులు :-

నెల్లిమర్ల- లోకం మాధవి

అనకాపల్లి- కొణతాల రామకృష్ణ

కాకినాడ రూరల్ - పంతం నానాజీ

తెనాలి-నాదెండ్ల మనోహర్

రాజానగరం - బత్తుల బలరామ కృష్ణ

Share:

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

గత కొంత కాలంగా బిజెపి పొత్తు విషయమై జాప్యం చేస్తున్న నేపథ్యంలో జనసేన - టిడిపి అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు ఈరోజు చంద్రబాబు - పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టిడిపి అభ్యర్థి పేరును పత్తిపాటి పుల్లారావు గా ప్రకటిస్తూ భిన్నాభిప్రాయాలకు తెరదించారు. స్థానికంగా చిలకలూరిపేటలో భారీగా పట్టు ఉన్న ప్రత్తిపాటికే చిలకలూరిపేట టిడిపి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గత కొంతకాలంగా జనసేన - తోటరాజ రమేష్ తో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా ప్రత్తిపాటిని ఎంపిక చేసినందుకుగాను టిడిపి కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.

Share:

బ్రేకింగ్ న్యూస్ :- రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బ్రేకింగ్ న్యూస్ :- రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే రాసి నందిత సికింద్రాబాద్ నుండి బాసరకు వెళ్తున్న సమయంలో పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై డివైడర్ను ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా చర్లపల్లి వద్ద కారు అదుపుతప్పి హోం గార్డెన్ ఢీకొనడంతో అతను అక్కడక్కడ మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు పది రోజుల సమయంలో ఈ యాక్సిడెంట్ లో చనిపోవడంతో నియోజకవర్గం ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. గత ఏడాది ఫిబ్రవరి 19 న లాస్య తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2023 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. లాస్య మృతి పట్ల పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.

Share:

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

చిలకలూరిపేట :- త్వరలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షల సమయం రానున్నటంతో చిలకలూరిపేట లోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంవత్సరకాలం మొత్తం కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఆర్థిక స్తోమత వలన ఫీజులు కట్టకపోతే వారికి హాల్ టికెట్లు నిలిపివేయకుండా విద్యార్థులకు అందించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆర్థికపరమైన చిక్కుల వలన వెనక్కి వెళ్ళకూడదు అని, అలాగే ప్రభుత్వం తల్లి ఖాతాలో కాకుండా విద్యార్థుల పాఠశాలల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చట్టం తీసుకురావాలని దీని ద్వారా విద్యార్థులు చదువుకి ఆటంకం కలగకుండా విద్యా దీవెన సక్రమంగా స్కూళ్లకు మరియు కాలేజీలకు చేరుతుందని వారు కోరారు. ఇలా చేయడం వలన హాల్ టికెట్లు, విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకునే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉంటారని వారు తెలిపారు. విద్యార్థులకు కాలేజీలలో, స్కూల్లలో హాల్ టికెట్లు పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మేకపోతుల నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సాయి నాయక్, బొంత భగత్ సింగ్, సహాయ కార్యదర్శి పృద్వి, త్రిపురం సురేంద్ర మరియు మండాది ఫణి పాల్గొన్నారు.

వేగంగా వార్తలను పొందటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట:- మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ కనెక్షన్ కోసం చిలకలూరిపేట రూలర్ ఏపీ సీపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సదరు 55,000 లంచం అడగగా బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. వెంటనే రంగంలోకి దిగిన ACB అధికారులు లంచం తీసుకుంటుండగా ప్రకాష్ రావు నాయక్ ను పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్ మత్తె, డీఎస్పీ సత్యానంద్ రైడ్ లో పాల్గొన్నారు. లంచాలకు పాడుపడుతున్న అధికారుల సమాచారాన్ని తమతో పంచుకోవాలని వారు తెలిపారు.


మరిన్ని వార్తలు వేగంగా పొందడం కోసం కింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి వాట్స్అప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/GJSIoeRYDkBLAgjWVh6RlO

Share:

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వివాదాస్పదమైన గొర్రెల మండి నుండి పసుమర్తి డొంక రోడ్డు వ్యవహారం ఉద్యమ రూపం దాల్చింది. పసుమర్రు గ్రామ సర్వేనెంబర్ 16/A కి సంబంధించిన స్థలం వ్యవహారం ఇప్పుడు పట్టణంలో హార్ట్ టాపిక్ గా మారింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మామ అయిన విడుదల లక్ష్మీనారాయణ గతంలో గొర్రెల మండి వెనుక ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశారని తనకు సంబంధించిన స్థలంలో అతాను గోడ కట్టుకున్నట్లు వారికి సంబంధించిన వ్యక్తులు తెలియజేస్తున్నారు. అయితే అతనికున్న స్థలం కాకుండా ముందు వైపు ఉన్న రోడ్డును కూడా ఆక్రమించి దానిపై గోడను నిర్మించారని, ఇప్పటికే గొర్రెల మండి పక్క నుండి పసుమర్తి గ్రామానికి తారు రోడ్డు శాంక్షన్ అయినా కూడా పనులు జరగపోవడానికి కారణం ఈ ఘటనేనని, దీనివల్ల గ్రామ అభివృద్ధికి కుంటుపడుతుందని రహదారి ఆక్రమ బాధితుల సంఘం తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే కోటి రూపాయలు ఇస్తే కానీ రోడ్డు వదలను విడుదల లక్ష్మీనారాయణ బాధితులకు తెలిపినట్లు వారు తెలియజేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అఖిలపక్షం నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేడు చిలకలూరిపేట మరియు పసుమర్తి గ్రామ ప్రజలు సుమారు 100 మంది ఆక్రమించిన రోడ్డు వద్ద టెంటును ఏర్పాటు చేసి దీక్షను చేపట్టారు. వీరితో పాటుగా అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని ఈ ఆక్రమించిన రోడ్డుని తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు. 

వేగంగా వార్తలను పొందడం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

చిలకలూరిపేటలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

చిలకలూరిపేటలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-03-21T10:15:00-04:00&max-results=14&reverse-paginate=true&m=1

చిలకలూరిపేట టౌన్ :- పట్టణంలోని సుభాని నగర్ లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని సుభాని నగర్ నందు లహరి పిల్లల హాస్పిటల్ రోడ్డులోని జండా చెట్టు ఎదురుగా ఉన్న పటాన్ సుభాని అనే వ్యక్తి ఇంట్లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. పఠాన్ సుభాని మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం విజయనగరంలోని ఉరుసు కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఇది అదునుగా భావించిన దొంగలు అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి 25 వేల రూపాయలు నగదు, బంగారు దుద్ధులు, వెండి పట్టీలు దొంగిలించి పారిపోయారు. తెల్లవారుజామున తలుపులు తెరిచి ఉండటానికి గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో సామాన్లు అన్ని కింద పడేసి ఉండటానికి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వార్తలను వేగంగా పొందడం కోసం కింది ఉన్న లింకు పై క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం - చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ యూనియన్

రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం - చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ యూనియన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన సిద్ధం సభలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువకులు అత్యుత్సాహంతో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీకృష్ణకు తీవ్రమైన గాయాలయ్యాయి. సిద్ధం సభను న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ పై ఇలాంటి దాడి చేయడంతో ప్రజా సంఘాలు, ఆంధ్ర జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేశాయి. 

 రాప్తాడు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై జరిగిన దాడిని చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ నందు కలకత్తా, చెన్నై జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి కెమెరామెన్ పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ వరకు జర్నలిస్టులు అందరూ ర్యాలీగా వెళ్లి సీనియర్ అసిస్టెంట్ మస్తాన్ వలికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే  ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు మాట్లాడుతూ రాప్తాడు లో సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై దాడి చేయడం జగన్ ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్య అన్నారు. ఇండియాలోనే ఫోర్త్ ఎస్టేట్ అని పిలవబడే మీడియాకి ఈ రోజున వైయస్ జగన్ పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని దీనిపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భక్తవత్సలరావు తెలిపారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్ మస్తాన్ వల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభలో స్వయానా మీడియాపై దాడి జరిగితే దీనికి ముఖ్య మంత్రి బాధ్యత వహించి వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ఈనాడు విలేఖరి పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏపీడబ్ల్యూజే తరఫున మస్తాన్ వలీ డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు  అన్నలదాసుశేషగిరిరావు, సెక్రటరీ షేక్.అబ్దుల్ సత్తార్, ఏపీడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లాబక్షు,ఎలక్ట్రాన్ మీడియా కార్యదర్శి మల్లాల కోటేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎన్.బాబ్జీరావ్, నారాయణస్వామి ఆంధ్రజ్యోతి,  పోపూరి వెంకట్రావు,  షేక్.ఫక్రుద్దీన్,ఆలపాటిఆంజనేయులు, కుప్పం.కళ్యాణ్ చక్రవర్తి చుక్కా. విజయ్ కుమార్, విజయ్, ఉప్పల.బాలు, బొందలపాటి.వాసు , మురళి , దాసు, జగదీష్, సిద్ధిక్, నారాయణస్వామి,సలాసం శ్రీనివాసరావు,వెంకట్రావు,జరుగుల శ్రీనివాసరావు, మనోజు, మరియు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - మద్యం మత్తులో కత్తులతో దాడి ఒకరి పరిస్థితి విషమం

చిలకలూరిపేట - మద్యం మత్తులో కత్తులతో దాడి ఒకరి పరిస్థితి విషమం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట టౌన్ మద్యం మత్తులో కత్తులతో దాడి చేసుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని సంజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన సంగుల శివ బాల(26), తాటికొండ వంశీ(26) అనే యువకులు కొంతమంది స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. గతంలో వంశీ సోదరుడిని పై శివ బాల దాడి చేసిన ఘటనను గుర్తుతెచ్చుకొని పాత కక్షల నేపథ్యంలో వంశీ మద్యం మత్తులో విచక్షణను కోల్పోయి దగ్గరలో ఉండే చికెన్ సెంటర్ దగ్గర నుండి కత్తిని తీసుకొని శివబాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మద్యం మత్తులో ఉన్న శివబాల పై మెడపై, తలపై, చేతివేళ్లపై తీవ్రమైన గాయాలై రక్తస్రావంతో అపస్మార్క స్థితిలోకి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఘటనను అడ్డుకొని శివబాలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని సమీక్షించిన వైద్య సిబ్బంది బాధితుడిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించమని తెలిపారు. అపస్మార్క స్థితిలో ఉన్న శివబాలను మెరుగైన వైద్య చికిత్స కై పట్టణంలోని ఆర్కే ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. శివ బాల పరిస్థితి విషమంగా ఉందని స్నేహితులు తెలిపారు. ఘటనకు కారకుడైన వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న టౌన్ సిఐ, ఎస్ఐ పోలీసు సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్


పల్నాడు జిల్లా :- భారీ ర్యాలీతో చిలకలూరిపేట మీదుగా కోటప్పకొండను చేరుకొని ప్రత్యేక పూజలు అనంతరం నరసరావుపేట చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్న మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ..

నా నియోజకవర్గం వదిలి పెట్టి వస్తున్నప్పుడు బాధ వేసింది. పల్నాడు గడ్డపై అడుగుపెట్టిన వెంటనే గర్వంగా ఫీల్ అయ్యా. జగనన్న నన్ను సరైన చోటుకు పంపించాడనుకున్నాను. నా జీవితంలో అనేక కష్టాలు, బాధలున్నాయి. నాకు మీసం తిప్పాలని ఉంది. మా నెల్లూరులో మీసం తిప్పితే రౌడీ అంటారని రాజకీయ నాయకులు చెప్పారు, కాని పల్నాడు వచ్చిన తర్వాత మీసం తిప్పుతా, పంచె కట్టుకుంటా  నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటా. జగనన్న కోసం తల తెగుతుందన్నా ముందుకే వెడతా. రాష్ట్రంలో ఎక్కడైనా ఓడి పోయే సీటు ఉంటే అక్కడికి వెళ్ళమన్నా వెళతాను. నెల్లూరు నాకు సెట్ అవ్వదు అంటారు. నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న పల్నాడుకే నన్ను పంపించారు. గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చారని టిడిపి వాళ్ళు అన్నారు. మా గొర్రెల, బర్రెల పాలు అమ్ముకునే వేల కోట్లు సంపాదించిన విషయం భువనేశ్వరి గుర్తుపెట్టుకోవాలి. నేను గొర్రెలు కాసిన వారసత్వం నుండే వచ్చానని గర్వంగా చెప్పుకుంటాను. నన్ను పెంచుతారో తెంచుతారో మీ చేతుల్లో ఉంది. నా రాజకీయ భవిష్యత్ మీ చేతిలో పెడుతున్నాను. నేను వదిలి పెట్టిన సీటును మైనార్టీకి ఇచ్చారు. నెల్లూరు చరిత్రలో మైనార్టీకి సీటు ఇచ్చిన దాఖలాలు లేవు అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..

తిరిగి సిఎంగా జగన్ చూసే వరకూ అందరి కలిసి పని చేయాలని, టిడిపి ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే అరవై రోజుల్లో తేల్చుకుందామని ఆయన తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో ఎంపి తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తాం అని జోస్యం చెప్పారు.

 ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి, సత్తనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ...

సింహపురి నుండి నూతన ఉత్సాహం నర్సరావుపేటకు వచ్చిందని, జలవనరుల శాఖ సీటును రాంబాబుకు వదిలి పెట్టు అని జగన్మోహన్ రెడ్డి అంటే  వదిలి పెట్టిన విశ్వాస పాత్రుడు అనిల్ అని ఆయనను కొనియాడారు, అలాగే ఇక్కడ సీటు వదిలి పెట్టి గుంటూరు వెళ్ళు అంటే పార్టీనే వదిలి పెట్టిన విశ్వాస ఘాతకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అని ధ్వజమెత్తారు. నరసరావుపేట లోక్ సభ లో ఏ అభ్యర్థికి రానంత మెజారిటీ తో అనిల్ ను గెలిపించాలి అని పిలుపునిచ్చారు. బిసి లకు సీటు ఇస్తామంటే పార్టీ మారిన ద్రోహులకు బిసిల ఓటు అడిగే హక్కు లేదు అని, ఏడు రథాలను నడిపించిగల శ్రీ కృష్ణుడు అనిల్ అని, ఈ రథం కింద అందరూ నలిగిపోవాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు.

పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ....

"చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా బిసిలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారా. మహిళలు గడప దాటకుండానే అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం అందించింది అని ఆయన గుర్తు చేశారు. అలాగే జిల్లా లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ అభ్యర్థులతో పాటు లోక్ సభ అభ్యర్థి అనిల్  ను గెలిపించాలి అని ఆయన పిలుపునిచ్చారు.

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ...

చంద్రబాబుకి అనిల్ కుమార్ పంపి జగన్ కౌంటర్ ఇచ్చారని, తానా తందానా అయిపోయిందయ్య కృష్ణయ్య. అనిల్ కుమార్ యాదవ్ తో కాదు నాతో పెట్టుకో చాలు కృష్ణ అంటూ ఎంపీ లావు కృష్ణ పై కామెంట్స్ చేశారు. అలాగే తోలు తీస్తాం అంటూనారు ఎవరికి తీస్తారు తాట.35 మంది కాపులకు టికెట్స్ జగన్ ఇచ్చారు గుర్తుపెట్టుకో పవన్. నువ్వు 35 టికెట్స్ తెచ్చుకోకపోతే పవన్ కల్యాణ్ కు కాపులు తోలు వలుస్తారు అటు ఆయన ధ్వజమెత్తారు.

Share:

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట టౌన్:-  సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోయిన దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన చిలకలూరిపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే గణపవరం చెందిన మాధవి తన కుటుంబంతో కలసి చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేశా కళ్యాణ మండపంలో వివాహ శుభకార్యానికి హాజరయ్యారు. వివాహం జరుగుతుండగా తమ సెల్ఫ్ ఫోన్ చోరీకి గురయ్యాయని గమనించిన వారు పెళ్లికి హాజరైన బంధువులతో విషయాన్ని పంచుకున్నారు. పెళ్లికి హాజరైన వారిలో మొత్తం ఐదు సెల్ ఫోన్లు దొంగిలించబడినట్లు సమాచారం. సదరు మహిళా సెల్ ఫోన్ చోరీకి గురైందని బాధతో రాత్రి 11 గంటలకు సమయంలో కుటుంబంతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. చిలకలూరిపేట, గణపవరం మధ్య ఉన్న కుప్ప గంజి వాగు సమీపంలో ఇద్దరి యువకులు అనుమానాస్పదంతో ఉండటంతో గమనించి సోదా చేయగా వారి వద్ద దొంగిలించిన సెల్ ఫోన్లు గుర్తించారు. విషయాన్ని గమనించిన ఒక దొంగ వారిని నెట్టివేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పారిపోయాడు. మిగిలిన ఇంకొక దొంగని కాళ్లు చేతులు కట్టివేసి దేహశుద్ధి చేసి ఆరా తీయగా నరసరావుపేటకు చెందిన రామూగా తెలిపాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు దొంగని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాత్రి సమయంలో దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మహిళలను స్థానికులు అభినందించారు. రాత్రి సమయంలో మహిళ అని అధైర్యం పడకుండా ధైర్యంగా దొంగలను ఎదిరించి పట్టుకున్నారు.

Share:

ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

చిలకలూరిపేట:- న‌ర‌స‌రావుపేట‌ పార్లమెంట్ వైయ‌స్సార్‌సీపీ ఇన్ చార్జ్ గా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారికి  ఈనెల 14వ తేదీ బుధ‌వారం ఘన స్వాగతం ప‌లుకుతున్న‌ట్లు జ‌ల‌వ‌న‌రుల‌శాఖామంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేర‌కు న‌ర‌స‌రావుపేట మునిసిప‌ల్ గెస్ట్ లో బుధ‌వారం మీడియా స‌మావేశంలో జ‌లవ‌న‌రుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, వైస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, చిలకలూరిపేట వైయ‌స్సార్ సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ల్లెల రాజేష్ నాయుడు వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మంత్రివ‌ర్యులు అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ కు బీసీ అభ్యర్థిని కేటాయించడం సీఎం జ‌గ‌న్  తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు ప‌రిధిలో అభ్య‌ర్థుల మార్పులు అయిపోయాయ‌ని.. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కులు పోటీ చేయ‌బోతున్నార‌ని తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని.. అందుకే పార్లమెంట్ స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకు రావడం జ‌రిగింద‌ని వివ‌రించారు. 

      ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14న నరసరావుపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు మరియు పార్టీ సానిభూతిపరులకు పిలుపునిచ్చారు. న‌రసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం పలుకుతూ సభను  ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారటే మాటపై నిలిచే వ్యక్తి అని ఎన్నడు లేని విధంగా నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీకి కేటాయించడం గొప్ప విషయం అని అన్నారు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ గారిని అత్యధిక‌ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2019లో మాదిరిగానే 2024లో కూడా జిల్లాలోని 7నియోజకవర్గలు విజయం సాధించ బోతున్న‌ట్లు చెప్పారు.

 వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ల్లెల రాజేష్‌నాయుడు మాట్లాడుతూ.. ఈనెల 14వ తేదీ బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు అనిల్‌కుమార్ యాద‌వ్‌ నెల్లూరు నుండి రోడ్డు మార్గాన బ‌య‌లుదేరుతార‌ని తెలిపారు. మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని అడ్డరోడ్డు సెంట‌ర్ కు చేరుకుంటార‌న్నారు. అక్క‌డ త‌న ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అనిల్‌కుమార్ యాద‌వ్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లక‌నున్న‌ట్లు చెప్పారు. 2:30 గంట‌ల‌కు కోట‌ప్పకొండలో త్రికోటేశ్వ‌రుని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 4 గంట‌ల‌కు కోట‌ప్ప‌కొండ నుంచి బ‌య‌లుదేరి న‌ర‌స‌రావుపేట మండ‌లం పెట్లూరివారిపాలెం చేరుకుంటార‌న్నారు. అక్క‌డ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి స్వాగ‌తం పలకనున్నారు. అక్క‌డి నుంచి న‌ర‌స‌రావుపేట‌ ప‌ల్నాడు బ‌స్‌స్టాండ్ సెంట‌ర్‌లో బ‌హిరంగ స‌భ వ‌ద్ద‌కు చేరుకుంటార‌ని తెలిపారు. స్వాగ‌త ర్యాలీ, బ‌హిరంగ స‌భ‌కు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, సానుభూతి ప‌రులు పెద్ద ఎత్తున హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

Share:

శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్లెల రాజేష్

శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకల్లో పాల్గొన్న మల్లెల రాజేష్

♦️🕉️🕉️♦️ *శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకల్లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారు*  చిలకలూరిపేట పట్టణంలోని పెదనందిపాడు రోడ్డు పక్కన శ్రీనివాసానగర్ కొత్త వాటర్ ట్యాంకు వద్ద వేంచేసియన్న శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకలుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారు ఆదివారం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజేష్ నాయుడు గారు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు పఠాన్ తలహాఖాన్, వైయస్సార్సీపీ నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, పంగులూరి వెంగళ రాయుడు, బేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు,  దేవాలయ కమిటీ సభ్యులు తోకల నాగరాజు దాసరి శివకోటయ్య, పాలపర్తి అంజమ్మ, పాలపర్తి విమలమ్మ, దేవరకొండ ఏడుకొండలు, దేవరకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

చిలకలూరిపేట:-  పట్టణంలోని పెదనందిపాడు మారుతీ నగర్ నందు వేంచేసి ఉన్న జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలుకు వైయస్సార్సీపి నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు పఠాన్ తలహాఖాన్, వైయస్సార్సీపీ నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, పంగులూరి వెంగళ రాయుడు, బేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు,  దేవాలయ కమిటీ సభ్యులు తోకల నాగరాజు దాసరి శివకోటయ్య, పాలపర్తి అంజమ్మ, పాలపర్తి విమలమ్మ, దేవరకొండ ఏడుకొండలు, దేవరకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share:

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

చిలకలూరిపేట:-  నేడు చిలకలూరిపేట పట్టణంలో ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు భారీగా చేరుకున్నారు. గుంటూరు - శంకర్ కంటి ఆసుపత్రి వారి జిల్లా అంగత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షల అనంతరం కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు ఉచిత బీపీ మరియు షుగర్ టెస్టులను చేసి ఆరోగ్య పరిస్థితి మరియు స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఆపరేషన్ చేసే రోజును వారికి ఇస్తారు. అనంతరం ఆయా రోజులలో చిలకలూరిపేట నుండి గుంటూరు శంకర ఆసుపత్రికి ఉచిత బస్సు సౌకర్యంతో ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహిస్తారని టిడిపి నాయకుడు తెలిపారు. వైద్య శిబిరానికి విచ్చేసిన వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాటు చేశారు.

Share:

CR క్లబ్ నందు ఘంటసాల వర్ధంతి మహోత్సవం - పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

CR క్లబ్ నందు ఘంటసాల వర్ధంతి మహోత్సవం - పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

CR క్లబ్ నందు ఘంటసాల వర్ధంతి మహోత్సవం - పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

చిలకలూరిపేట పట్టణం :- సి ఆర్ క్లబ్ నందు గోరంట్ల నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఘంటసాల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు కళాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదలకు మరియు ఎంతోమంది కళాకారులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని ఘంటసాలను కొనియాడారు. అలాగే చరిత్రను మనం ఎప్పుడు మర్చిపోకూడదని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల జీవితాలను ఎప్పుడు మనస్మరించుకుంటా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లీడర్ నాయుడు శివకుమార్, సి ఆర్ క్లబ్ అధ్యక్షులు చెరుకూరి కాంతయ్య, లోక్సత్తా పార్టీ మాదాసు భాను ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రాధాకృష్ణ, రోటరీ క్లబ్ వెంకట్రావు, కళాకారులు గొట్టిపాటి రామారావు, భక్తవత్సలం, రవీంద్ర బాబు, బంగారు బాబు, చించు పున్నయ్య, పావులూరి కృష్ణారావు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - నృత్యం చేస్తూ కళాకారుడు గుండెపోటుతో మృతి

చిలకలూరిపేట - నృత్యం చేస్తూ  కళాకారుడు గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటకు చెందిన పూల చిన్న( వేణుగోపాల్) 37 గుండెపోటుతో మృతి చెందారు వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకు చెందిన పూల చిన్న అనే నృత్య కళాకారుడు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో అమ్మవారి వేషధారణలో కనిపిస్తూ భక్తి రసాన్ని రక్తి కట్టించేవాడు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో మరియు పలు టీవీ కార్యక్రమాలలో కూడా తన నాట్యంతో మెప్పించేవాడు. అయితే గత రాత్రి పెదనందిపాడు రోడ్డు, మారుతి నగర్ లోని జ్వాలాముఖి పోలేరమ్మ మూడవ వార్షికోత్సవ మహోత్సవంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అతను డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు సిపిఆర్ చేసినట్లయితే బ్రతికి అవకాశం ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో సుబ్బయ్య తోటలోని సొంత గృహం నందు విషాదఛాయలు అలముకున్నాయి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నేడు, రేపు కొండవీడు ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

నేడు, రేపు కొండవీడు  ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

 పల్నాడు జిల్లాలో చారిత్రక,సాంస్కృతిక పరంగా, పర్యాటక ప్రాంతాలు ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, అమరావతి మొదలుకొని నాగార్జున సాగర్ వరకు చాలావరకు పర్యాటక పరంగా అభివృద్ధి చెంది ఉన్నాయని, మరికొన్నిటిని అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. పర్యాటక పరంగా అమరావతి, కొండవీడు కోట, కోటప్పకొండ, నాగార్జున సాగర్, ఎత్తిపోతల, పులిచింతల, దైద, గుత్తికొండ బిలం, చేజర్ల, దుర్గి శిల్పకళ, మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం, వెన్న ముద్ద వేణుగోపాల స్వామి టెంపుల్ (చంఘిజ్ ఖాన్ పేట) ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలకు నిలయం పల్నాడు జిల్లాగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. కొండవీడు కోటను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు చుట్టుపక్కల జిల్లాల నుంచి, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్ని ఆ లక్ష్యంతో కొండవీటి కోటను అభివృద్ధి చేశామని, కొండవీటి కోటలో ఉత్సవాల నిర్వహిస్తే, ఆ తరహా పర్యాటక అభివృద్ధికి, బాటలు వేసినట్లు అవుతుందని ఆలోచన చేసామన్నారు, ఆ ప్రాంతమంతా (రిజర్వ్ ఫారెస్ట్) అటవీ ప్రాంతం కావడంతో వారి సహకారంతో సుమారు రూ 4 కోట్లు ఖర్చు చేసి అక్కడ కొన్ని పర్యాటకులకు వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొండవీటి ప్రాంతాన్ని పరిపాలించిన రెడ్డి రాజులు 12,13 శతాబ్దంలో కొండవీడును పరిపాలించారని గుర్తు చేసుకుంటూ "కొండవీటి ఫెస్ట్ - 2024" ఉత్సవాల సందర్భంగా కొండవీడు కోటను సందర్శిస్తే బాగుంటుందని, అక్కడికి వచ్చే సందర్శకుల కోసం యువత, చిన్న పిల్లలు, పెద్దల కోసం ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లో అడ్వెంచర్ లాగా చేస్తే ఆ జ్ఞాపకాలతో కొండవీడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా వారు వెళ్లి ఇంకొంత మంది పర్యాటకులతో చెప్పి తీసుకువచ్చే విధంగా దీనిని తీర్చిదిద్దామన్నారు. కొండవీడు కోటలో ప్రధానంగా ట్రిక్కింగ్, రాక్ లైనింగ్, షూటింగ్, ఆర్చరీ, విధుల చెరువును చాలా క్లిష్టతరమైన పని పూర్తి చేసి బోటింగ్, కయా కింగ్, ఫిషింగ్, హార్సింగ్ ఏర్పాటు చేశాం, ఇది ఎప్పుడు అలానే ఉండేలా తీర్చిదిద్దడం జరిగింది, అక్కడకు వచ్చే పర్యాటకులు రాత్రి విడిది చేసేందుకు ఒక టైం లో "నైట్ క్యాంప్" అక్కడే ఒక టెంట్ ను మరియు భోజన వసతులను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ( జంతు రక్షిత  ప్రాంతం) కనుక ఎటువంటి ప్రాణహాని లేకుండా జాగ్రత్తగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొండవీటి ప్రాంతాన్ని ఒక జాతరలా (ఫెస్టివల్ తరహాలో) జరిగేలా ప్రీ ప్లాన్ గా తీర్చిదిద్దినట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రకటించారు, పల్నాడు జిల్లాతో పాటు పక్క జిల్లాలైన గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా, ప్రకాశం జిల్లాల నుంచి పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో ఫిబ్రవరి 10,11 తేదీల్లో సెలవులు ఉండడంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. పిబ్రవరి 10,11 తేదీల్లో కొండవీడు కోట-2024 ఫెస్ట్ ను చేయ బోతున్నట్లు పైన చెప్పినవన్నీ పర్మినెంట్ యాక్టివిస్ అని, ఇవి కాక  హెలీ రైడ్, పారా రైడ్, హార్స్ రైడ్ లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు, ఇందులో హెలీ రైడ్ కు 4 వేలు ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు, పారా రైడ్ కు 2వేలు, హార్స్ రైడుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉత్సవాల తరహాలో చిన్నపిల్లల కోసం ప్లే ఏరియా ను ఏర్పాటు చేస్తున్నామన్నారు, ప్రత్యేకంగా పిల్లల కోసం తెప్పిస్తున్నామన్నారు. పూల తోటలతో పాటు ఇసుకను ఏర్పాటు చేయించి అందులో సైతక శిల్పం తరహాలో ఆర్ట్ గీసేలా ఏర్పాటు చేస్తామాన్నారు. వీటితోపాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా డాన్స్ ప్రోగ్రాములు ప్రత్యేకంగా డయాస్ ఏర్పాటు చేసి అందులో క్లాసికల్, వెస్ట్రన్ పోటీలను పెట్టడం జరుగుతుందన్నారు, ఇందులో ఎంపిక కమిటీ (జడ్జెస్)ఉంటుందన్నారు.వీటిలో ప్రధమ రూ. 10,116, ద్వితీయ రూ. 5,116,తృతీయ  బహుమతులు రూ.2.500లు ఇవ్వనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొండవీడు కోట-2024 లో ఉత్సాహంగా పాల్గొనే వారికి అన్ని వసతులను కల్పిస్తున్నట్లు, క్రీడలతోపాటు, ఆహ్లాదకరమైన, సహస కృత్యాలు, ఆటలు, ఫుడ్డు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు, ఎవరు ఇక్కడికి వచ్చినా, వారి మదిలో గుర్తుండి పోయేలా "కొండవీడు “ఫెస్ట్-2024" తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట:- పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన L పద్మ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకి చెందిన పద్మ అనే మహిళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గత కొన్ని రోజుల క్రితం 52 ఎకరాల్లోని ప్రభుత్వం వారు నిర్మించిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆమెకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న కుమారుడు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. చలాకీగా ఉండే కుమారుడు మతిస్థిమితం కోల్పోవడంతో మానసికంగా చాలా కృంగిపోయి బాధపడుతూ ఉండేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త కూడా చనిపోవడంతో, పనిచేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక ప్రభుత్వం ఇచ్చే వితంతువు పెన్షన్తో జీవనం సాగించేది. శుక్రవారం రాత్రి ఆర్థిక మానసిక ఇబ్బందులను తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సదరు బంధువులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ 

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట :- పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు పాఠశాల యందు విద్యార్ధిని, విద్యార్థులకు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా  (నులిపురుగుల నివారణ) ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ వేయించడం జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సుధ మాట్లాడుతు విద్యార్థి దశలోనే వ్యక్తి గత పరిశుభ్రత అలవర్చుకోవాలని అన్నారు. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందించుకోవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని. వారంలో ఐదు రోజుల పాటు ఉడక బెట్టిన కొడిగ్రుడ్డు అందిస్తున్నారని అన్నారు. ANM ధన లక్ష్మీ మాట్లాడుతూ ఈ  టాబ్లెట్స్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మెళకువలు తెలియజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వాటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే సుధ, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఏ.నీలిమ. టి.కుమారీ. ఆశ వర్కర్ యన్ రాజేశ్వరి విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరిపేట:- పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయిలోని బీసీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలందరూ పార్టీకి వెన్నుదండుగా ఉన్నారని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ... వైకాపా అయిదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారని ఆ వర్గాలు మళ్లీ జగన్‌కు ఓటేయాలని ప్రశ్నించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్‌ వర్గాలంటే వారి వెన్ను విరిచినందుకా... 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకా... 74మంది బీసీలు నాయకుల్ని క్రూరంగా నరికి చంపినందుకా...  5వేల మందిబీసీలపై దాడులు, అక్రమ కేసులు పెట్టినందుకా... వాళ్లే వైకాపాకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పగలరా అని ప్రశ్నించారు ప్రత్తిపాటి. తెలుగుదేశం ప్రభుత్వ హయంతో ఆత్మగౌరవంతో, అన్నింటా అవకాశాలతో తలెత్తుకుని బతికిన వెనకబడిన వర్గాల వారిని అన్ని విధాలుగా మోసం చేసి రోడ్డున పడేసిన దుర్మార్గుడు జగన్ అని ఆయన దుయ్య బట్టారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జయహో బీసీ సదస్సు నిర్వహించారు. సదస్సులో మాజీమంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ సీఎం చంద్రబాబు బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చిన 1983 తర్వాతే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలకు తెదేపా రాజకీయ ప్రాధాన్యం, ఆర్థిక వెసులుబాటు కల్పించిందన్నారు . అలాంటి పరిస్థితుల నుంచి గడిచిన అయిదేళ్లలో 56 బీసీ కార్పొరేషన్లు అంటూ ప్రచార ఆర్భాటం చేసిన వైకాపా వాటికి పైసా విదల్చక పోగా బీసీ సబ్‌ప్లాన్‌కు చెందిన దాదాపు రూ. 75 కోట్లు దారి మళ్లించడం వారి కుటిలనీతికి నిదర్శమన్నారు. ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపుల్లో కూడా జగన్ అత్యధికంగా అన్యాయం చేస్తోంది బీసీలకే అని తెలిపారు ప్రత్తిపాటి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఈసారి తమ రాజకీయ అవకాశాల పుట్టినిల్లు తెలుగుదేశంతో కలసి నడవాలని కృతనిశ్చయంతో ఉన్నారని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెదేపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నారా భువనేశ్వరి

చిలకలూరిపేట - మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నారా భువనేశ్వరి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట :- నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు గ్రామానికి చెందిన మొగిలి సత్యనారాయణ గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక మనస్థాపనతో గుండెపోటుతో మృతి చెందారు. నేడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన నారా భువనేశ్వరి వారికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయం గా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు, టిడిపి కౌన్సిలర్ సభ్యులు, మాజీ టిడిపి ఎంపీటీసీలు జడ్పీటీసీలు పాల్గొన్నారు.

మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట టౌన్:- పట్టణంలో యువకుడి ఆత్మహత్య వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన గోపి నాయక్ అనే యువకుడు పండరిపురం లోని ఒక వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ జీవం సాధిస్తున్నాడు. ప్రేమ విఫలం అవటంతో మనస్థాపానికి గురై ఈనెల ఐదవ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సింగ్ నగర్ లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవుడై చెట్టుకి వేరేలాడుతున్న గోపి నాయక్ ను చూసి కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

చిలకలూరిపేట:- టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన కుటుంబాలకు అండగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" యాత్రలో భాగంగా... నేడు చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు గ్రామానికి చేరుకోనున్నారు. చంద్రబాబు అరెస్టుపై మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించిన ఎడ్లపాడు ఎస్టి కాలనీకి చెందిన మొగిలి సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి నేడు చిలకలూరిపేట నియోజకవర్గం చేరుకోనున్నారు.

మరిన్ని వివరాలకై క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట :- పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల అనంతరం వైసీపీ నేత జాలాది సుబ్బారావు మాట్లాడుతూ... చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజిని అండ చూసుకొని వారి మామ అయిన విడుదల లక్ష్మీనారాయణ భూకబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరు వాగు పక్కన ఉన్న గొర్రెల సంత వద్ద చిలకలూరిపేట టు పసుమర్తి రోడ్డు మధ్యలో అడ్డంగా గోడ కట్టడం వలన తారు రోడ్డు సాంక్షన్ అయినా కూడా రోడ్డు వేసే కార్యక్రమం ఇంతవరకు చేపట్ట లేదంటే దానికి కారణం రోడ్డుకి మధ్యలో అడ్డంగా గోడ కట్టడం. దాని వలన రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయని, గోడను తొలగించాలంటే కోటి రూపాయలు ఇస్తే కానీ గోడను తొలగించమని విడుదల లక్ష్మీనారాయణ డిమాండ్ చేసినట్లు జాలాది సుబ్బారావు తెలిపారు. ఈ విషయం మంత్రిగారి దృష్టికి తీసుకొని వెళ్లడానికి చాలా సార్లు ప్రయత్నించామని సరైన స్పందన లేకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నామని ఆయన తెలిపారు. పసుమర్తి టు చిలకలూరిపేట రోడ్డు వేస్తే రవాణా సౌకర్యానికి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్:- కేజీబీ అనగానే అదెక్కడుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావచ్చు. కేజీబీ అంటే కృష్ణ గోదావరి బేసిన్ అంటే కాకినాడ తీరంలోని సముద్ర జలాలలో ONGC నిర్వహించిన పరిశోధనలో మన బంగాళాఖాతంలో భారీ ఎత్తున చమురు నిల్వలు సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ తెలిపారు. ప్రతిరోజు 35 వేల నుంచి 45 వేల బేర్ల చమురుని మనం ఉత్పత్తి చేయవచ్చని పరిశోధనలో తేలింది. ఈ గ్యాస్ మరియు ఆయన ద్వారా వచ్చే లాభాలలో 50% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందాలని. మన వాటా మనకు వస్తే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో నుంచి బయటపడవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.

పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సహజ సంపద - ప్రజల హక్కు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నేతలు, ఉద్యమ నాయకులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన హక్కుల గురించి వివరించుతూ ... ఏ రాష్ట్రం నుంచి అయినా సహజ సంపద వలన లాభాలు వస్తాయో ఆ లాభాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి 50% లాభాలను ఇవ్వాలని యాక్ట్ ఉన్నా కూడా మన రాష్ట్రానికి మన వాటా వినటం లేదని వారు తెలిపారు. రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయ నాయకులు వలన లాభాలను మనం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చేర్చాలని నాయకులు తీర్మానించుకున్నారు. ఈ లాభాలను మనం పొందగలిగితే రాష్ట్ర అప్పుల భారం ఎంతో కొంత తీరుతుందని దీని ద్వారా వంద రూపాయలకే ఇంటికి గ్యాస్ సిలిండర్ అందజేయవచ్చు అని దీని పెట్టి అవగాహన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వాళ్ళు పిలుపునిచ్చారు.

Share:

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట - మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సొంత వైసిపి పార్టీ కౌన్సిలర్ స్థలంలో మంత్రిగారి మామ అన్యాయంగా గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారని, బహిరంగ సభలలో వేలకోట్ల అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే గుంటూరు వెళ్లిపోయారని ఆయన ధ్వజమెత్తారు. కౌన్సిల్లో సమస్యల గురించి చెప్పుకుంటే మున్సిపల్ చైర్మన్ సభలో నుంచి వెళ్లిపోయారని వారు తెలిపారు.

మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట :- పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే టిడిపి, వైసిపి కౌన్సిల్ సభ్యులు తమ వాదపవాదాలను చైర్మన్ కు తెలియజేశారు. ఈ సమావేశంలో టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని, చిలకలూరిపేట మున్సిపాలిటీని అవినీతిమయంగా కుంభకోణాల మున్సిపాలిటీగా మార్చేశారని ఆయన ఏదేవా చేశారు. అలాగే ఈ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు ఒకసారి 50 లక్షలు ఒకసారి కొన్ని రోజుల క్రితం 15 లక్షల రూపాయల కుంభకోణం జరిగితే మున్సిపల్ చైర్మన్ రఫాని చేతులెత్తేసారని ఆయన తెలిపారు. మన జరిగిన వైసీపీ సభలో పట్టణంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగకపోగా వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పుకోవటం సిగ్గుచేటని ఆయన తెలిపారు. వీటిపై సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.